మహనీయులను స్మరించుకుందాం: జేసీ
స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను తృణప్రాయంగా భావించిన మహనీయుల చరిత్రను నేటి తరంతో పాటు విద్యార్థులకు తెలియజేయాలని జేసీ మహేష్కుమార్ అన్నారు.
ఛాయాచిత్ర ప్రదర్శన తిలకిస్తున్న మహేష్కుమార్
మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్టుడే: స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను తృణప్రాయంగా భావించిన మహనీయుల చరిత్రను నేటి తరంతో పాటు విద్యార్థులకు తెలియజేయాలని జేసీ మహేష్కుమార్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా బెల్ కంపెనీ ఆధ్వర్యాన ఆంధ్రా జాతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన మహనీయుల ఛాయాచిత్రాలు, సందేశాల ప్రదర్శనను శుక్రవారం ఆయన బెల్ కంపెనీ జీఎం ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వీరులను స్మరించుకోవడం గర్వంగా ఉందని పేర్కొంటూ అందుకు అవకాశం కల్పించిన బెల్ యాజమాన్యాన్ని ప్రశంసించారు. ప్రదర్శనలో భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థ(బెల్) తయారుచేసే పరికరాలను ఉంచారు. మూడు రోజుల పాటు సాగే ఈ ప్రదర్శనను విద్యార్థులు తిలకించే విధంగా ఏర్పాటు చేయాలని జేసీ జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా సుల్తానాను ఆదేశించారు. బెల్ అధికారులు, ఉద్యోగులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వారి త్యాగాలను వృథా కానివ్వం
మచిలీపట్నం(కోనేరుసెంటరు): మహనీయుల త్యాగాలను వృధాకానివ్వమని నినదిస్తూ ఎస్ఎఫ్ఐ, జ్యోతిబాఫులే విజ్ఞానకేంద్రం, కృష్ణా బాలోత్సవం ఆధ్యర్యాన నగరంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల్లో 75మంది స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలతో సాగిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్కుమార్, తదితరులు మాట్లాడుతూ స్వాతంత్య్ర వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా నేటికి పేద విద్యార్థులకు చదువులు అందని పరిస్థితి ఉండటం దయనీయమన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మత సామరస్యాలను పరిరక్షించుకుంటామంటూ నినాదాలు చేస్తూ కోనేరుసెంటరులో రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు కీర్తి, జెపన్యా, ప్రదీప్, ధనుష్ విజ్ఞానకేంద్ర కో కన్వీనర్ జి.నాగయ్య, రాంబాబు, కృష్ణా బాలోత్సవం అధ్యక్షులు నరేష్లతో పాటు పలువురు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
ర్యాలీలో ఎస్ఎఫ్ఐ, విజ్ఞానకేంద్రం, బాలోత్సవం నాయకులు, విద్యార్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమిలో ఉత్సాహం.. వైకాపాలో నైరాశ్యం
[ 14-05-2024]
‘‘ఆనందోత్సాహాలు.. పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో తెదేపా శ్రేణులు.. రెట్టించిన జోష్తో కదిలాయి. పోలింగ్ సరళి, -
పో‘రంకెలేసిన’ జోగి.. మంత్రి రెచ్చిపోయినా అడ్డుకోని పోలీసులు
[ 14-05-2024]
ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. అధికార వైకాపా నాయకుల ఆగడాలను అడ్డుకోలేక చేతులెత్తేసింది. -
మండుటెండలో.. ఓట్ల వర్షం
[ 14-05-2024]
కృష్ణమ్మ జోరును తలపించిన జనాల హోరుతో పోలింగ్ కేంద్రాలు పోటెత్తాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఉదయం 6 గంటలకే ఓటర్లు భారీగా తరలివచ్చారు. -
ఐసీయూ నుంచి పోలింగ్ కేంద్రానికి..
[ 14-05-2024]
నగరానికి చెందిన గోవాడ వెంకటేశ్వరరావు (68) ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. -
కవ్వింపులు.. ప్రలోభాలు
[ 14-05-2024]
మచిలీపట్నం నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతున్న సమయంలో వైకాపాకు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తల తీరుతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు, -
రెండో రోజూ తెదేపా ఏజెంట్లపై వైకాపా దాడి
[ 14-05-2024]
తెదేపా ఏజెంట్లుగా వ్యహరించిన ఇరువురిపై వైకాపా వర్గీయులు మూకుమ్మడి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. -
ఉయ్యూరులో అధికార పార్టీ నేత బరితెగింపు
[ 14-05-2024]
కృష్ణా జిల్లా ఉయ్యూరులో వైకాపా నేత, సీడీసీ ఛైర్మన్ రామచంద్రరావు బరితెగించి ఏకంగా సీఐడీ డీఎస్పీ సోమయ్యపై దూసుకెళ్లి దాడికి యత్నించారు. -
బందరులో 11.30 వరకు సాగిన పోలింగ్
[ 14-05-2024]
ఈవీఎంల మొరాయింపు కారణంగా తలెత్తిన సమస్యలతో వివిధ కేంద్రాల్లో రాత్రి 11.30 గంటలవరకు పోలింగ్ కొనసాగింది. బందరు నగరంలోని గొడుగుపేట పాఠశాలలోని 144వ బూత్తోపాటు గాంధీవిద్యాలయం -
మేము సైతం ..
[ 14-05-2024]
జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ముఖ్యులు సోమవారం తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. జిల్లా జడ్జి అరుణ సారిక శిశువిద్యా మందిరంలోని 75వ బూత్లో ఓటు వేశారు. -
జడ్పీ ఛైర్పర్సన్కు ప్రతిఘటన
[ 14-05-2024]
స్థానిక బంగ్లాస్కూలు పోలింగు కేంద్రంలోకి వచ్చిన జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికను తెదేపా నేతలు అడ్డుకున్నారు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు మాత్రమే లోనికి రావాలని మీరు ఏ హోదాలో వస్తున్నారంటూ ఆమెను ప్రశ్నించారు. -
పెద్దోళ్లూ.. మీరు గొప్పోళ్లు
[ 14-05-2024]
వయసుమీద పడింది. శరీరం సహకరించకుంది. అవయవాలు ఇబ్బంది పెడుతున్నా.. ఓటు హక్కు వినియోగంలో ఉత్సాహం తగ్గలేదు. లైన్లలో నిలబడలేక ఓటు వేయడమే మానేస్తున్నవారిలో స్ఫూర్తినింపేలా.. -
వైకాపా నేతల బరితెగింపు
[ 14-05-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో వైకాపా నేతలు బరితెగించారు. ఆదివారం 59వ డివిజన్లోని ఎమ్మెల్సీ రుహుల్లా కార్యాలయం వద్ద డబ్బులు పంచుతుండగా.. -
భవానీపురం సీఐపై వేటు
[ 14-05-2024]
విధి నిర్వహణలో అలసత్వం వహించిన భవానీపురం పోలీస్స్టేషన్ సీఐ వి.కృష్ణపై వేటు పడింది. సీఐని వీఆర్కు పంపుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. -
వైకాపా సోషల్ మీడియా బ్యాచ్ హడావిడి
[ 14-05-2024]
పాతబస్తీ రాయల్ ఫంక్షన్ హాల్లో సుమారు 30 మందికి పైగా బయట వ్యక్తులు(పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వారు కాదు) 18ల్యాప్ ట్యాప్లతో ఏదో పని చేస్తున్నారని స్థానిక ప్రజలు ఎన్డీయే నేతలకు సమాచారం ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నెహ్రూ జులాజికల్ పార్క్లో తెల్లపులి మృతి
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!