Gujarat: ఫోన్లో మాట్లాడుతున్నారని...ఇద్దరు బాలికలపై గ్రామస్థుల దాడి
ఇద్దరు బాలికలు తమ తమ ఫోన్లలో మాట్లాడుతుండగా ఆగ్రహించిన గ్రామస్థులు దాడి చేసి కొట్టిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ
గుజరాత్లోని దహోడ్లో ఘటన
దహోడ్: ఇద్దరు బాలికలు తమ తమ ఫోన్లలో మాట్లాడుతుండగా ఆగ్రహించిన గ్రామస్థులు దాడి చేసి కొట్టిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ నెల రోజుల తర్వాత పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు నిందితులపై కేసు నమోదు చేశారు. దహోడా జిల్లా భువేరా గ్రామంలో 13, 16 ఏళ్ల వయస్సు గల ఇద్దరు బాలికలు జూన్ 25న ఫోన్లలో సంభాషిస్తుండగా 15 మంది పురుషులు తీవ్ర అభ్యంతరం చెబుతూ వారిని చుట్టుముట్టి పరుషమైన పదాలతో దూషించారు. భౌతిక దాడికీ పాల్పడ్డారు. ఈ ఘటనపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దాడి సమయంలో బాలికలు తీవ్ర భయంతో వణికిపోతున్న దృశ్యాన్ని ఎవరో వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. చివరకు పోలీసులు స్పందించి బాలల సంరక్షణ చట్టం కింద నిందితులపై కేసు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!