Hyderabad: శంషాబాద్‌లో కంటైనర్ బీభత్సం.. 2 గంటలపాటు ట్రాఫిక్‌ జామ్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఓ కంటైనర్.. రాంగ్‌ రూట్‌లోకి దూసుకెళ్లి కారును ఢీ కొట్టింది.

Updated : 23 Sep 2023 10:45 IST

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జాతీయ రహదారి (హైదరాబాద్ - బెంగళూరు)పై ఓ కంటైనర్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి కారును ఢీ కొట్టింది. ఆపై డివైడర్‌ పైనుంచి దూసుకెళ్లి సర్వీస్ రోడ్డులో ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు డ్రైవర్లు గాయాలతో బయటపడగా, వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాద కారణంగా శంషాబాద్ - హైదరాబాద్ రహదారిపై రెండు గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని