logo

నేను చనిపోతే.. పీవీ సురేషే కారణం..!

విశాఖ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు వైకాపా కార్పొరేటర్‌ పీవీ.సురేష్‌పై అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త సోమవారం మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 30 Apr 2024 03:13 IST

వైకాపా కార్పొరేటర్‌పై ఆ పార్టీ మహిళా కార్యకర్త ఫిర్యాదు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు వైకాపా కార్పొరేటర్‌ పీవీ.సురేష్‌పై అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త సోమవారం మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు... శ్రీహరిపురంలో నివాసం ఉంటున్న మహిళా కార్యకర్త తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఆమె ఏ సమావేశంలో కనిపించినా, సభలో పాల్గొన్నా, ప్రచారంలో ఉన్నా... కార్పొరేటర్‌ సురేష్‌ ఆమె వద్దకు వెళ్లి వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి, అసభ్యకర పదజాలంతో మాట్లాడుతుండేవాడు. ఇలా పలుమార్లు కార్పొరేటర్‌ అవమానించాడని, తాను ఆత్మహత్యకు పాల్పడితే... తన చావుకు కార్పొరేటర్‌ సురేష్‌ కారణమని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని