స్వపక్షంలో విపక్షం!
అధికార భారాసలో విభేదాలు భగ్గుమన్నాయి. మొన్న పీహెచ్ వర్కర్ల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు, నిన్న మాస్టర్ప్లాన్లో లోటుపాట్లతో బల్దియా విషయం రాష్ట్రవ్యాప్తంగా రచ్చకెక్కింది.
బల్దియా పాలకవర్గంలో బహిర్గతమైన విభేదాలు..
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే
అధికార భారాసలో విభేదాలు భగ్గుమన్నాయి. మొన్న పీహెచ్ వర్కర్ల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు, నిన్న మాస్టర్ప్లాన్లో లోటుపాట్లతో బల్దియా విషయం రాష్ట్రవ్యాప్తంగా రచ్చకెక్కింది. తాజాగా.. మున్సిపల్ ఛైర్మన్పై స్వపక్షంలోని సభ్యులే అవిశ్వాసం ప్రకటిస్తుండటం పార్టీలోని వర్గపోరును మరింత తేటతెల్లం చేస్తోంది. మంత్రి సొంత నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొనడంతో ఏం జరగనుందోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇదీ జరిగింది..
పాలకవర్గం కొలువుదీరి మూడేళ్లు పూర్తవుతుండటం, అవిశ్వాసం పెట్టేందుకు అవకాశమున్న తరుణంలో.. రెండు రోజుల కిందట పట్టణానికి చెందిన పలువురు కౌన్సిలర్లు రహస్యంగా సమావేశమయ్యారు. మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారన్న సమాచారం లీకైంది. దీంతో ఛైర్మన్ సోమవారం రాత్రి తన వర్గీయులతో మున్సిపల్ కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. అనంతరం అందరూ కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. నిర్మల్ మున్సిపల్లో ఎలాంటి అవిశ్వాసానికి తావులేదని, మంత్రి నేతృత్వంలో పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. వదంతులు నమ్మొద్దన్నారు. మూడేళ్లు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో కౌన్సిలర్లంతా కలిసి విహారయాత్ర వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.
వైరల్గా మారిన కౌన్సిలర్ మాటలు..
మున్సిపల్ ఛైర్మన్ చేసిన ప్రకటన అనంతరం భారాసకు చెందిన కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ అర్ధరాత్రి సమయంలో వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. మున్సిపల్ ఛైర్మన్ అవినీతి, అక్రమాలకు వంతపాడుతున్నాడంటూ తీవ్రంగా మండిపడ్డారు. మంత్రికి, పార్టీకి చెడ్డపేరు వస్తోందని, తాము పార్టీని వ్యతిరేకించడం లేదని, ఛైర్మన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
మంత్రి రహస్య సమావేశం..
బల్దియాలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మంగళవారం సాయంత్రం పట్టణంలో పార్టీ కౌన్సిల్ సభ్యులతో రహస్య సమావేశం నిర్వహించారు. సభ్యుల మధ్య నెలకొన్న వైషమ్యాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏం చేయాలో చర్చించారు. అయితే.. విభేదాలను సద్దుమణిగింపచేసేందుకు ఏం నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాన పార్టీల్లో పైసల లొల్లి?
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రచారం నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య పైసల లొల్లి మొదలైంది. -
విత్తు రైతు చిత్తు
[ 11-05-2024]
విత్తనోత్పత్తికి జిల్లా భూములు అనుకూలంగా ఉండటంతో యాసంగిలో ఏటా శనగ విత్తనాలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 20 గ్రామాల్లో ఆసక్తి గల రైతులను ఎంపిక చేసి శనగ విత్తనోత్పత్తి చేయించారు. -
మేం తలుచుకుంటే గల్లీలో మీరు తిరగలేరు
[ 11-05-2024]
భారాస కార్యకర్తలు, నాయకులు తలుచుకుంటే గల్లీల్లో ఏ భాజపా, కాంగ్రెస్ నేతలు తిరగలేరని ఎమ్మెల్యే అనిల్జాదవ్ అన్నారు. భైంసా పర్యటనలో ఉన్న కేటీఆర్పై రెండు పార్టీల కార్యకర్తలు ఉల్లిగడ్డలతో దాడి ఎలా చేస్తారన్నారు. -
కదిలొచ్చిన ‘కమల’దళం
[ 11-05-2024]
భాజపా ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో రోడ్షో నిర్వహించారు. పార్టీశ్రేణులు భారీగా తరలిరావడంతో పురవీధులు కాషాయమయమయ్యాయి. -
భాజపా తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
[ 11-05-2024]
భారత రాజ్యాంగం, రిజర్వేషన్లపై భాజపా వైఖరితో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి పట్టణంలో రోడ్షో నిర్వహించారు. -
ప్రచారం నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఘట్టం శనివారంతో పరిసమాప్తం కానుంది. ఉమ్మడి జిల్లాలో పశ్చిమ ప్రాంతంగా పేరొందిన ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్, బోథ్ నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరుగంటల వరకు ప్రచారానికి అవకాశం ఉంది. -
రహదారులపైనే వ్యాపారాలు
[ 11-05-2024]
రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా ఆదిలాబాద్ పట్టణంలో ప్రమాదాల నివారణకు రహదారుల మధ్య డివైడర్లు నిర్మిస్తూ, రహదారులను విస్తరిస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నారు. -
ఓటేస్తాం.. సమర్థులను ఎన్నుకుంటాం
[ 11-05-2024]
ఓటు వేస్తే ఏమిటీ, వేయకపోతే ఏమిటీ అనే నిర్లక్ష్య ధోరణిని విడనాడుతామని నవ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఎంత దూరమున్నా ఎన్నికల రోజు సొంతూరు చేరుకుంటామని, అయిదేళ్లు సుపరిపాలనకు తామే నిర్మాతలమని అంటున్నారు. -
మౌనం వీడిన సోయం!
[ 11-05-2024]
టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఎంపీ సోయం బాపురావు ఎట్టకేలకు మౌనం వీడారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. -
నోటా జోరు.. పార్టీల బేజారు
[ 11-05-2024]
ఎన్నికల్లో ఆడింది ఆట.. తాము పాడిందే పాటగా వ్యవహరించే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఆటలు ఇక సాగవని ఓటు గుద్ది మరీ చెబుతున్నారు ఓటర్లు. కులం, మతం, అంగ, అర్థ బలాలకంటే అభ్యర్థి గుణ గణాలు, సమర్థతకే ప్రాధాన్యమిస్తున్నారు. -
నిర్భయంగా ఓటేయ్యాలి..
[ 11-05-2024]
మరో రెండు రోజుల్లో జరిగే లోక్సభ పోలింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని, పూర్తి స్థాయిలో భద్రత చర్యలు తీసుకున్నామని ఎస్పీ సురేష్కుమార్ అన్నారు. -
అటవీ అధికారులు, రైతుల మధ్య భూవివాదం!
[ 11-05-2024]
రెబ్బెన ఫారెస్టు రేంజ్ పరిధిలోని తక్కళ్లపల్లి సెక్షన్, తుంగెడ బీట్ పరిధిలో 417 కంపార్టుమెంట్ (రిజర్వు ఫారెస్టు)లో.. తుంగెడ గ్రామ పంచాయతీ పరిధిలోని బెస్తవాడకు చెందిన పలువురు రైతులు శుక్రవారం ఉదయం భూమి చదును చేసేందుకు వెళ్లారు. -
మేం ఓటేసేదెలా..?
[ 11-05-2024]
జిల్లాలోని వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న పలువురికి శుక్రవారం ఎన్నికల విధులు కేటాయించడంతో అయోమయానికి గురవుతున్నారు. ఓటు ఒకచోట ఉండి, తమకు వేరే చోట విధులు కేటాయిస్తే.. ఎలా వేసేదని చర్చలు మొదలయ్యాయి. -
ఎన్నికల సమరం.. నిర్వహణే కీలకం
[ 11-05-2024]
ఎన్నికల నిర్వహణ అంత సులువైన వ్యవహారం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైనది. ఓటుహక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది. ఓటు నమోదు మొదలుకుని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అధికార యంత్రాంగం శ్రమపడాల్సి ఉంటుంది. -
ఇక ఇంటింటా...
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే ఆయా పార్టీల అగ్రనేతల బహిరంగ సభలు, రోడ్షోలు పూర్తికావడంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరించే ప్రక్రియ జోరుగా సాగుతోంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
[ 11-05-2024]
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!