logo

నేడు మహిళా శంఖారావం

మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి కోరార¢ు.

Published : 30 Apr 2024 03:14 IST

మాట్లాడుతున్న ఉమ్మడి పార్టీల మహిళా సంఘ సభ్యులు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి కోరార¢ు. అనకాపల్లిలో సోమవారం భాజపా నియోజకవర్గ పరిశీలకులు వి.ఉమామహేశ్వరి, జనసేన వీరవనిత దొండా కుసుమతో కలిసి నిర్వహించిన విలేకరుల పమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. సంక్షేమం పేరుతో డబ్బులు ఇస్తున్నానని చెప్పి మహిళల కుటుంబాలకు అన్యాయం చేశారన్నారు. అమ్మఒడి, చేయూత, అసరా ఇలా అన్నింటిలోను కోత విధించారన్నారు. వైకాపా హయాంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని తెలిపారు. మహిళా సంక్షేమం ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. మహిళల అభ్యున్నతికి చంద్రబాబునాయుడు, మోదీ పవన్‌కల్యాణ్‌ తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు మంగళవారం సాయంత్రం అనకాపల్లిలోని పూడిమడక రోడ్డులో మహిళా శంఖారావం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మహిళా నాయకులు సంకర్ల పద్మలత, కోట్ని ఉమ, భీశెట్టి హేమ, చంద్రవాణి, సత్యవాణి, ఆదిలక్ష్మి,  మాలతి, వనజ, స్వాతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని