‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
తెదేపా హయాంలో విశాఖ జిల్లాలో 80 వేలు వరకు ఉన్న వినియోగదారుల సంఖ్య వైకాపా ప్రభుత్వం వచ్చాక తగ్గిపోయింది. చాలా మంది కనెక్షన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.
అనుక్షణం వైకాపా ప్రభుత్వ భజనకే ప్రాధాన్యం
ప్యాకేజీల పేరుతో దగా
ఏపీ ఫైబర్నెట్ వినియోగదారులకు జగన్ సినిమా చూపించాడు. ధరలు తగ్గిస్తాను..సేవలు మరింత నాణ్యతగా అందేలా చేస్తాను అని చెప్పి మోసం చేశాడు. ప్రతిపక్షనేతగా పాదయాత్ర సమయంలో రూ.150కే అన్ని ఛానళ్లతో కేబుల్ ప్రసారాలు అందిస్తామని ఊదరగొట్టారు. నిజమే.. అనుకున్న ప్రజలకు ఎంత భారంమోపాడో అధికారంలోకి వచ్చాక తెలిసింది.
ప్రభుత్వం మారిన వెంటనే ప్యాకేజీ ధరలను ఇష్టానుసారంగా పెంచేశారు. గందరగోళంగా మార్చేసి వినియోగదారులను ఫైబర్నెట్ సేవలకు దూరం చేశాడు. ప్యాకేజీ తీసుకొని టీవీ పెడితే... మొత్తం జగన్ భజనతో కూడిన ప్రచార కార్యక్రమాలు. జగన్ సొంత ప్రచారానికి ప్రాధాన్యమిచ్చి సంస్థను కష్టాల్లోకి నెట్టేశారు.
ఈనాడు, విశాఖపట్నం
ఈ ప్రభుత్వంలో.:
తెదేపా హయాంలో విశాఖ జిల్లాలో 80 వేలు వరకు ఉన్న వినియోగదారుల సంఖ్య వైకాపా ప్రభుత్వం వచ్చాక తగ్గిపోయింది. చాలా మంది కనెక్షన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ధర పెంచేయడం, అన్ని రకాల టీవీ ఛానెళ్లు రాకపోవడంతో ఆ ప్యాకేజీల కొనుగోలుకు ఆసక్తి చూపకపోగా ప్రస్తుత కనెక్షన్లను రద్దు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 52 వేలు మాత్రమే ఉన్నాయి. గతంలో పూర్తిస్థాయిలో సేవలు పొందిన వినియోగదారుడి మీద ఇప్పుడు రెండింతల భారం పెరిగింది. ఇలాంటి పరిస్థితి మారాలంటే ఈ ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వాల్సిందేనని వినియోగదారులు చెబుతున్నారు.
నాడు భారం పడకుండా..
వినియోగదారులకు వినోదాత్మక సేవలందించేందుకు గత తెదేపా ప్రభుత్వం 2015లో ఏపీ ఫైబర్నెట్ ద్వారా కేబుల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పట్లో జిల్లాలో పెద్ద సంఖ్యలో వినియోగదారులు కనెక్షన్లు తీసుకున్నారు. వారిపై భారం పడకుండా ఒక్కోటి రూ..4,400 ఖరీదైన ట్రిపుల్ప్లే బాక్సులను (కేబుల్, అపరిమిత నెట్, ల్యాండ్లైన్ ఫోన్కు ఉపయోగపడే పరికరం) ఉచితంగా అందించింది. ఈ సేవలకు ఏడాదిన్నరపాటు రుసుం వసూలు చేయలేదు. ఆపరేటర్లు మాత్రం నిర్వహణ ఛార్జీల కింద నెలకు రూ.150 చొప్పున వసూలు చేశారు. అనంతరం ప్రతి నెలా రూ.250 చొప్పున వసూలు చేస్తూ అన్నీ టీవీ ఛానెళ్లతో పాటు అపరిమిత అంతర్జాలాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇవే సేవలను ప్రస్తుతం పొందాలంటే ప్రతి నెలా రూ.599 చెల్లించక తప్పని పరిస్థితి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలన దగా.. బడుగుజీవి భగభగ!
[ 12-05-2024]
ఆదాయం గుప్పెడంత పెరుగుతుంటే ఖర్చులు కొండలా పెరుగుతున్నాయి. తప్పనిసరి అవసరాలకు, తప్పించుకోలేని ఖర్చులకు మధ్య జనం కిందమీదా పడుతున్నారు. -
కోడ్ ఉల్లంఘించి రోడ్డు పనులు ప్రారంభం
[ 12-05-2024]
జిల్లాలో వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమాళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ భవనాలు, నిర్మాణాలకు వైకాపా రంగులు వేసిన నాయకులు పోలింగ్ దగ్గరపడటంతో గిరిజన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కోడ్ను ఉల్లంఘించి ఏకంగా రోడ్డు పనులు ప్రారంభించేశారు. -
నిఘా నీడలో మన్యం
[ 12-05-2024]
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరొందిన అల్లూరి జిల్లా పూర్తిగా నిఘా నీడలోకి వెళ్లిపోయింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. -
రెండేళ్లలో నిర్వాసితులకు న్యాయం చేస్తాం
[ 12-05-2024]
పోలవరం నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి న్యాయం చేస్తుందని ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష హామీ ఇచ్చారు. -
పోలింగ్కు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. -
నోట్లతో ఓట్లవేట
[ 12-05-2024]
సార్వత్రిక సమరంలో ప్రచార పర్వం ముగిసింది.. ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పటి వరకు చేసిన ప్రచారంలో ప్రభుత్వ వ్యతిరేకత పెద్దఎత్తున కనిపించడంతో వైకాపా నేతలు కలవరానికి గురవుతున్నారు. -
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన
[ 12-05-2024]
ఐదేళ్ల క్రితం జగన్ ఇదేమాట చెప్పారు. ఎన్నెన్నో చేస్తామన్నారు. అందరినీ ఉద్ధరిస్తా మన్నారు.. గద్దెనెక్కాక పాత పథకాలకు కొత్త పేర్లుపెట్టారు అన్నింటికీ బటన్లు నొక్కేశామన్నారు. -
అరకులో కూటమికే మొగ్గు!
[ 12-05-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అంటూనే అడవి బిడ్డలను జగన్ నట్టేట ముంచారు. అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాలను గిరిజనేతరుల చేతిలో పెట్టి సహజ వనరులను దోచుకున్నారు. -
రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్
[ 12-05-2024]
గత ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ఒక్క అవకాశమంటూ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విమర్శించారు. -
ప్రజల భూములు కాజేసే కుట్ర
[ 12-05-2024]
ప్రజల భూములను కాజేసేందుకు వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం చేసిందని ఎన్డీఏ పాడేరు నియోజకవర్గ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. -
దాడులపై డీజీపీ, ఈసీలకు గీత ఫిర్యాదు
[ 12-05-2024]
అడ్డతీగల మండలం ఎల్లవరంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఉమ్మడి కూటమికి చెందిన కార్యకర్తలపై వైకాపా దాడులు చేయడం అమానుషమని అని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ముగిసిన ప్రచార పర్వం
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రంతో ముగిసింది. జిల్లాలో ఈనెల 13వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల పోలింగ్ జరగనుంది.