భాజపా, కాంగ్రెస్ అంతర్గత ఒప్పందం
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా, కాంగ్రెస్ అధిష్ఠానాలు అంతర్గత ఒప్పందం చేసుకున్నాయని భారాస జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ప్రభుత్వ విప్ ఆరోపించారు.
భారాస జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపణ
మాట్లాడుతున్న భారాస జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, పక్కన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు తదితరులు
మంచిర్యాల పట్టణం, న్యూస్టుడే: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా, కాంగ్రెస్ అధిష్ఠానాలు అంతర్గత ఒప్పందం చేసుకున్నాయని భారాస జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ప్రభుత్వ విప్ ఆరోపించారు. మంచిర్యాలలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు భాజపా, కరీంనగర్లో భాజపా అభ్యర్థి విజయానికి కాంగ్రెస్ పార్టీలు పరస్పరం డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే స్వయంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే కాంగ్రెస్కు ఓట్లు వేయని పరిస్థితిలో భాజపాకు వేయాలని మాట్లాడిన మాటలను చరవాణిలో చూపించారు. దేశంలో భాజపా, కాంగ్రెస్లే తప్ప ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని ఆ రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఎన్నికల సంఘం మాజీ సీఎం కేసీఆర్ ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించడం అమానుషమని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, మ్యానిఫెస్టోలో పెట్టిన 420 హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందన్నారు. గతంలో కేసీఆర్ను కుటుంబ పాలన చేస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ఎన్నికల్లో పోటీ చేయడం కుటుంబ పాలన కాదా అని ఆయన ప్రశ్నించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్కు ఎస్సీ అభ్యర్థులే దొరకలేదా అని ఎద్దేవా చేశారు. ఈ ఎస్సీ రిజర్వు స్థానాలు భవిష్యత్తులో రిజర్వేషన్ మారినా వారి భార్యలతో ఎన్నికల్లో పోటీ చేయిస్తారని విమర్శించారు. భారాస ప్రభుత్వ పాలనలో కేసీఆర్ ఇంద్రకరణ్రెడ్డికి రెండుసార్లు మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం దుర్మార్గమని అన్నారు. ఈ నెల 4న మంచిర్యాలలో నిర్వహించే రోడ్షోలో కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. సింగరేణి కార్మికుల కష్ట నష్టాలు తెలిసిన భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ మంచిర్యాలలో నిర్వహించే కేసీఆర్ రోడ్షోకు ప్రజలందరూ తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. భారాస పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, నాయకులు విజిత్రావు, వెంకటేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్హత లేకున్నా.. చికిత్స..!
[ 21-05-2024]
నిబంధనల ప్రకారం రోగులకు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు మాత్రమే ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు అవకాశముంది -
మూడేళ్లుగా ముప్పుతిప్పలు
[ 21-05-2024]
కోటపల్లి మండలంలోని ప్రాణహిత తీరప్రాంత గ్రామాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారిని బాగు చేయడంలో మూడేళ్లుగా నిర్లక్ష్యం వెంటాడుతోంది. -
తరుగు పేరిట దోపిడీ
[ 21-05-2024]
అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే రైతులు దోపిడీకి గురవుతున్నాడు. అకాల వర్షాలతో కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసిపోవడంతో ఆరబెట్టేందుకు అనేక అవస్థలు పడ్డారు -
అధికార్ల మెలిక.. అన్నదాత తికమక
[ 21-05-2024]
వానాకాలం పంటల సాగు నేపథ్యంలో.. ఇప్పటికే పలువురు రైతులు భూములను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. కానీ అటవీహక్కు పత్రాలు కలిగిన భూముల్లో ట్రాక్టర్లతో దున్ననివ్వకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు -
ఎమ్మెల్యే హరీశ్బాబును అడ్డుకున్న పోలీసులు
[ 21-05-2024]
జైనూరు మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఓ వర్గం సభ్యులు గాయపడిన విషయం విదితమే. -
తోటి మిత్రులే హంతకులై.!
[ 21-05-2024]
మండలంలోని గన్నారంలో పలువురు మిత్రులు మద్యం మత్తులో తోటి స్నేహితుడిని దారుణంగా హతమార్చారు. -
రూ. 47 లక్షల విక్రయాలకు లెక్కల్లేవ్!
[ 21-05-2024]
రైతులకు రుణాలు అందించి సకాలంలో ఎరువులను సరఫరా చేసి అండగా నిలవాల్సిన వ్యవసాయ సహకార సంఘాలు అస్తవ్యస్త నిర్వహణతో గాడి తప్పుతున్నాయి. -
తడబడితే తప్పదు మూల్యం
[ 21-05-2024]
విద్యాసంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తోక పేర్లతో నూతన బ్రాంచిల పేరిట ఆయా ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. -
సర్కారు బడులు.. చకచకా పనులు
[ 21-05-2024]
భీంపూర్ జిల్లా పరిషత్ స్కూల్లో ప్రహరీ, టాయిలెట్లు, ఫ్లోరింగ్, విద్యుత్తు వంటి మరమ్మతులతోపాటు తాగునీటి సౌకర్యం కోసం కుళాయిలు ఏర్పాటు చేశారు -
రెండేళ్లుగా ఎదురుచూపులే
[ 21-05-2024]
తాంసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 2023లో కేంద్ర బృందం సందర్శించింది. రోగులకు ఉత్తమ వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, మందుల నిల్వలు తదితర విషయాల్లో అత్యుత్తమ పనితీరుతో ఎన్క్వాస్కు ఎంపిక చేశారు. -
విత్తన గుట్టు విప్పండి..
[ 21-05-2024]
‘‘ మీరు కోరుకున్న కంపెనీ విత్తన సంచి కావాలంటే మేం చెప్పే మరో కంపెనీకి చెందిన రెండు విత్తన సంచులు కొనాలి. లేనట్లయితే మీరు చెప్పే విత్తనాలు ఇవ్వటం కుదరదు. -
మానవతావాదులు స్పందించారు..
[ 21-05-2024]
బ్రెయిన్ స్ట్రోక్తో అపస్మారక స్థితిలో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుడు శంకర్ జాడే చికిత్స నిమిత్తం మానవతావాదులు తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
-
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
-
‘ఫ్యామిలీస్టార్’కు నెగెటివ్ టాక్ ఇలా క్రియేట్ చేశారు: ఆనంద్ దేవరకొండ