దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం.
అనిశాకు పట్టుబడుతున్న వారిలో యువతరమే అధికం
జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్లు. కానీ.. వ్యక్తిత్వం కోల్పోతే సర్వం పోగొట్టుకున్నట్లే
స్వామి వివేకానంద
పూలపరిమళం గాలివాటానికే వెళ్తుంది. కానీ మనిషి మంచితనం నలుదిక్కులా ప్రసరిస్తుంది
చాణక్యుడు
ఏ వ్యక్తైనా పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పని చేసినా ఎప్పటికీ అతడిని విడువని నీడలాగా ఆనందం వెన్నంటే ఉంటుంది
గౌతమ బుద్ధుడు
నిర్మల్ పట్టణం/మామడ, న్యూస్టుడే: ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. అలాంటి వాటిని దక్కించుకొని నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తున్న వ్యక్తుల్లో కొందరు తమకొచ్చే వేతతం చాలదని, తాము చేయాల్సిన పనులను పూర్తిచేసేందుకు లంచాల కోసం అర్రులు చాస్తున్నారు. చిరుద్యోగులు, రైతులు, కాయకష్టం చేసుకునేవారు.. ఇలా ఒకటేమిటి మూడుపూటలా తిండి తినడమే అదృష్టమని భావిస్తున్న వారినీ వదలకుండా తమ సంపాదన కోసం వేధిస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతున్నారు. నలుగురిలో నవ్వులపాలవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ మధ్యకాలంలో అనిశా దాడుల్లో పట్టుబడ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
సంతృప్తి ముఖ్యం..
నడుచుకుంటూ వెళ్తున్నామని కాదు.. కాళ్లు లేక నడవలేకపోతున్నవారిని చూసి మన అదృష్టానికి ఆనందించాలి. సైకిల్పై వెళ్తున్న వారు కాలినడకన పోతున్న వారిని చూసి సంతృప్తి పడాలి. సైకిల్మోటారుపై వెళ్తున్న వారు సైకిల్పై వెళ్లే వారికన్నా మనం నయమనుకోవాలి. కారులో ప్రయాణించే వారు ద్విచక్రవాహనదారున్ని చూసి వాళ్లకన్నా మనం మంచి స్థితిలో ఉన్నామన్న విషయాన్ని గమనించాలి. అయితే.. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లాలనుకోవడంలో తప్పులేదు. అందుకు సక్రమమైన మార్గాన్ని ఎంచుకోవాలి. నిజాయతీగా, ధర్మబద్ధంగా సంపాదించిన సొమ్ముతో ఎదిగే ప్రయత్నం చేయాలి. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎదుగుదలంతా పారదర్శకంగా ఉందనిపించాలి. అంతే తప్ప ఆకాశమంత ఎదగాలని అవినీతితో మెట్లు కడితే అవి కూలిపోకతప్పదు. మనం బోర్లాపడక తప్పదు.
పనిచేసే వారికీ చెడ్డపేరు..
ప్రభుత్వ ఉద్యోగం.. నెల తిరిగేసరికి చక్కని వేతనం.. బాదరబందీ లేని జీవితం.. ఇలాంటి స్థితిలో ఉద్యోగులెవరైనా సంతృప్తిగా బతకొచ్చు. కానీ ఎందుకో కొంతమందికి అది సరిపోవడం లేదు. అన్నం బదులుగా డబ్బులే తినేస్తున్నారా అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రతి చిన్నపనికీ ఎంతోకొంత ఆశపడుతున్నారు. ఎదుటి వ్యక్తులను పీడిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరైనా అవినీతి నిరోధక శాఖకు చిక్కినప్పుడల్లా సామాన్యులు ఇలా మండిపడుతున్నారు. కాలానుగుణంగా వేతనాలు పెరిగినా, కొందరు చేస్తున్న అవినీతి మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొస్తోంది. ఫలితంగా అక్కడక్కడా నీతి నిజాయతీలతో పనిచేసే ప్రభుత్వోద్యోగులు సైతం లంచావతారుల మూలంగా మాటలు పడాల్సి వస్తోంది.
ప్రతిభతో వచ్చి.. తల దించుకోవాలా..
- ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేసిన ఓ ఎస్సై గతంలో అనిశాకు చిక్కారు. కొద్దిరోజుల తర్వాత అందరూ ఆ విషయం మర్చిపోయారు. అయితే.. ఆయన బ్యాచ్కు చెందిన వారంతా సీఐలుగా పదోన్నతి పొందినా, ఆయనకు మాత్రం రాలేదు. కారణం.. అనిశాకు చిక్కిన సందర్భంలో జతకూడిన సర్వీస్ రిమార్క్. ఈ కారణంగానే.. ఆయనకన్నా తక్కువ వయసున్న వారూ పైఅధికారులుగా వస్తున్నా అతడు మాత్రం ఇంకా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వెలితి జీవితకాలమంతా ఉంటుంది. పనిచేసే సమయంలో కక్కుర్తిగా వ్యవహరించకుండా నిజాయతీగా ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా.
పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం రావడమంటే మాటలు కాదు. ఎంతో ప్రతిభ ఉండాలి. పోటీ పరీక్షల్లో ఎందరినో వెనక్కినెడితే కానీ ఉద్యోగం రాదు. అది సాధిస్తే చాలా గర్వంగా ఉంటుంది. దాన్ని కాపాడుకోవాలి. ఉద్యోగంలోకి వచ్చాక వేతనంతో సంతృప్తి పడకపోతే, ఆయాచితంగా వస్తుంది కదా అని అవినీతికి అలవాటు పడితే కడుపుమండిన వారిలో ఎవరో ఒకరు భరతం పట్టిస్తారు. అనిశాకు చిక్కిస్తారు. అప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా కుటుంబానికి, బంధువులకు అందరికీ తలవంపులు తెచ్చే బదులు న్యాయంగా వచ్చే వేతనంతో బతకలేమా అనే కోణంలో ఆలోచించినా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవు.
యువ‘తరమే’ అధికం..
ఈ మధ్యకాలంలో చోటుచేసుకుంటున్న అనిశా దాడుల్లో పట్టుబడుతున్న వారిలో యువతరం అధికంగా ఉండటం గమనార్హం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు ఎస్సైలు, ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి, రెవెన్యూ అధికారి.. ఇలా ఉద్యోగ జీవితం కొత్తగా ప్రారంభించిన తొలినాళ్లలో వారే కావడం గమనార్హం. అక్రమమార్గంలో డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఉద్యోగ జీవితాన్ని దెబ్బతీసుకుంటున్నారు. తర్వాత బదిలీలు, పదోన్నతులు వచ్చినా ఇప్పుడు వచ్చిన చెడ్డపేరు మాత్రం దూరం కాదు కదా. కొత్త ప్రదేశంలోనూ వారిని అదేరీతిలో గుర్తిస్తారు. హోదా, అధికారం ఉన్నా.. దక్కాల్సినంత గౌరవం దక్కదు.
కలాంలా ఆలోచించాలి..
దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను అభిమానించని వారుండరు. అలాంటి మహోన్నత వ్యక్తి జీవితంలోని ఓ సంఘటన మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆగస్టు 2014లో తమిళనాడులోని ఈరోడ్లో పుస్తక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో కలాం పాల్గొన్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతుంటే సౌభాగ్య గ్రైండరు ఉత్పాదక సంస్థ తరఫున గ్రైండరును కానుకగా ఇస్తే తిరస్కరించారు. ధర చెల్లిస్తానంటే నిరాకరించిన సంస్థ నిర్వాహకులు అభిమానంతో బలవంతంగా అందించారు. కొద్ది రోజుల తర్వాత కలాం కార్యాలయం నుంచి ఆ సంస్థకు రూ.4850 చెక్కు అందింది. కలాం సంతకం చేసిన చెక్కు కావడంతో వారు భద్రంగా దాచుకున్నారు. అయితే.. చెక్కు నగదుగా మార్చుకోకుంటే గ్రైండర్ తిప్పి పంపిస్తామని కార్యాలయం నుంచి ఫోన్చేసి చెప్పడంతో వారు చెక్కు నకలును దాచుకొని, అసలు దాన్ని నగదుగా మార్చుకున్నారు. సంస్థ ఎండీ ఆదికేశవ్ ఓ సందర్భంలో ఈ విషయం స్వయంగా వెల్లడించారు. చాలా మంది డబ్బుతో పాటు లంచంగా కానుకలనూ కోరుతున్న వారు కలాం కచ్చితత్వాన్ని గుర్తు చేసుకుంటే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిపై ఫిర్యాదు
[ 16-05-2024]
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డితోపాటు మరో 10 మందిపై అల్లూరి సంజీవరెడ్డి, గండ్రత్ సుజాత, గండ్రత్ ఆశన్న వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని నిరసన
[ 16-05-2024]
పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారాస ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. -
ప్రత్యేక కేంద్రం.. మిశ్రమ ఫలితం
[ 16-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు, పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. -
కనిపిస్తే.. కరుస్తున్నాయి!
[ 16-05-2024]
జిల్లాలో శునకాలు బెంబేలెత్తిస్తున్నాయి. పని నిమిత్తం బయటకు వచ్చే వారిపై దాడులు చేసి కండలు పీకుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా కాలనీల్లో గుంపులుగా సంచరిస్తున్నాయి. -
రిమ్స్ ఒప్పంద ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
[ 16-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్ టేకర్గా పని చేసే లక్ష్మి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సూపర్వైజర్ అకారణంగా తనను పనిలోకి రావొద్దంటూ బెదిరించారంటూ రాత్రి అక్కడే పడుకున్న ఆమె తెల్లవారుజామున మరుగుదొడ్డి శుభ్రం చేసే రసాయనం తాగేసింది. -
ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని సేవలు
[ 16-05-2024]
ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్)లలో ఇప్పటికే అందిస్తున్న అయిదు రకాల సాధారణ సేవలతోపాటు ఏడు రకాల ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
దిల్లీ దూరమనుకోలేదు..!
[ 16-05-2024]
ఓటర్లు ఎన్నికలపై ఎంత ఆసక్తి కనబరిచారనేది పోలింగ్ శాతాన్ని బట్టి తెలుస్తుంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. -
బోసిపోతున్న థియేటర్లు
[ 16-05-2024]
ప్రస్తుత ఉరుకులు పరుగుల జనజీవన గమనంలో ప్రజలు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. వాటి నుంచి కాసింత ఉపశమనం పొందాలని థియేటర్లను ఆశ్రయిస్తున్నారు. -
వద్దన్నా వినరు.. అక్రమాలు ఆపరు
[ 16-05-2024]
ప్రభుత్వ, అసైన్డ్, వివాదం, కోర్టు కేసుల్లో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయరాదనేది నిబంధన. ఒకవేళ ఎవరైనా ఇటువంటి స్థలాలను రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించాలి. -
బియ్యం దందా.. అధికారుల అండ!
[ 16-05-2024]
ఈ నెల 7న చింతలమానేపల్లి మండల కేంద్రం నుంచి పలు వాహనాల్లో 11 క్వింటాళ్ల రాయితీ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా, టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికల వేళ రూ.2.04 కోట్లు పట్టివేత
[ 16-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రూ.2,04,72,950 నగదు పట్టుకున్నట్లు ఎస్పీ సురేష్కుమార్ వెల్లడించారు. ఇదే కాకుండా రూ.2.40 లక్షల విలువైన 9.58 కిలోల గంజాయి, 14 గంజాయి మొక్కలను పట్టుకున్నామన్నారు. -
ఓటు హక్కుకు దూరం @ 2,21,397
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన క్రతువు ముగిసింది. ఇప్పుడంతా జూన్ 4న జరిగే కౌంటింగ్పైకి దృష్టి మళ్లింది. ఎవరు గెలుస్తారు. ఎన్ని ఓట్లు వస్తాయనే విషయంపై చర్చ నడుస్తోంది. -
144 సెక్షన్ అమలు
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి హాజీపూర్ మండలం ముల్కల్ల ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట భద్రత చేపట్టాలని పాలనాధికారి బి.సంతోష్ ఆదేశించారు. -
పొంగిపొర్లిన మద్యం..!
[ 16-05-2024]
భగభగ మండుతున్న సూర్య ప్రతాపమో.. లేక అలవాటు పడ్డ ప్రాణమో.. తెలియదుగానీ.. చల్లచల్లగా.. అనుకుంటూ మందుబాబులు ఈ వేసవిలో ఎక్కువగా తాగేస్తున్నారు. -
డెంగీ నియంత్రణకు చర్యలు
[ 16-05-2024]
జిల్లాలో డెంగీ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా అదనపు పాలనాధికారి సబావత్ మోతీలాల్ తెలిపారు. -
పల్లె భళా.. పట్టణం డీలా
[ 16-05-2024]
పల్లె ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణాల్లో మళ్లీ అదే పరిస్థితి.. ఎక్కువగా నిరక్షరాస్యులు ఉంటారని అనుకున్న పల్లె ప్రజలు ఓటెత్తగా.. విద్యావంతులకు నిలయంగా ఉన్న పట్టణాల్లో ఓటు వేసేందుకు అనాసక్తి చూపిస్తున్నారని మళ్లీ రుజువైంది. -
అటకెక్కిన పరీక్షలు
[ 16-05-2024]
అక్షయ తృతీయ తిథి శుభదినంగా భావించిన రైతులు పంటల సాగుకు ముందుకెళ్తున్నారు. విత్తనాల కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో రైతులు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం.. సుప్రీం ఏమందంటే..?
-
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
-
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు