Vijayawada Traffic: విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. మళ్లింపు ఇలా..
ఈ నెల 14న అజిత్సింగ్నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో సీపీఐ జాతీయ మహాసభలు జరుగుతున్న సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కాంతిరాణాటాటా తెలిపారు.
విజయవాడ నేరవార్తలు, న్యూస్టుడే: ఈ నెల 14న అజిత్సింగ్నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో సీపీఐ జాతీయ మహాసభలు జరుగుతున్న సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కాంతిరాణాటాటా తెలిపారు. మీసాల రాజారావు వంతెన మీదుగా జీఎస్రాజు రోడ్డు, ప్రభుత్వ ముద్రణాలయం కూడలి, పై వంతెన, డాబాకొట్లు సెంటరు, మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు సుమారు 25వేల మందితో ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 14న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు తెలిపారు.
* సీతన్నపేట నుంచి బుడమేరు వంతెన కూడలి వరకు ఎలాంటి వాహనాలను అనుమతించరు.
* ఏలూరు లాకులు నుంచి సీకేరెడ్డి రోడ్డు, జీఎస్రాజు రోడ్డులోకి, బుడమేరు వంతెన వైపు, ప్రభుత్వ ముద్రణాలయం వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు.
వివరాలు ఇలా...
* రైల్వేస్టేషన్ నుంచి అజిత్సింగ్నగర్ వైపు వెళ్లే వాహనాలను ఏలూరు లాకులు, అలంకార్ కూడలి, సాంబమూర్తిరోడ్డు, బోసుబొమ్మ కూడలి, సంగీత కళాశాల, బి.ఆర్.టిఎస్.రోడ్డు, గుణదల సెంటరు, రామవరప్పాడు రింగ్, ఇన్నర్ రింగ్రోడ్డు మీదుగా కండ్రిక వైపు వెళ్లాలి.
* చిట్టినగర్ నుంచి ఎర్రకట్ట మీదుగా వచ్చే వాహనాలను కాళేశ్వరరావు మార్కెట్ మీదుగా వెళ్లాలి. ఎర్రకట్ట మీదుగా అజిత్సింగ్నగర్, నూజివీడు వైపు వెళ్లే వారు.. సీవీఆర్ పైవంతెన మీదుగా వై.వి.రావు ఎస్టేట్, పైపుల రోడ్డు మీదుగా వెళ్లాలి.
* నున్న, నూజివీడు వైపు నుంచి కండ్రిక కూడలి మీదుగా వచ్చే వాహనాలను కండ్రిక జంక్షన్ వద్ద మళ్లించి ఇన్నర్రింగ్ రోడ్డు, రామవరప్పాడు రింగ్ మీదుగా నగరంలోకి రావాలి.
* పైపుల రోడ్డు, పాయకాపురం మీదుగా వన్టౌన్ వెళ్లే ప్రయాణికులు వై.వి.రావు ఎస్టేట్, సీవీఆర్ పైవంతెన, పాల ఫ్యాక్టరీ మీదుగా వెళ్లాలి.
పార్కింగ్ ప్రాంతాలు ఇవే..
* ఇబ్రహీంపట్నం వైపు కార్యకర్తలను తీసుకువచ్చే బస్సులు, లారీలు గొల్లపూడి బైపాస్, సీవీఆర్ పైవంతెన, వై.వి.రావు ఎస్టేట్ మీదుగా ఎక్సెల్ ప్లాంటు రోడ్డులో నిలపాలి. కార్లు, ఆటోల్లో వచ్చే వారు ఎర్రకట్ట మీదుగా మీసాల రాజారావు వంతెన వద్ద నుంచి బి.ఆర్.టి.ఎస్. రోడ్డులో మధ్య నిలపాలి.
* గుంటూరు వైపు నుంచి వచ్చే బస్సులు, లారీలు.. వారధి మీదుగా వచ్చి బెంజిసర్కిల్ పైవంతెన మీదుగా రామవరప్పాడు రింగ్, ఇన్నర్రింగ్ రోడ్డు, కండ్రిక కూడలి, పైపులరోడ్డు మీదుగా వెళ్లి ఎక్సెల్ ప్లాంట్ రోడ్డులో నిలపాలి. కార్లు, ఆటోలను బెంజిసర్కిల్ పైవంతెన మీదుగా రామవరప్పాడు రింగ్, గుణదల మీదుగా మధురానగర్ జంక్షన్ వద్ద బి.ఆర్.టి.ఎస్.రోడ్డు మధ్యలో పార్కింగ్ చేసుకోవాలి.
* నూజివీడు వైపు వచ్చే వాహనాలను పైపులరోడ్డు, వాంబేకాలనీకి వెళ్లే ఎక్సెల్ ప్లాంట్ రోడ్డులో నిలపాలి. * విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లా నుంచి వచ్చే లారీలు, బస్సులను రామవరప్పాడు రింగ్ నుంచి కండ్రిక కూడలి, పైపుల రోడ్డు కూడలి మీదుగా ఎక్సెల్ ప్లాంట్ రోడ్డులో నిలపాలి. కార్లు, ఆటోలను రామవరప్పాడు రింగ్, గుణదల మీదుగా బి.ఆర్.టిఎస్. రోడ్డులో నిలపాలి.
* పోలీసులు సూచించిన మార్గంలో ప్రయాణించి, ఆయా ప్రాంతాల్లో తమ వాహనాలను నిలిపి సహకరించాలని సీపీ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమిలో ఉత్సాహం.. వైకాపాలో నైరాశ్యం
[ 14-05-2024]
‘‘ఆనందోత్సాహాలు.. పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో తెదేపా శ్రేణులు.. రెట్టించిన జోష్తో కదిలాయి. పోలింగ్ సరళి, -
పో‘రంకెలేసిన’ జోగి.. మంత్రి రెచ్చిపోయినా అడ్డుకోని పోలీసులు
[ 14-05-2024]
ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. అధికార వైకాపా నాయకుల ఆగడాలను అడ్డుకోలేక చేతులెత్తేసింది. -
మండుటెండలో.. ఓట్ల వర్షం
[ 14-05-2024]
కృష్ణమ్మ జోరును తలపించిన జనాల హోరుతో పోలింగ్ కేంద్రాలు పోటెత్తాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఉదయం 6 గంటలకే ఓటర్లు భారీగా తరలివచ్చారు. -
ఐసీయూ నుంచి పోలింగ్ కేంద్రానికి..
[ 14-05-2024]
నగరానికి చెందిన గోవాడ వెంకటేశ్వరరావు (68) ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. -
కవ్వింపులు.. ప్రలోభాలు
[ 14-05-2024]
మచిలీపట్నం నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతున్న సమయంలో వైకాపాకు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తల తీరుతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు, -
రెండో రోజూ తెదేపా ఏజెంట్లపై వైకాపా దాడి
[ 14-05-2024]
తెదేపా ఏజెంట్లుగా వ్యహరించిన ఇరువురిపై వైకాపా వర్గీయులు మూకుమ్మడి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. -
ఉయ్యూరులో అధికార పార్టీ నేత బరితెగింపు
[ 14-05-2024]
కృష్ణా జిల్లా ఉయ్యూరులో వైకాపా నేత, సీడీసీ ఛైర్మన్ రామచంద్రరావు బరితెగించి ఏకంగా సీఐడీ డీఎస్పీ సోమయ్యపై దూసుకెళ్లి దాడికి యత్నించారు. -
బందరులో 11.30 వరకు సాగిన పోలింగ్
[ 14-05-2024]
ఈవీఎంల మొరాయింపు కారణంగా తలెత్తిన సమస్యలతో వివిధ కేంద్రాల్లో రాత్రి 11.30 గంటలవరకు పోలింగ్ కొనసాగింది. బందరు నగరంలోని గొడుగుపేట పాఠశాలలోని 144వ బూత్తోపాటు గాంధీవిద్యాలయం -
మేము సైతం ..
[ 14-05-2024]
జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ముఖ్యులు సోమవారం తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. జిల్లా జడ్జి అరుణ సారిక శిశువిద్యా మందిరంలోని 75వ బూత్లో ఓటు వేశారు. -
జడ్పీ ఛైర్పర్సన్కు ప్రతిఘటన
[ 14-05-2024]
స్థానిక బంగ్లాస్కూలు పోలింగు కేంద్రంలోకి వచ్చిన జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికను తెదేపా నేతలు అడ్డుకున్నారు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు మాత్రమే లోనికి రావాలని మీరు ఏ హోదాలో వస్తున్నారంటూ ఆమెను ప్రశ్నించారు. -
పెద్దోళ్లూ.. మీరు గొప్పోళ్లు
[ 14-05-2024]
వయసుమీద పడింది. శరీరం సహకరించకుంది. అవయవాలు ఇబ్బంది పెడుతున్నా.. ఓటు హక్కు వినియోగంలో ఉత్సాహం తగ్గలేదు. లైన్లలో నిలబడలేక ఓటు వేయడమే మానేస్తున్నవారిలో స్ఫూర్తినింపేలా.. -
వైకాపా నేతల బరితెగింపు
[ 14-05-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో వైకాపా నేతలు బరితెగించారు. ఆదివారం 59వ డివిజన్లోని ఎమ్మెల్సీ రుహుల్లా కార్యాలయం వద్ద డబ్బులు పంచుతుండగా.. -
భవానీపురం సీఐపై వేటు
[ 14-05-2024]
విధి నిర్వహణలో అలసత్వం వహించిన భవానీపురం పోలీస్స్టేషన్ సీఐ వి.కృష్ణపై వేటు పడింది. సీఐని వీఆర్కు పంపుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. -
వైకాపా సోషల్ మీడియా బ్యాచ్ హడావిడి
[ 14-05-2024]
పాతబస్తీ రాయల్ ఫంక్షన్ హాల్లో సుమారు 30 మందికి పైగా బయట వ్యక్తులు(పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వారు కాదు) 18ల్యాప్ ట్యాప్లతో ఏదో పని చేస్తున్నారని స్థానిక ప్రజలు ఎన్డీయే నేతలకు సమాచారం ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు