బండ్లపల్లి యువతి.. అంతర్జాతీయ ఖ్యాతి
నార్పల మండలం బండ్లపల్లికి చెందిన బి.అనూష అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. ఆమె బౌలింగ్ చేస్తే బంతి గింగిరాలు తిరిగి వికెట్ను ముద్దాడుతుంది.
అనూష
అనంతపురం క్రీడలు, న్యూస్టుడే: నార్పల మండలం బండ్లపల్లికి చెందిన బి.అనూష అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. ఆమె బౌలింగ్ చేస్తే బంతి గింగిరాలు తిరిగి వికెట్ను ముద్దాడుతుంది. బ్యాటింగ్ చేస్తే పరుగుల వరద పారాల్సిందే. ఇక ఫీల్డింగ్ విషయానికొస్తే మైదానంలో పాదరసంలా కదిలి బంతిని బౌండరీకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో మురిపిస్తున్న 19 ఏళ్ల ఈ గ్రామీణ యువతి అంతర్జాతీయ పోటీలకు తొలిసారిగా ఎంపికైంది. దేశవాళీ పోటీల్లో అత్యుత్తమ ఆల్రౌండ్ ప్రతిభ చూపిన ఆమె హాంకాంగ్లో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న అండర్-23 క్రికెట్ పోటీలకు ఎంపికైంది. ఆర్డీటీ క్రికెట్ పోటీల్లో అరంగేట్రం చేసిన ఈ బాలిక అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. గ్రామస్థాయి క్రికెట్ నుంచి హాంకాంగ్ పర్యటనకు ఎలా ఎంపికైందో తెలుసుకోవాల్సిందే..
బ్యాటింగ్ చేస్తూ..
చదువు: బీకాం చివరి సంవత్సరం,
కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయమే, బౌలింగ్ శైలి: ఎడమచేతి వాటం స్పిన్నర్, బ్యాటింగ్: ఎడమచేతి బ్యాటింగ్ (ఆల్రౌండరు)
ప్రవేశం: 2014-15 సీజన్లో తొలిసారిగా ఆర్డీటీ క్రికెట్ పోటీల్లో ప్రాతినిథ్యం. బండ్లపల్లి బాలికల జట్టును ఒంటిచెత్తో విజేతగా నిలిపింది.
ప్రాతినిథ్యం: 2015-16 నుంచి వరుసగా ఆంధ్ర జట్టుకు ఎంపిక. అండర్-16 నుంచి సీనియర్స్ వరకు వివిధ విభాగాల జట్లకు ప్రాతినిథ్యం. అండర్-17 విభాగంలో జాతీయ పాఠశాల క్రికెట్ పోటీలకు ఎంపిక. ఆంధ్ర జట్టుకు మూడోస్థానం రావడానికి అద్భుత ప్రదర్శన. బెంగళూరు, పుదుచ్చేరి, అసోం, గ్వాలియర్, హైదరాబాద్, కొచ్చిన్, బరోడాల్లో జరిగిన దేశవాళీ పోటీల్లో ప్రతిభ చాటింది.
ప్రోత్సాహం: ఆర్డీటీ అకాడమీలో చేరిన తర్వాత దశ తిరిగింది. ప్రతిభకు పదును పెట్టడంతో జిల్లా నుంచి వరుసగా ఆంధ్ర జట్టులో స్థానం సాధించింది. ఆర్డీటీ, జిల్లా క్రికెట్ సంఘం ప్రోత్సాహంతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంది.
నేడే తొలి మ్యాచ్: హాంకాంగ్ పర్యటకు వెళ్లిన అండర్-23 భారత మహిళా జట్టు మంగళవారం హాంకాంగ్తో తలపడుతుంది. ఈనెల 15న థాయ్లాండ్తో, 17న పాకిస్థాన్తో మనదేశ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్లో సాధించే విజయాలను బట్టి సెమీఫైనల్, ఫైనల్ అవకాశాలుంటాయి.
ఉత్తమ ప్రదర్శన
దక్షిణ మండల సీనియర్స్ మహిళా క్రికెట్ టీ20 పోటీల్లో 10 వికెట్లు, వన్డే పోటీల్లో 27 వికెట్లు పడగొట్టింది. బీసీసీఐ ఇంటర్జోన్ వన్డే పోటీలు, ఛాలెంజర్ ట్రోఫీ, బీసీసీఐ సీనియర్ ఛాలెంజర్స్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంఖ్యాపరంగా ఎక్కువ.. ఓటింగ్ తక్కువ
[ 16-05-2024]
ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లదే హవా కనిపించేది. పురుషుల కంటే.. స్త్రీ ఓటర్లే ఎక్కువ మంది ఓటేస్తూ వచ్చారు. ఈ దఫా ఏమైందో.. ఏమో పురుషుల కంటే స్త్రీల శాతం తక్కువ నమోదు కావడం విశేషం. -
ప్రతిభకు పెద్దపీట.. పేద విద్యార్థులకు బాసట
[ 16-05-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కుటుంబాల్లో చదువుల జ్యోతి వెలిగించడానికి ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యా పథకానికి ఆదరణ పెరుగుతోంది. ప్రతిభ ఉండి చదువు‘కొన’లేని పేద విద్యార్థుల కల్పతరువుగా ఉన్న ఈ పథకం కింద ఎంపిక కావాలంటే ఎంతో శ్రమించాల్సిందే. -
పైకి గాంభీర్యం.. లోలోన భయం!
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. ఎన్నికలకు కౌంటింగ్కు 22 రోజుల గడువు ఉంది. తెదేపా, వైకాపా నేతలు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. -
కియా అనుబంధ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
[ 16-05-2024]
సోమందేపల్లి మండలం గుడిపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న కియా అనుబంధ పరిశ్రమ ఎస్ఎల్ఏపీలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. -
జిల్లాలో 144 సెక్షన్ పొడిగింపు
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జిల్లాలో అక్కడక్కడ గొడవలు, దాడులు చోటు చేసుకుంటున్న తరుణంలో 144 సెక్షన్ అమలు గడువును పొడిగించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) వినోద్కుమార్ ప్రత్యేక ఉత్తర్వును జారీ చేశారు. -
ఎస్కేయూ సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక
[ 16-05-2024]
ఎస్కేయూ పురుషుల సాఫ్ట్బాల్ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య శ్రీనివాసన్ తెలిపారు. -
శిక్షణతో రాణింపు.. ఆటలో గుర్తింపు
[ 16-05-2024]
వందమంది విద్యార్థులను ఒకచోట కలిపి మీకు క్రీడల్లో ఏదంటే ఇష్టం అని ప్రశ్నిస్తే 95 శాతం మంది పిల్లలు క్రికెట్ అని సమాధానమిస్తారు. క్రీడామైదానాల్లోనే కాదు చిన్నచిన్న వీధుల్లో కూడా పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. -
డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు వైకాపా నాయకుల దాడి
[ 16-05-2024]
వైకాపా నాయకులు ఆక్రమించుకున్న భూమిని తాము ఖాళీ చేయిస్తామని కొందరు ఆ పార్టీ నాయకులే నమ్మబలికారు. బాధితుల నుంచి రూ. 5 లక్షలు తీసుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
[ 16-05-2024]
గుంతకల్లులోని బళ్లారి రోడ్డు శివారు పొలాల్లో బోయ ప్రసాద్(39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఒకటో పట్టణ సీఐ రామసుబ్బయ్య, బాధిత కుటుంబ సభ్యులు వివరాల మేరకు ప్రసాద్కు నెలగొండ గ్రామానికి చెందిన కవితతో 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. -
ప్రతిభకు పెద్దపీట.. పేద విద్యార్థులకు బాసట
[ 16-05-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కుటుంబాల్లో చదువుల జ్యోతి వెలిగించడానికి ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యా పథకానికి ఆదరణ పెరుగుతోంది. ప్రతిభ ఉండి చదువు‘కొన’లేని పేద విద్యార్థుల కల్పతరువుగా ఉన్న ఈ పథకం కింద ఎంపిక కావాలంటే ఎంతో శ్రమించాల్సిందే.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
-
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం.. సుప్రీం ఏమందంటే..?
-
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
-
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం