Crime News: దుబాయ్ నుంచి రాగానే వ్యక్తి కిడ్నాప్.. బంగారం లాక్కెళ్లిన దుండగులు
కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కిడ్నాప్నకు గురయ్యాడు. బాధితుని బంధువులు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాపర్లు అతడిని వదిలేశారు.
కడప : కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కిడ్నాప్నకు గురయ్యాడు. బాధితుని బంధువులు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాపర్లు అతడిని వదిలేశారు. కడప ఖలీల్ నగర్కు చెందిన ఇలియాజ్ జీవనోపాధి కోసం దుబాయ్కి వెళ్లాడు. అక్కడ సంపాదించిన డబ్బుతో కొంత బంగారం తీసుకొని ఇవాళ ఉదయం కడపకు వచ్చాడు. అదే ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇలియాజును అడ్డుకుని ఆటోలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అతడిపై దాడి చేసి బంగారాన్ని లాక్కున్నారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లిందని తెలుసుకున్న కిడ్నాపర్లు అతడిని వదిలేసి.. పోలీసులకు చెప్తే చంపేస్తామంటూ బెదిరించారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.