వెలంపల్లీ..హామీ..చేసిందేమీ..
భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి.
పట్టించుకోని వైకాపా ఎమ్మెల్యే
కలగానే ఆరోగ్య కేంద్రం
కోళ్లఫారం రోడ్డులో అధ్వానంగా నిలిచిన డ్రెయిన్ నిర్మాణం, బాలభాస్కర్ నగర్లో రహదారి కంటే ఎత్తుగా నిర్మించిన కాలువ
భవానీపురం, న్యూస్టుడే: భవానీపురం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. కరకట్ట ప్రాంతాల్లోని నివాసాలను రిజిస్ట్రేషన్ చేయిస్తామని హామీలు గుప్పించారు. తర్వాత హడావుడి తప్ప కార్యాచరణ లేదు. మరోవైపు 40వ డివిజన్ పరిధిలో కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. డ్రెయినేజీ వ్యవస్థ, రహదారులను అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదు. ఫలితంగా అధ్వానంగా మారాయి.
రిజిస్ట్రేషన్లు ఎప్పుడు...
బాలభాస్కర్నగర్, అల్లుడుపేట, కరకట్ట ప్రాంతాల్లోని నివాసాలను రిజిస్ట్రేషన్లు చేయిస్తామని అధికార పార్టీ నాయకులు హామీలు గుప్పించారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న తమ సమస్య పరిష్కారానికి నోచుకుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంబరపడ్డారు. అయినా... అయిదేళ్లలో అడుగు పడలేదు. అలాగే నలభై గజాల స్థలాల్లో నివాసం ఉండే వారు న్యాయం కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. వారి స్థలాలు రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఎన్నికల సమయంలో పాలకులు హామీలు గుప్పిస్తున్నారు తప్పితే పరిష్కరించటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
- డివిజన్లోని బాలభాస్కర్నగర్, అల్లుడుపేటలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. అక్కడ చిన్నపాటి కాలువలు మాత్రమే ఉన్నాయి. కొన్నిచోట్ల మురుగునీరు వెళ్లే అవకాశం లేకపోవడంతో సిమెంటు రహదారులను సైతం తవ్వేశారు. ప్రధాన రహదారి వెంబడి కాలువలను ఎత్తుగా నిర్మించారు. చిన్నపాటి వర్షం వచ్చినా రహదారిపై మురుగునీరు నిలుస్తోంది.
- తాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉంది. లారీస్టాండులో ట్యాంకు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాగునీటి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. కోళ్లఫారం రోడ్డు, డాల్ఫిన్బార్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో తాగునీరు కలుషితంగా వస్తోంది. అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోతుంది.
నిర్మాణానికి నోచుకోని ఆరోగ్య కేంద్రం...
ప్రజల కోసం లారీ స్టాండులో ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి గతంలో శంకుస్థాపన చేశారు. గట్టువెనుక ప్రాంతాల్లోని మహిళలకు సౌకర్యంగా ప్రసూతి కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఆరోగ్య కేంద్రం ఉంటుందని ప్రకటించారు. అయితే.. ఆరోగ్య కేంద్రం కొన్నేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. డివిజన్ పరిధిలో ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నివాసాలకు రిజిస్ట్రేషన్లు చేయించాలి - జి.సురేష్
బాలభాస్కర్ నగర్, అల్లుడుపేట ప్రాంతాల్లోని నివాసాలకు రిజిస్ట్రేషన్లు చేయిస్తామని శాసనసభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. అధికారులను తీసుకువచ్చి చూపించారు. త్వరలోనే చేయిస్తామంటూ ప్రకటించారు. అయిదేళ్లు గడిచినా రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రస్తుతం ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు. ఈ ప్రాంతంలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
మురుగునీరు వస్తోంది - పి.రాము
నేను డాల్ఫిన్బార్ రోడ్డులో నివాసం ఉంటున్నా. మా వీధిలో కొన్నాళ్లుగా తాగునీటి పైపులైన్లలో మురుగునీరు వస్తోంది. నగరపాలక సంస్థ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. మురుగునీటి కారణంగా అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. తాగునీటి పైపులైన్ల లీకేజీ కారణంగానే మురుగునీరు వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
[ 04-05-2024]
ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీ సేవలకే పరిమితమైన పోలీస్శాఖ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా తీరు మార్చుకోవడం లేదు. -
జగన్.. ‘పైసా’చికానందం..!
[ 04-05-2024]
‘ఇది అత్యంత దారుణం.. పండుటాకులతో జగన్ పైశాచిక క్రీడ ఆడుతున్నారు. వృద్ధులంతా ఎండలో నరకం అనుభవించాలని.. తమ బాధకు కారణం.. వాలంటీర్లు లేకపోవడమేనని వాళ్లు భావించాలనేదే.. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. -
బ్యాలట్ కాదు.. బుల్లెట్
[ 04-05-2024]
ఒక పూటలో తినే కూరగాయల్నే ఏరి ఏరి కొంటాం.. మరి అయిదేళ్లకోసారి వేసే ఓటు ఆచితూచి వేయలేమా..! సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. -
సహకారానికి జగన్ కత్తెర
[ 04-05-2024]
సహకార చట్టం ప్రకారం.. సంఘానికి నిర్ధరిత కాలవ్యవధిలో ప్రత్యేక ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. -
జగన్ జమాన.. జనం భయాన!
[ 04-05-2024]
ప్రశాంతంగా కుటుంబంతో పార్కుకు వెళ్లాలంటే భయం.. పద్మావతి ఘాట్కో... కృష్ణవేణి ఘాట్కో వెళ్లి కొద్దిసేపు సేదదీరాలన్నా భయమే... నిర్మానుష్యంగా.. చీకటిగా ఉన్న రోడ్లపై వెళ్లాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే...ఎటువైపు నుంచి బ్లేడ్, గంజాయి బ్యాచ్లు దాడి చేస్తాయో తెలీదు. -
పోలీసుపై కొడాలి నాని ప్రధాన అనుచరుడి అరాచకం
[ 04-05-2024]
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడైన కసుకుర్తి జనార్దన్ (గుడ్లవల్లేరు బాబ్జి) ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆటోనగర్పై పగ.. శ్రామికులకు సెగ
[ 04-05-2024]
ఆసియాలోనే పెద్దదైన బెజవాడ ఆటోనగర్ పారిశ్రామికవాడ నేడు అనేక సమస్యలతో సతమతమౌతోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని పట్టించుకోవడం మానేసింది. -
వంశీ, నానీ.. ‘దారి’ మరిచారేం?
[ 04-05-2024]
గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలకు ఎంతగానో ఉపకరించే కీలక రహదారి అభివృద్ధిపై వైకాపా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం చూపారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. -
రూ.కోట్ల విలువైన స్థలంఫై విష్ణు కన్ను
[ 04-05-2024]
నగరంలో గత అయిదేళ్లలో వైకాపా ప్రజాప్రతినిధులు.. ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా కబ్జా చేసేశారు. స్థానిక కార్పొరేటర్ల అండతో ప్రభుత్వ స్థలాలను మింగేశారు. -
బూతుల నేత.. మెరకలో మేత!
[ 04-05-2024]
శతకోటి అక్రమాలకు అనంతకోటి ఉపాయాలు! మట్టి నుంచి రూ. కోట్లు ఎలా పిండుకోవచ్చో గుడివాడ వెళ్లి చూస్తే తెలుస్తుంది.ఆ పిండుకున్నదాన్ని చట్టానికి దొరక్కుండా ఎలా జేబులో వేసుకోవచ్చో కూడా చూడొచ్చు. -
తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయుల దాడి
[ 04-05-2024]
బాపులపాడు మండలం కొత్తమల్లవల్లిలో తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. ఇళ్ల మీదకు వెళ్లి దాడికి పాల్పడ్డారు. -
మళ్లీ అదే తంతు
[ 04-05-2024]
అనుమతి లేకుండా 59వ డివిజన్లోని పలు నివాసాలపై వైకాపా నేతలు ఆ పార్టీ స్టిక్కర్లు అంటించడం వివాదాస్పదమైంది. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను
[ 04-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని చిన్ని, శ్రీరాం తాతయ్య పేర్కొన్నారు. -
కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యం: సుజనా
[ 04-05-2024]
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు కృషి చేయాలని పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. -
చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
[ 04-05-2024]
నగరంలోని ఆంధ్రా ఆసుపత్రిలో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే సౌజన్యంతో 15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. -
తెదేపాతోనే యువతకు భవిష్యత్తు
[ 04-05-2024]
యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని విజయవాడ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 04-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
టికెట్టు లేని ప్రయాణాలకు జరిమానా
[ 04-05-2024]
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్టు లేని ప్రయాణికుల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రికార్డు స్థాయిలో డివిజన్కు రూ.7.96కోట్ల ఆదాయం లభించింది. -
ప్రధాని రోడ్షో భద్రతపై సమీక్ష
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షోలో పాల్గొననున్నారని ఇందుకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రధాని పర్యటనకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!