ఓటర్లు పెరిగారు
జిల్లాలో ఓటర్ల సంఖ్య 15.39 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 15.18 లక్షలుగా ఉంది.
జిల్లాలో జనవరి నాటికి 15.39 లక్షలు
తుది జాబితా అనంతరం 21,205 పెరుగుదల
కలెక్టరేట్(మచిలీపట్నం): జిల్లాలో ఓటర్ల సంఖ్య 15.39 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 15.18 లక్షలుగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఓటర్ల జాబితాపై విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. మృతుల ఓట్లు జాబితా నుంచి తొలగించకపోవడం, డబుల్ ఎంట్రీలు, బూత్ల మార్పు వంటి అంశాలపై సవరణలు కోరుతూ పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. నూతన ఓటర్ల నమోదు, అభ్యంతర పరిశీలన క్రమంలో తాజాగా సవరించిన జాబితాను విడుదల చేశారు. ఈ ఏడాది తుది జాబితాతో పోల్చుకుంటే 21,205 మంది ఓటర్లు పెరిగారు. పురుషులు 8,677 మంది, మహిళలు 12,536 మంది పెరగగా, థర్డ్ జెండర్ ఓటర్లు 8 మంది తగ్గారు.
అదనంగా 38,422: తుది జాబితా అనంతరం 38,422 మంది ఓటర్లు జాబితాలో కొత్తగా నమోదయ్యారు. పరిశీలనలో భాగంగా తుది జాబితా నుంచి 17,217 మంది ఓటర్లను తొలగించారు. మొత్తం మీద మార్పులు, చేర్పుల అనంతరం 21,205 మంది ఓటర్లు పెరిగారు. అత్యధికంగా పెనమలూరు నియోజకవర్గ పరిధిలో 10,759 మంది, అత్యల్పంగా అవనిగడ్డలో 2,770 మంది ఓటర్లు పెరిగారు. తొలగింపుల విషయంలో అత్యధికంగా గన్నవరంలో 5,531 మంది, అత్యల్పంగా పామర్రు నియోజకవర్గంలో 1,334 ఓట్లు తొలగించారు. పెనమలూరు అవనిగడ్డ నియోజకవర్గాల్లో మూడు చొప్పున, పెనమలూరు, మచిలీపట్నం, పెడనలో ఒకరు చొప్పున థర్డ్ జెండర్ ఓట్లు తగ్గగా గుడివాడలో ఒకరు కొత్తగా నమోదయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాకీ కళ్లకు వైకాపా గంతలు!
[ 12-05-2024]
వందలకొద్దీ సంచార బలగాలు.. విస్తృత బందోబస్తు.. ఎక్కడికక్కడ నిఘా.. సీసీ కెమెరాల పహారా.. ఇవేవీ వైకాపా నేతలకు అడ్డు కాలేదు. -
వెల్లువై రావాలి.. విల్లుపై సాగాలి!
[ 12-05-2024]
: ‘ఓటు.. ఐదేళ్లకోసారి మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. కానీ.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలోనూ.. చాలామంది అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అందుకే.. మంచి పాలకులను ఎన్నుకునే అవకాశం చేజారిపోతోంది. -
‘ఆనకట్ట’లేకపోయారు
[ 12-05-2024]
వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కృష్ణా నది జలాలు సముద్రంలో కలిసిపోకుండా నిలువరిస్తాం -
ఆగని మట్టి మాఫియా ఆగడాలు
[ 12-05-2024]
ఏటా వేసవి రాగానే గుడివాడ ప్రాంతంలో ఎమ్మెల్యే కొడాలి నాని కనుసన్నల్లో మట్టి మాఫియా అయిదేళ్లుగా రెచ్చిపోతోంది. -
జీవాలపైనా జాలి లేదా.. జగన్
[ 12-05-2024]
ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ పశువైద్య కేంద్రా(ఆర్ఎల్యూ)ల్లో 50 శాతానికి పైగా శిథిలావస్థలో ఉన్నాయి. 75 శాతం వీడీలు(వెటర్నరీ డిస్పెన్సరీ)లో కనీస వసతులు లేవు. మండల స్థాయిలో ఆర్ఎల్యూలు సరాసరిన ఆరు, వీడీలు రెండు చొప్పున ఉన్నాయి. -
మెట్రో రైలుకు జగన్ ఉరి!
[ 12-05-2024]
పాలకులకు దూరదృష్టి ఉండాలి.. భవిష్యత్తు అవసరాలను అంచనా వేయగలగాలి.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ఆలోచనలు చేస్తుండాలి... -
ఓటర్లకు ఎన్ని కష్టాలో..
[ 12-05-2024]
రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు జనం భారీగా తరలివస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా కుటుంబాలతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సొంతూళ్లకు పయనమయ్యారు. -
మొదటి ఓటు పార్లమెంటు అభ్యర్థికే...!
[ 12-05-2024]
తాజా ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో పౌరులు ఎక్కువగా తికమక పడే వీలుంది. తాను వేయాల్సిన వ్యక్తికో.. పార్టీకో సక్రమంగా ఓటు వేయడంలో కొంత గందరగోళానికి గురవుతుంటారు.