రగులుతున్న.. అసంతృప్తి ..!
వైకాపాలో ఇవన్నీ బయటకు కనిపించే విభేదాలు. కానీ అంతర్గతంగా కుమిలిపోతున్న కార్యకర్తలు, నాయకులు ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్నారు. ఉయ్యూరు జడ్పీటీసీ సభ్యురాలు యలమంచిలి పూర్ణిమ రాజీనామాతో అంతర్గతపోరు ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది.
గన్నవరంలో నిత్యం అసమ్మతి రాగాలాపన..
మైలవరంలో మట్టితవ్వకాల కుమ్ములాటలు..
నందిగామలో కౌన్సిలర్లందరూ వేరు కుంపటి
విజయవాడ పశ్చిమలో మాజీ మంత్రికి వ్యతిరేక సమావేశం..
బెజవాడ సెంట్రల్లో ముగ్గురు కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధం..
బందరులో ఎంపీ బాలశౌరిని అడ్డగించిన మాజీ మంత్రి పేర్ని అనుచరులు..
ఈనాడు, అమరావతి
నందిగామ పురపాలక సంఘంలో ఒకేసారి కౌన్సిలర్లందరూ బాయ్కాట్ చేసి వేరు కుంపటి పెట్టారు. తమకు పనులు అప్పగించడం లేదని ప్రధాన ఆరోపణ. మొదట్లో ఎమ్మెల్యేకు, ఛైర్పర్సన్కు మధ్య పొసగలేదు. కౌన్సిలర్ల తిరుగుబాటు తర్వాత పార్టీ జోక్యంతో సద్దుమణిగింది.
విజయవాడ తూర్పులో నేతల మధ్య సఖ్యత లేదు. ఇంచార్జిగా దేవినేని అవినాష్ ఉండగా నగర అధ్యక్షుడిగా భవకుమార్ వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి వర్గాల మధ్య డివిజన్లలో ఆధిపత్య పోరు నడుస్తోంది.
గన్నవరం నిత్యం అసంతృప్తి రగిలే జ్వాల. తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వైకాపాలో చేరడంతో ఇక్కడ రగడ ప్రారంభమైంది. యార్లగడ్డ వెంకట్రావ్, దుట్టా రామచంద్రరావు మరో వర్గంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పలుసార్లు సీఎం దగ్గరకి పంచాయతీ చేరినా.. పరిష్కారం మాత్రం కనుగొనలేదు.
వైకాపాలో ఇవన్నీ బయటకు కనిపించే విభేదాలు. కానీ అంతర్గతంగా కుమిలిపోతున్న కార్యకర్తలు, నాయకులు ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్నారు. ఉయ్యూరు జడ్పీటీసీ సభ్యురాలు యలమంచిలి పూర్ణిమ రాజీనామాతో అంతర్గతపోరు ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది. పనిచేసే వారికి పార్టీ, ప్రభుత్వంలో విలువ ఇవ్వకపోవడం, అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలదే పెత్తనం... తదితర కారణాలతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇంకా రెండేళ్లు అధికారం ఉండటంతో మౌనంగా భరించాల్సి వస్తోందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఉయ్యూరు జడ్పీటీసీ రాజీనామా పార్టీలో చర్చనీయాంశమైంది. పూర్ణిమ భర్త కోటయ్యచౌదరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వైకాపాలో పార్థసారథి వెంట నడిచారు. ఆ గ్రామంలో ఆయన కుటుంబం మాత్రమే వైకాపాలో ఉంది. ప్రత్యర్థులు తమసామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేశారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో అధిష్టానం దృష్టికి వెళ్లిన సమస్యలు పరిష్కరిస్తున్నారు. కొన్ని జిల్లాకే పరిమితం అవుతున్నా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది.
మట్టి తవ్వకాల్లో ఆధిపత్యం..!
మైలవరం నియోజకవర్గంలో మట్టి తవ్వకాల్లో వైకాపా కార్యకర్తల మధ్య బాహాబాహీ జరిగింది. వెల్వడంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అనుచరులు మట్టి తవ్వకాల ద్వారా రూ.లక్షలు ఆర్జించారని, పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించారని నిరసన వ్యక్తం చేశారు. జి.కొండూరు, రెడ్డిగూడెం మండలాల్లోనూ మట్టి తవ్వకాలుపైనే గ్రామాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇబ్రహీపంట్నం కొండపల్లి నగరపంచాయతీ ఎన్నిక విషయంలోనూ ఎమ్మెల్యే, ప్రత్యర్థి వర్గానికి విభేదాలు పొడచూపాయి. ఇక్కడ మంత్రి జోగి రమేష్ సోదరుడు అంతర్గతంగా ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారనేది పార్టీలో ఆరోపణ.
* జగ్గయ్యపేటలో రేషన్ బియ్యం, ఇసుక విక్రయాల్లో ఆధిపత్యం నడుస్తోంది. ఇక్కడ షాడో ఎమ్మెల్యేదే ఆధిపత్యం. దీంతో కొంతమంది కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు.
* విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏకంగా ముగ్గురు కార్పొరేటర్లు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడ్డారు. ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటున్నారని, కనీసం అక్రమ కట్టడాల మామూళ్లు రావడం లేదని బహిరంగంగా గళం విప్పడం చర్చనీయాంశమైంది. డివిజన్లలో పనులు తమకు ఇవ్వడం లేదని ఆరోపణలకు దిగారు.
* పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ భాజపా నుంచి వైకాపాలోకి చేరిన విషయం తెలిసిందే. వైకాపా ఎమ్మెల్యే జలీల్ఖాన్ తెదేపాలో చేరారు. అనంతరం పరిణామాల్లో వెల్లంపల్లి మంత్రి అయ్యారు. మంత్రి హయాంలో అసలైన వైకాపా కార్యకర్తలను పట్టించుకోవడం లేదని నిరసన సమావేశం పెట్టి గళం విప్పారు. కొంతమంది కార్పొరేటర్లలోనూ అసంతృప్తి రగులుతోంది.
* కంకిపాడులోనూ జడ్పీటీసీ, ఎంపీపీకి మధ్య పొసగడం లేదు.
* బందరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ మధ్య విభేదాలు ఇటీవల వెలుగు చూశాయి. కొంమతందిపై పోలీసు కేసు వరకు వెళ్లింది.
* పెడనలో మంత్రి జోగిరమేష్, జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక మామ ఉప్పాల రాంప్రసాద్కు మధ్య విభేదాలు బహిరంగమే. గత సాధారణ ఎన్నికల నుంచి ఇవి కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
[ 04-05-2024]
ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీ సేవలకే పరిమితమైన పోలీస్శాఖ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా తీరు మార్చుకోవడం లేదు. -
జగన్.. ‘పైసా’చికానందం..!
[ 04-05-2024]
‘ఇది అత్యంత దారుణం.. పండుటాకులతో జగన్ పైశాచిక క్రీడ ఆడుతున్నారు. వృద్ధులంతా ఎండలో నరకం అనుభవించాలని.. తమ బాధకు కారణం.. వాలంటీర్లు లేకపోవడమేనని వాళ్లు భావించాలనేదే.. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. -
బ్యాలట్ కాదు.. బుల్లెట్
[ 04-05-2024]
ఒక పూటలో తినే కూరగాయల్నే ఏరి ఏరి కొంటాం.. మరి అయిదేళ్లకోసారి వేసే ఓటు ఆచితూచి వేయలేమా..! సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. -
సహకారానికి జగన్ కత్తెర
[ 04-05-2024]
సహకార చట్టం ప్రకారం.. సంఘానికి నిర్ధరిత కాలవ్యవధిలో ప్రత్యేక ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. -
జగన్ జమాన.. జనం భయాన!
[ 04-05-2024]
ప్రశాంతంగా కుటుంబంతో పార్కుకు వెళ్లాలంటే భయం.. పద్మావతి ఘాట్కో... కృష్ణవేణి ఘాట్కో వెళ్లి కొద్దిసేపు సేదదీరాలన్నా భయమే... నిర్మానుష్యంగా.. చీకటిగా ఉన్న రోడ్లపై వెళ్లాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే...ఎటువైపు నుంచి బ్లేడ్, గంజాయి బ్యాచ్లు దాడి చేస్తాయో తెలీదు. -
పోలీసుపై కొడాలి నాని ప్రధాన అనుచరుడి అరాచకం
[ 04-05-2024]
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడైన కసుకుర్తి జనార్దన్ (గుడ్లవల్లేరు బాబ్జి) ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆటోనగర్పై పగ.. శ్రామికులకు సెగ
[ 04-05-2024]
ఆసియాలోనే పెద్దదైన బెజవాడ ఆటోనగర్ పారిశ్రామికవాడ నేడు అనేక సమస్యలతో సతమతమౌతోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని పట్టించుకోవడం మానేసింది. -
వంశీ, నానీ.. ‘దారి’ మరిచారేం?
[ 04-05-2024]
గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలకు ఎంతగానో ఉపకరించే కీలక రహదారి అభివృద్ధిపై వైకాపా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం చూపారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. -
రూ.కోట్ల విలువైన స్థలంఫై విష్ణు కన్ను
[ 04-05-2024]
నగరంలో గత అయిదేళ్లలో వైకాపా ప్రజాప్రతినిధులు.. ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా కబ్జా చేసేశారు. స్థానిక కార్పొరేటర్ల అండతో ప్రభుత్వ స్థలాలను మింగేశారు. -
బూతుల నేత.. మెరకలో మేత!
[ 04-05-2024]
శతకోటి అక్రమాలకు అనంతకోటి ఉపాయాలు! మట్టి నుంచి రూ. కోట్లు ఎలా పిండుకోవచ్చో గుడివాడ వెళ్లి చూస్తే తెలుస్తుంది.ఆ పిండుకున్నదాన్ని చట్టానికి దొరక్కుండా ఎలా జేబులో వేసుకోవచ్చో కూడా చూడొచ్చు. -
తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయుల దాడి
[ 04-05-2024]
బాపులపాడు మండలం కొత్తమల్లవల్లిలో తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. ఇళ్ల మీదకు వెళ్లి దాడికి పాల్పడ్డారు. -
మళ్లీ అదే తంతు
[ 04-05-2024]
అనుమతి లేకుండా 59వ డివిజన్లోని పలు నివాసాలపై వైకాపా నేతలు ఆ పార్టీ స్టిక్కర్లు అంటించడం వివాదాస్పదమైంది. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను
[ 04-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని చిన్ని, శ్రీరాం తాతయ్య పేర్కొన్నారు. -
కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యం: సుజనా
[ 04-05-2024]
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు కృషి చేయాలని పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. -
చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
[ 04-05-2024]
నగరంలోని ఆంధ్రా ఆసుపత్రిలో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే సౌజన్యంతో 15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. -
తెదేపాతోనే యువతకు భవిష్యత్తు
[ 04-05-2024]
యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని విజయవాడ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 04-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
టికెట్టు లేని ప్రయాణాలకు జరిమానా
[ 04-05-2024]
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్టు లేని ప్రయాణికుల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రికార్డు స్థాయిలో డివిజన్కు రూ.7.96కోట్ల ఆదాయం లభించింది. -
ప్రధాని రోడ్షో భద్రతపై సమీక్ష
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షోలో పాల్గొననున్నారని ఇందుకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రధాని పర్యటనకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.