కేరళలో ఘోరరోడ్డు ప్రమాదం:ఆరుగురు మృతి
కేరళలోని కాసర్గోడ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు రహదారిపై నుంచి అదుపు తప్పి ఓ ఇంటి పైకప్పుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు.
కొచ్చి: కేరళలోని కాసర్గోడ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు రహదారిపై నుంచి అదుపు తప్పి ఓ ఇంటి పైకప్పుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసర్గోడ్ సమీపంలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఎత్తయిన ప్రాంతం నుంచి బస్సు దిగే క్రమంలో అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ ఇంటి పైకప్పుపై పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు.
మృతదేహాల్ని పూదమకల్లు తాలుకా ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో శ్రేయస్(13), రవిచంద్ర(40), జయలక్ష్మీ(39), రాజేష్(45), సుమతిలను గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని మంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఇతర క్షతగాత్రుల్ని సమీపంలోని ఇతర ఆస్పత్రులకు తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా వధువు తరపు బంధువులే కావడం గమనార్హం. వారంతా సూలియా ప్రాంతం నుంచి పనత్తూరు ఎల్లుకొచ్చికి ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు. బస్సు పడిన ఇల్లు జోస్ అనే వ్యక్తికి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని జోస్ తెలిపారు.
కాగా ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి
అటల్ టన్నెల్ వద్ద చిక్కుకున్న పర్యాటకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
కోనసీమ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. -
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!
Crime: ఓ దొంగ తన చేతివాటం ప్రదర్శించేందుకు ఏకంగా విమాన ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకున్నాడు. అత్యంత భద్రత ఉండే విమానాశ్రయాల నుంచి ఇన్నాళ్లూ చాకచక్యంగా తప్పించుకు తిరిగాడు. -
ఓటేసేందుకు వచ్చి.. మృత్యుఒడికి చేరి
ఓటుహక్కు వినియోగించుకునేందుకు యువత నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపారు. -
ఓటేయడానికి వెళుతూ.. కుమారుడు సహా దంపతుల మృత్యువాత
హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు సొంతూరు వెళుతున్న దంపతులు, ఎనిమిదేళ్ల వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రహదారి పక్కన మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద వీరు అల్పాహారం తింటుండగా.. -
ఎన్నికల విధుల్లో ఇద్దరు ఉద్యోగుల మృతి
వేర్వేరు ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం ఒకరు చనిపోగా, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఆదివారం రాత్రి మరొకరు మృతిచెందారు. -
ఇద్దరు వృద్ధుల దుర్మరణం
వేర్వేరు గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్తూ ఇద్దరు వృద్ధురాళ్లు మృతిచెందారు. ఒకరు ఓటు వేయకుండానే.. మరొకరు ఓటు వేశాక మరణించారు. -
ఐఈడీ బాంబులు పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పెట్టిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు బాలురు మృతి చెందారు. -
మహారాష్ట్రలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బాంబ్రగఢ్ కత్రన్గట్ట అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!