logo

అరాచక ప్రభుత్వాన్ని సాగనంపండి: కేశవ్‌

రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా అరాచక పాలన సాగించిందని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.

Published : 23 Apr 2024 04:40 IST

మాట్లాడుతున్న పయ్యావుల కేశవ్‌

విడపనకల్లు, ఉరవకొండ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా అరాచక పాలన సాగించిందని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన విడపనకల్లు మండలం కడదరబెంచి, డొనేకల్లు, ఎన్‌.తిమ్మాపురం, గడేకల్లు, పెంచలపాడు, పొలికి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. దౌర్జన్యం, భూములను ఆక్రమించడం, దళితులు, గిరిజనులపై దాడులే లక్ష్యంగా వైకాపా పాలన సాగిందన్నారు. సంక్షేమాన్ని అడ్డు పెట్టుకుని ఆ పార్టీ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో తెదేపా గెలిస్తేనే అన్ని వర్గాల సంక్షేమంతో పాటు, అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనరు చిన్న మారయ్య, మాజీ ఎంపీపీ ప్రతాపనాయుడు, నాయకులు భీమలింగ చౌదరి, వెంకటేశ్‌, శ్రీనివాసులు, రామాంజనేయులు, చంద్రశేఖర్‌, జనార్దననాయుడు, తిప్పారెడ్డి, వన్నూరుస్వామి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని