ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు.
కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల తీరిది!
ఆదివారం అర్ధరాత్రి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంటనే మృత శిశువును శస్త్రచికిత్స చేసి తొలగించి బాలింత ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు.. 12 గంటలు ఆలస్యం చేయడంతో ఆమె ఆరోగ్యం విషమించి మృతి చెందింది. దీంతో దాదాపు ఆరుగంటల పాటు మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందినట్లు బంధువుల ఫిర్యాదు మేరకు కాగజ్నగర్ పోలీసులు ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఆ ఆసుపత్రిలోని ఇద్దరు వైద్యులు సిర్పూరు(టి) సివిలాసుపత్రిలో ప్రభుత్వ వైద్యులుగా విధులు నిర్వహిస్తూ ఈ ఆసుపత్రిని నిర్వహిస్తుండటం గమనార్హం.
రెండేళ్ల కిందట కాగజ్నగర్లోని రాజీవ్గాంధీ చౌరస్తాలో ఉన్న ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలోనూ కాగజ్నగర్ మండలానికి చెందిన నిండు గర్భిణి ప్రసూతి సేవలకు రాగా.. వైద్యం వికటించి బాలింత, నవజాత శిశువు మృతి చెందారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఆ వైద్యురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పట్టణంలోని పెట్రోల్పంపు ఏరియాలోనూ ఏడాది కిందట ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలోనూ ఓ గర్భిణి వైద్యం వికటించి మృతి చెందింది. పట్టణంలోని పలు పిల్లల వైద్య ఆసుపత్రుల్లోనూ కనీస సదుపాయాలు లేక నవజాత శిశువులు మృతి చెందిన ఘటనలున్నాయి.
కాగజ్నగర్, న్యూస్టుడే: అర్హులైన వైద్యులు అందుబాటులో లేకున్నా.. ధనార్జనే ధ్యేయంగా కొందరు ఆసుపత్రులు ఏర్పాటు చేసి, అమాయకుల జేబులు గుల్ల చేస్తున్నారు. డబ్బులు పోయినా ప్రాణాలైనా దక్కుతున్నాయా అంటే అదీ లేదు. ఇష్టారాజ్యంగా పరీక్షలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో మొత్తం 27 ప్రైవేటు ఆసుపత్రులు ఉండగా.. కాగజ్నగర్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో రెండింటికి ఎటువంటి అనుమతులు లేనట్లు సమాచారం. వైద్యశాఖ నిబంధనల మేరకు.. పలు ఆసుపత్రులను నిర్వహించడం లేదు. కాగజ్నగర్లోని రాజీవ్గాంధీ చౌరస్తాలో ఉన్న ఓ ప్రైవేటు ప్రసూతి సేవల ఆసుపత్రి మూడు అంతస్థుల్లో నిర్వహిస్తుండగా.. కనీసం లిఫ్ట్ సదుపాయం లేదు. ఇటీవల ఓ బాలింతను మెట్ల నుంచి తీసుకువస్తుండగా.. కిందపడటంతో వైద్యం వికటించి మృత్యువాత పడింది. సదుపాయాలు లేవని పట్టణంలోని పలువురు వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. తనిఖీలు చేసిన దాఖలాలు లేవు.
నిపుణులైన వైద్యులేరి?
పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిల్లో నిపుణులైన స్త్రీవైద్య నిపుణులు మాత్రమే మహిళలు, గర్భిణులకు ప్రసూతి సేవలు అందించాలి. కానీ పిల్లల వైద్య నిపుణులు, జనరల్ ఫిజీషియన్లు, ఆర్ధోపెడిక్, తదితర వైద్యులు కూడా గర్భిణులకు ప్రసూతి వైద్య సేవలు చేస్తున్నారు. ఇది పూర్తిగా వైద్యశాఖ నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ కొనసాగిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే.. సంబంధిత కుటుంభీకులకు కొంతమేరకు సహాయం అందించి చేతులు దులుపుకొంటున్నారు. ఉన్నతాధికారులు సదరు ప్రైవేటు ఆసుపత్రులపై శాఖపరమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
- ఓ వ్యక్తి ద్విచక్రవాహనం నుంచి కింద పడగా కాలికి గాయమైంది. కాగజ్నగర్ పట్టణంలోని పెట్రోల్పంపు ఏరియాలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్న ఆర్ధోపెడిక్ వైద్య నిపుణుడిని సంప్రదించాడు. కాలు ఫ్రాక్చర్ అయిందని, ఆపరేషన్ చేయాలంటూ రూ.50 వేల నుంచి రూ.70వేలు అవుతుందని చెప్పి ఓ పేపర్లో వివరాలు రాసిచ్చాడు. అతను హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. కాలికి ఫ్రాక్చర్ లేదని, స్వల్ప గాయంగా పేర్కొంటూ మందులు ఇవ్వడంతో నయమైంది. తదనంతరం అతను సదరు వైద్యుడు రాసిచ్చిన పత్రాలతో కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆ వైద్యుడు బాధితుడికి కొంత నగదు అప్పజెప్పి, కేసును ఉపసంహరించుకునేలా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిపై ఫిర్యాదు
[ 16-05-2024]
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డితోపాటు మరో 10 మందిపై అల్లూరి సంజీవరెడ్డి, గండ్రత్ సుజాత, గండ్రత్ ఆశన్న వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని నిరసన
[ 16-05-2024]
పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారాస ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. -
ప్రత్యేక కేంద్రం.. మిశ్రమ ఫలితం
[ 16-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు, పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. -
కనిపిస్తే.. కరుస్తున్నాయి!
[ 16-05-2024]
జిల్లాలో శునకాలు బెంబేలెత్తిస్తున్నాయి. పని నిమిత్తం బయటకు వచ్చే వారిపై దాడులు చేసి కండలు పీకుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా కాలనీల్లో గుంపులుగా సంచరిస్తున్నాయి. -
రిమ్స్ ఒప్పంద ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
[ 16-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్ టేకర్గా పని చేసే లక్ష్మి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సూపర్వైజర్ అకారణంగా తనను పనిలోకి రావొద్దంటూ బెదిరించారంటూ రాత్రి అక్కడే పడుకున్న ఆమె తెల్లవారుజామున మరుగుదొడ్డి శుభ్రం చేసే రసాయనం తాగేసింది. -
ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని సేవలు
[ 16-05-2024]
ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్)లలో ఇప్పటికే అందిస్తున్న అయిదు రకాల సాధారణ సేవలతోపాటు ఏడు రకాల ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
దిల్లీ దూరమనుకోలేదు..!
[ 16-05-2024]
ఓటర్లు ఎన్నికలపై ఎంత ఆసక్తి కనబరిచారనేది పోలింగ్ శాతాన్ని బట్టి తెలుస్తుంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. -
బోసిపోతున్న థియేటర్లు
[ 16-05-2024]
ప్రస్తుత ఉరుకులు పరుగుల జనజీవన గమనంలో ప్రజలు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. వాటి నుంచి కాసింత ఉపశమనం పొందాలని థియేటర్లను ఆశ్రయిస్తున్నారు. -
వద్దన్నా వినరు.. అక్రమాలు ఆపరు
[ 16-05-2024]
ప్రభుత్వ, అసైన్డ్, వివాదం, కోర్టు కేసుల్లో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయరాదనేది నిబంధన. ఒకవేళ ఎవరైనా ఇటువంటి స్థలాలను రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించాలి. -
బియ్యం దందా.. అధికారుల అండ!
[ 16-05-2024]
ఈ నెల 7న చింతలమానేపల్లి మండల కేంద్రం నుంచి పలు వాహనాల్లో 11 క్వింటాళ్ల రాయితీ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా, టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికల వేళ రూ.2.04 కోట్లు పట్టివేత
[ 16-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రూ.2,04,72,950 నగదు పట్టుకున్నట్లు ఎస్పీ సురేష్కుమార్ వెల్లడించారు. ఇదే కాకుండా రూ.2.40 లక్షల విలువైన 9.58 కిలోల గంజాయి, 14 గంజాయి మొక్కలను పట్టుకున్నామన్నారు. -
ఓటు హక్కుకు దూరం @ 2,21,397
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన క్రతువు ముగిసింది. ఇప్పుడంతా జూన్ 4న జరిగే కౌంటింగ్పైకి దృష్టి మళ్లింది. ఎవరు గెలుస్తారు. ఎన్ని ఓట్లు వస్తాయనే విషయంపై చర్చ నడుస్తోంది. -
144 సెక్షన్ అమలు
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి హాజీపూర్ మండలం ముల్కల్ల ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట భద్రత చేపట్టాలని పాలనాధికారి బి.సంతోష్ ఆదేశించారు. -
పొంగిపొర్లిన మద్యం..!
[ 16-05-2024]
భగభగ మండుతున్న సూర్య ప్రతాపమో.. లేక అలవాటు పడ్డ ప్రాణమో.. తెలియదుగానీ.. చల్లచల్లగా.. అనుకుంటూ మందుబాబులు ఈ వేసవిలో ఎక్కువగా తాగేస్తున్నారు. -
డెంగీ నియంత్రణకు చర్యలు
[ 16-05-2024]
జిల్లాలో డెంగీ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా అదనపు పాలనాధికారి సబావత్ మోతీలాల్ తెలిపారు. -
పల్లె భళా.. పట్టణం డీలా
[ 16-05-2024]
పల్లె ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణాల్లో మళ్లీ అదే పరిస్థితి.. ఎక్కువగా నిరక్షరాస్యులు ఉంటారని అనుకున్న పల్లె ప్రజలు ఓటెత్తగా.. విద్యావంతులకు నిలయంగా ఉన్న పట్టణాల్లో ఓటు వేసేందుకు అనాసక్తి చూపిస్తున్నారని మళ్లీ రుజువైంది. -
అటకెక్కిన పరీక్షలు
[ 16-05-2024]
అక్షయ తృతీయ తిథి శుభదినంగా భావించిన రైతులు పంటల సాగుకు ముందుకెళ్తున్నారు. విత్తనాల కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో రైతులు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
-
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!