logo

మండలి గెలుపుతో తెలుగుకు మరింత వెలుగు

మాజీ ఉపసభాపతి, తెలుగు భాషా పరిరక్షకులు మండలి బుద్ధప్రసాద్‌ను గెలిపించి నియోజకవర్గ ప్రజలు ఉత్తమ సమాజ నిర్మాణంలో భాగస్థులు కావాలని, తెలుగు భాషా ఉద్యమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సామల లక్ష్మణబాబు అన్నారు.

Published : 22 Apr 2024 05:04 IST

అవనిగడ్డ, న్యూస్‌టుడే: మాజీ ఉపసభాపతి, తెలుగు భాషా పరిరక్షకులు మండలి బుద్ధప్రసాద్‌ను గెలిపించి నియోజకవర్గ ప్రజలు ఉత్తమ సమాజ నిర్మాణంలో భాగస్థులు కావాలని, తెలుగు భాషా ఉద్యమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సామల లక్ష్మణబాబు అన్నారు. ఆదివారం ఆయన బుద్ధప్రసాద్‌ను అతని గృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాతృభాషను తుంగలో తొక్కారన్నారు. బోధన విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ మాతృభాషను విభేదించడం మంచిది కాదన్నారు. సామల శివరామకృష్ణ, యర్రంశెట్టి హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని