ప్రాణాంతక వ్యాధులపై ఇంటింటి సర్వే
ప్రాణాంతక వ్యాధుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
రోగులకు బీపీ పరీక్షలు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది
నర్సీపట్నం, న్యూస్టుడే: ప్రాణాంతక వ్యాధుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అంటువ్యాధులు కాని (ఎన్సీడీ) రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ రోగులను గుర్తించి, వాటిని అదుపులో ఉంచడమే ధ్యేయంగా ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఈ వ్యాధులు ఉన్న వారికి పరీక్షలు చేపట్టేందుకు వైద్యారోగ్య శాఖ ఇంటింటి సర్వే నిర్వహించనుంది. దీనిపై ఇప్పటికే ఆ శాఖ అధికారులు సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో ఎక్కువగా అతిసారం, అమ్మవారు (చికెన్ఫాక్స్) తదితర వ్యాధులతో జనం ప్రాణాలు కోల్పోయేవారు. ప్రస్తుతం మారిన ప్రజల జీవనశైలితో బీపీ, సుగర్ వంటి వ్యాధులు సర్వసాధారణమవుతున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, మెదడు స్ట్రోక్, పక్షవాతం వంటి వాటితో ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధులను అదుపులో ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇంటింటి సర్వేతో ఈ రోగాలు ఉన్న వారిని గుర్తించాలని నిర్ణయించారు.
30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి...
జిల్లావ్యాప్తంగా 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. మే నెల 17, ప్రపంచ రక్తపోటు (బీపీ) అవగాహన దినం నేపథ్యం సైతం ఈ కార్యక్రమానికి ఊతమిస్తోంది. దీనిలో భాగంగా ఉన్నతాధికారులు, సిబ్బంది అంతా ఈ పరీక్షలు పూర్తి చేసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉన్నతాధికారులు గూగుల్ సమావేశాల ద్వారా దీనిని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలిస్తున్నారు.
ఈ నెల 28న సిబ్బందికి శిక్షణ: అసంక్రమణ వ్యాధుల గుర్తింపు కార్యక్రమంపై ఈ నెల 28న ఏఎన్ఎం, తదితర ఆరోగ్య సిబ్బందికి శిక్షణ తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి ఉన్నతాధికారులు గూగుల్ సమావేశాలు చేపట్టి అందరినీ ముందస్తుగా సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే వెలువడనున్న మార్గదర్శకాల ప్రకారం ఇంటింటి సర్వే ప్రారంభించనున్నారు. తరవాత గుర్తించిన రోగులకు ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందించి, వ్యాధులు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
డాక్టర్ వీరజ్యోతి, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ, నర్సీపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లెక్కింపునకు సర్వం సిద్ధం
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం జరగనుంది. జిల్లాలోని మూడు శాసనసభ, అరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల లెక్కింపునకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలెక్టర్ విజయ సునీత, -
ఉద్యానానికి ‘‘ఉపాధి’’ ఊతం
[ 02-06-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం మొదలుకానుంది. ఇకపై ఉపాధిహామీ పథకం కింద చెరువుల్లో పూడికతీత పనులు తగ్గించి జూన్ నుంచి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. -
భీమిలి తీరంలో విధ్వంసం విజయవంతం
[ 02-06-2024]
ఆయన హయాంలో సీఆర్జెడ్ నిబంధనలపై నీతి వాక్యాలు వల్లె వేశారు. ఇప్పుడు తానే భీమిలి తీరంలో విధ్వంసానికి తెరలేపారు. ఎన్నికల కోడ్ విధుల్లో అధికారులుంటే, చాకిరేవు గెడ్డ పోరంబోకు భూ ఆక్రమణల్లో సదరు నేత నిమగ్నమయ్యారు. -
తపాలా బీమాతో ధీమా!
[ 02-06-2024]
అనుకోని ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే వారిపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి దయనీయం. భార్య/భర్త మరణిస్తే వారి పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. -
ఆఖరి మజిలీకి అవస్థలు
[ 02-06-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసి.. పునరావాస కాలనీలకు వచ్చిన ముంపు గ్రామాల నిర్వాసితుల్లో ఎవరైనా మృతిచెందితే వారి ఆఖరి మజిలీకి తీవ్ర అవస్థలు తప్పడం లేదు. -
పిడుగుపాటుకు క్రీడాకారుడి మృతి
[ 02-06-2024]
పద్మాపురం సమీపంలో శనివారం పిడుగుపడటంతో గిరి యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. -
ఎండల తీవ్రతకు పైపులైన్ పేలుడు!
[ 02-06-2024]
ఛత్తీస్గడ్, ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు వెళుతున్న ఐరన్ఓర్ పైపులైన్ శుక్రవారం అర్ధరాత్రి పేలిపోయింది. చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని దిగజనబ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు!
[ 02-06-2024]
కూటమికే ప్రజలు పట్టం కట్టనున్నారని, సర్వేలన్నీ అవే చెబుతున్నాయని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్
-
ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటమది: కేటీఆర్
-
సీఎం రేవంత్ నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తాం: సోనియాగాంధీ
-
డ్రాగన్ ఘనత.. జాబిల్లి ఆవలివైపు ల్యాండ్ అయిన చాంగే-6..!
-
సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్లో భాజపా హవా