జగన్ జమానాలో నైపుణ్యం లేదు.. నయవంచనే!
ఘనకీర్తి అంతా గతమే అన్న చందంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత పరిస్థితి.
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నిర్వీర్యం చేసిన వైకాపా
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత చిత్తు
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, పాడేరు/పట్టణం, రంపచోడవరం, అచ్యుతాపురం
ఘనకీర్తి అంతా గతమే అన్న చందంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత పరిస్థితి. యువతలో దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసి వారికి శాశ్వతమైన స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్య కేంద్రాలుగా మారిపోయాయి. నిధుల లేమి, సరైన పర్యవేక్షణ లేక వెలవెలబోతున్నాయి.
నాడు..
తెదేపా పాలనలో యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.. వారి ఆసక్తి చూపిన రంగాల్లో నైపుణ్యం కల్పించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో (సెజ్) రూ. 110 కోట్లతో అత్యాధునిక వసతులు, యంత్రాలతో 20 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు చూపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో యూత్ ట్రైనింగ్ సెంటర్లు (వైటీసీ) ఏర్పాటు చేసి గిరిజన యువతలో నైపుణ్యాన్ని వెలికితీశారు. వాటికి అదనంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధిని చూపించారు. అవకాశాలు దక్కని యువతకు నిరుద్యోగ భృతిని అందించి ఆర్థికంగా ఆదుకున్నారు.
నేడు..
వైకాపా పాలనలో యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాలకు స్కిల్ హబ్లుగా పేరుమార్చారు. నిధులివ్వకుండా మొక్కుబడి శిక్షణలతో మమ అనిపించేశారు. ఏజెన్సీలో వైటీసీలను ఇతర శాఖలకు అప్పగించేసి యువజన శిక్షణా కేంద్రాలను నిర్వీర్యం చేసేశారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు లేవు.. ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి లేక నైరాశ్యంలో చిక్కుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో గంజాయి, మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతూ పక్కదారి పడుతున్నారు.
ఏటా పాడేరు మన్యం 11 మండలాల నుంచి 3 వేలమందికి వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకుని స్కిల్ డెవలప్మెంట్ సంస్థ పని చేసింది.
రంపచోడవరం నైపుణ్య శిక్షణ కేంద్రం (వైటీసీ)
ముందుచూపంటే ఇదీ..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. అప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రం ఉండేది. విభజన తర్వాత ఆంధ్రాలో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అచ్యుతాపురంలో ఏర్పాటు చేయించారు. కంపెనీలకు ఎటువంటి కార్మికులు, ఉద్యోగులు కావాలో తెలుసుకొని వారి ఆలోచనలకు అనుగుణంగా యువత మెదడు పదునెక్కించే శిక్షణ అందిస్తోంది. ఈ కేంద్రాన్ని ఉపయోగించుకుని వేలాది మంది స్థానికంగానే ఉపాధి అవకాశాలు పొందారు. నాడు ఈ కేంద్రం ఏర్పాటు చేయకుంటే ఇక్కడ యువత పొట్ట చేతపట్టుకుని వలసలు పోయే పరిస్థితి వచ్చేది.
నయవంచన అంటే ఇదీ..
ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ యువతను ఆశలపల్లకీ ఎక్కించారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగ ప్రకటనలకు మంగళం పాడేసి యువత రెక్కలు విరిచేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణ కేంద్రాలను కూడా సక్రమంగా నడపలేక వైకాపా సర్కారు చేతులేత్తేసింది. ఏజెన్సీలోని వైటీసీ కేంద్రాలు వేర్వేరు శాఖలకు ఇచ్చేసింది. పాడేరు వైటీసీని కలెక్టరేట్కు, పెదబయలు వైటీసీని ఏకలవ్య పాఠశాలకు, అరకులోయ వైటీసీని క్రీడా పాఠశాలకు, చింతపల్లి వైటీసీని మరోక శాఖకు అప్పగించేశారు. రంపచోడరం డివిజన్లో పలు వైటీసీ కేంద్రాలు మూతపడ్డాయి. తెదేపా హయాంలో శిక్షణ ఇచ్చిన సంస్థలు, భోజనం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు రూ.లక్షలు నేటికి బకాయిలు చెల్లించలేదు. సీమెన్స్ సంస్థ అందించిన సాఫ్ట్వేర్, పరికరాలనే ఉపయోగించుకుంటూ స్కిల్ హబ్గా పేరుమార్చి శిక్షణలిస్తోంది. ఆయా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందిని జీతభత్యాలివ్వకుండా తొలగించేశారు. మొత్తంగా నిరుద్యోగ యువతను నయవంచనకు గురిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న జమానాలో అంతా అనధికారమే!
[ 16-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. -
ఓటింగులో వీరే ఆదర్శం
[ 16-05-2024]
రహదారి సౌకర్యంలేని మారుమూల గ్రామాల వారికి గో‘దారే‘ దిక్కుగా మారింది. శ్రీరామగిరి పంచాయతీ కల్తునూరు, తుమ్మిలేరు పోచవరం పంచాయతీ పరిధి కొల్లూరు, గొందూరు, తుమ్మిలేరు -
డెంగీతో జాగ్రత్త సుమా!
[ 16-05-2024]
మే నెలలో ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతున్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. -
అరకు పార్లమెంట్ పరిధిలో 73.68 పోలింగ్ నమోదు
[ 16-05-2024]
అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 73.68 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విజయ సునీత బుధవారం వెల్లడించారు. -
కూటమికే అనుకూల ఫలితాలు
[ 16-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైకాపా పాలనపై వ్యతిరేకత పెరిగింది అనడానికి సార్వత్రిక ఎన్నిల్లో పోలింగే నిదర్శనమని కూటమి పాడేరు శాసనసభ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. -
వరుస ప్రమాదాలతో బెంబేలు..
[ 16-05-2024]
జిల్లాలో జాతీయ రహదారితోపాటు గ్రామీణ రహదారులు వరుస ప్రమాదాలతో రక్తమోడుతున్నాయి. -
కూటమి అభ్యర్థుల గెలుపు తథ్యం: పీలా
[ 16-05-2024]
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ 80 వేలకు పైగా, ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ 30 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. -
ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే రోడ్డు నిర్మాణం
[ 16-05-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ పరిధి వుడాకాలనీలోని ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు జేసీబీతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. -
మన్యంలో తప్పని డోలి మోతలు
[ 16-05-2024]
మన్యంలో మారుమూల గ్రామాలకు సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో డోలి మోతలు తప్పడం లేదు. -
మన్యం ఓటర్లు పోటెత్తారు..!
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జనం ఈసారి పెద్ద ఎత్తున ఓటు వేశారు. నియోజకవర్గం పరిధిలో 63.91 శాతం నమోదైనట్లు జిల్లా ఎన్నికల యంత్రాంగం బుధవారం ప్రకటించారు. -
పలు రైళ్ల రీ షెడ్యూల్
[ 16-05-2024]
లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పలు రైళ్ల బయలు దేరే సమయాలను మార్పు (రీ షెడ్యూల్) చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
విశాఖ జిల్లాలో 70.03 శాతం పోలింగ్
[ 16-05-2024]
విశాఖ జిల్లా పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, 2019 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం 3.78 మేర పెరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు