యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా
ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన పెద్దపప్పూరు మండలంలోని చిన్నపప్పూరు గ్రామ పరిధిలో అశ్వర్థ ఆలయ సమీపంలోని పెన్నానదిలో బుధవారం చోటుచేసుకుంది.
గణేష్ (పాతచిత్రం)
పెద్దపప్పూరు, న్యూస్టుడే: ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన పెద్దపప్పూరు మండలంలోని చిన్నపప్పూరు గ్రామ పరిధిలో అశ్వర్థ ఆలయ సమీపంలోని పెన్నానదిలో బుధవారం చోటుచేసుకుంది. అతడి కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. తాడిపత్రి పట్టణంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన గణేష్ (24) కుటుంబ సభ్యులతో కలసి చిన్నపప్పూరులోని అశ్వర్థ ఆలయంలో బంధువుల కేశఖండన వేడుకకు హాజరయ్యాడు. వేడుకలో బంధువులతో కలసి సందడిచేసిన గణేష్ తన స్నేహితులతో కలసి పెన్నానదిలోకి సరదాగా ఈత కొట్టడానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ అకస్మాత్తుగా లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోయాడు. స్థానికులు, స్నేహితులు అరగంట పాటు గాలించి నీట మునిగిన యువకుడిని బయటకు తీశారు. అప్పటికే అతడు మృతిచెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎనిమిదేళ్ల క్రితం భర్త దూరమై.. కొడుకే జీవితంగా బతుకుతున్న గణేష్ తల్లి పెద్దక్క రోదన పలువురిని కలచివేసింది. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వేలాది భక్తులు వచ్చే అశ్వర్థ ఆలయ సమీపంలోని పెన్నానదిలో గుంతల్లో అధిక లోతు నీరు ఉన్నా ఆలయ సిబ్బంది ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైతన్య కెరటం.. ఓటెత్తిన జనసంద్రం
[ 14-05-2024]
జిల్లాలో ఓటర్ల చైతన్యం పోటెత్తింది. మునుపెన్నడూ లేనివిధంగా భారీ ఎత్తున ఓటర్లల్లో ఉత్సాహం ఉరకలేసింది. -
రెచ్చిపోయిన వైకాపా మూకలు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ వైకాపా నాయకులు రెచ్చిపోయారు. ప్రజామోదంతో కాకుండా అరాచకాలతో ఎన్నికల్లో గెలవాలని కుట్రలకు తెరతీశారు. -
అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం
[ 14-05-2024]
జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్సభ పరిధిలోని ఈవీఎంలన్నీ జేఎన్టీయూ స్ట్రాంగ్ రూంకు చేరాయి. -
ఓపిగ్గా నిలబడి.. ఓటేశారు
[ 14-05-2024]
జిల్లా అంతటా ఎక్కడ చూసినా ఓట్ల పండుగతో సందడి కనిపించింది. -
అడుగడుగునా తెదేపా శ్రేణుల అడ్డగింత
[ 14-05-2024]
ఉరవకొండ ప్రాంతంలో పోలీసులు, అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద తెదేపా శ్రేణులపై తమ ప్రతాపాన్ని చూపారు. -
వైకాపా బరితెగింపు
[ 14-05-2024]
సజావుగా జరుగుతున్న ఎన్నికల తరుణంలో చిలమత్తూరు వైకాపా ఎంపీపీ పురుషోత్తం రెడ్డి అనుచరులు హుసేన్పురం గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు బాబురెడ్డిపై దాడి చేసి గాయపరిచారు. -
ధర్మవరంలో పోలీసుల ప్రేక్షక పాత్ర : సత్యకుమార్
[ 14-05-2024]
ధర్మవరంలో రౌడీ మూకలను కట్టడి చేయాల్సిన పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రేక్షకపాత్ర వహించారని ధర్మవరం భాజపా అభ్యర్థి సత్యకుమార్ అన్నారు. -
ఓటేసిన కళ్లల్లో అమితానందం
[ 14-05-2024]
గత ఐదేళ్లుగా తమ ఓటు హక్కు కోసం చిత్రావతి ముంపు గ్రామాల ప్రజలు వైకాపా ప్రభుత్వం, అధికారులతో పోరాటం చేశారు. -
పోలింగ్ కేంద్రంలో తల్లడిల్లిన చిన్నారి
[ 14-05-2024]
ముదిగుబ్బ మండలం రామస్వామి తండా ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటర్లు పోటెత్తారు. -
తాయిలాలకు నకిలీ నోట్లు?
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు రాజకీయ నాయకులు ఇచ్చిన తాయిలాల్లో నకిలీ నోట్లు వచ్చాయని జనం ఆరోపిస్తున్నారు. -
ఫ్యాన్కు ఓటేయాలంటూ ఓపీఓ సూచన
[ 14-05-2024]
తనకల్లు మండలంలోని దేవలం తండా గ్రామంలో 263 బూత్లో ఓపీఓ సరస్వతి ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలంటూ వృద్ధురాలికి సూచించింది. -
తోపుదుర్తిలో దొంగ ఓట్లు వేసేందుకు వైకాపా కుట్ర
[ 14-05-2024]
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సొంత గ్రామంలో దొంగ ఓట్లు వేసేందుకు ఆయన సోదరుడు కుట్ర చేశారు. -
స్టోర్ డీలర్పై కత్తితో దాడి
[ 14-05-2024]
మండలంలోని కుసుమవారిపల్లికి చెందిన స్టోర్ డీలర్ నాగేంద్ర (ఇంద్రప్ప)పై అదే గ్రామానికి చెందిన ఇడగొట్టు రంగప్ప సోమవారం కత్తితో దాడి చేశాడు. -
న్యూస్టుడే విలేకరికి వైకాపా నాయకుడి బెదిరింపులు
[ 14-05-2024]
పోలింగ్ కేంద్రంలో వైకాపా నేతల ఉల్లంఘనలను ప్రశ్నించిన బుక్కపట్నం న్యూస్టుడే విలేకరిపై ఆ పార్టీ నాయకులు బెదిరింపులకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!