logo

వైభవంగా హనుమాన్ శోభాయాత్ర

జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది.

Updated : 23 Apr 2024 21:17 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. అంతకుముందు శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో వేద పండితులు హనుమాన్ దీక్ష స్వాముల పాదాలను శుద్ధిచేశారు. అనంతరం మఠాధిపతి యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ భారీ హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ప్రతి కూడలి వద్ద శోభాయాత్రను ఆపి హనుమాన్ చాలీసాను పఠించారు. ఈ కార్యక్రమంలో అన్ని హిందూ ధార్మిక సంఘాల నాయకులు,  ప్రజలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని