జీబీసీపై కన్నెత్తి చూడని జగన్
గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ)ను జగన్ సర్కారు ఈ ఐదేళ్లలో కన్నెత్తి చూడలేదు. ఉరవకొండ, విడపనకల్లు, గుంతకల్లు, కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంత రైతులకు జీబీసీ వరం లాంటిది.
ఆధునికీకరణకు నోచుకోని సాగునీటి కాలువ
ఉరవకొండ-రాయంపల్లి సమీపంలో శిథిలమైన అండర్ టన్నెల్
ఉరవకొండ, విడపనకల్లు, గుంతకల్లు పట్టణం, న్యూస్టుడే: గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ)ను జగన్ సర్కారు ఈ ఐదేళ్లలో కన్నెత్తి చూడలేదు. ఉరవకొండ, విడపనకల్లు, గుంతకల్లు, కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంత రైతులకు జీబీసీ వరం లాంటిది. దీనికి హెచ్చెల్సీ నుంచి తుంగభద్ర జలాలు అందిస్తారు. గత తెదేపా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఫేజ్-1 ఆధునికీకరణ పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఫేజ్-2 ఆధునికీకరణను అటకెక్కించింది. ఫలితంగా చివరి ఆయకట్టుకు నీరు ప్రశ్నార్థకంగా మారింది.
ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద తుంగభద్ర ఎగువ కాలువ నుంచి గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ) ప్రారంభం అవుతుంది. ఉరవకొండ, విడపనకల్లు, గుంతకల్లు మండలాల మీదుగా కర్నూలు జిల్లా వైపు ప్రవహిస్తుంది. దీని కింద రైతులు మిరప, పత్తి, వరి పంటలు అధికంగా పండిస్తారు. 2017లో తెదేపా ప్రభుత్వం రూ.120 కోట్లతో ఫేజ్-1 ఆధునికీకరించింది. 28వ కిలోమీటరు నుంచి ఫేజ్-2 ప్రారంభం అవుతుంది. దీని ఆధునికీకరణకు గత తెదేపా ప్రభుత్వం రూ.118కోట్లు మంజూరు చేసింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడే నాటికి కాలువ మట్టి లైనింగ్తోపాటు నాలుగు కిలోమీటర్లు సిమెంటు లైనింగ్ పూర్తయ్యింది. ఇక అంతే ఈ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. ఫలితంగా కాలువ ఎక్కడికక్కడ శిథిలం అయ్యింది. 48వ కిలోమీటరు వరకు కూడా నీరు రావడం లేదు. ఏటా ఖరీఫ్లో రైతులు చందాలు వేసుకుని కాలువను సరి చేసుకుని అరకొర నీటితో పంటలు పండించుకుంటున్నారు.
విడపనకల్లు మండలం పొలికి సమీపంలో కాలువ దుస్థితి
అండర్ టన్నెళ్లు, అక్విడెక్టులు శిథిలం
జీబీసీ 0 కి.మీ. నుంచి 59.5 కిలోమీటర్ల వరకు కాలువ పొడవునా 20 వరకు అండర్ టన్నెళ్లు, అక్విడెక్టులు ఉన్నాయి. ఫేజ్-1 ఆధునికీకరణ పనుల్లో ప్రధానంగా కాలువ లైనింగ్కు ప్రాధాన్యం ఇచ్చారు. అండర్ టన్నెళ్లు, అక్విడెక్టుల పనులు పూర్తి కాలేదు. ఐదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. వాటి వద్ద కొన్నేళ్లుగా 200 క్యూసెక్కుల వరకు సాగునీరు వృథాగా పోతున్నాయి.
చివరి ఆయకట్టు ప్రశ్నార్థకం
జీబీసీ 59.5 కిలోమీటర్లు పొడవు ఉండగా, అందులో నీరు 30 కిలోమీటర్ల దూరం వెళ్లడం కష్టంగా మారింది. కారణం శిథిలమైన అండర్ టన్నెళ్లు, అక్విడెక్టుల నుంచి భారీగా జలాలు వంకల పాలవుతున్నాయి. దానికితోడు ఫేజ్-2 ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో ఐదేళ్లుగా చివరి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇదంతా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు చూస్తున్నా తమకేదీ పట్టునట్లు ఉంటున్నారు. 15వ కిలోమీటరు వద్ద తరచూ అక్విడెక్టుకు భారీ రంధ్రాలు పడటంతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
- సాగునీటి పథకం: గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ)
- కాలువ పొడవు: 59.5 కిలోమీటర్లు
- ఆయకట్టు: 15,800 ఎకరాలు
- ఫేజ్-1 ఆధునికీకరణకు వ్యయం: రూ.120 కోట్లు
- ఫేజ్-2కు నిధుల మంజూరు: రూ.118 కోట్లు (తెదేపా ప్రభుత్వ హయాంలో)
- ఐదేళ్ల వైకాపా పాలనలో ఒక్క పని చేయలేదు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంఖ్యాపరంగా ఎక్కువ.. ఓటింగ్ తక్కువ
[ 16-05-2024]
ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లదే హవా కనిపించేది. పురుషుల కంటే.. స్త్రీ ఓటర్లే ఎక్కువ మంది ఓటేస్తూ వచ్చారు. ఈ దఫా ఏమైందో.. ఏమో పురుషుల కంటే స్త్రీల శాతం తక్కువ నమోదు కావడం విశేషం. -
ప్రతిభకు పెద్దపీట.. పేద విద్యార్థులకు బాసట
[ 16-05-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కుటుంబాల్లో చదువుల జ్యోతి వెలిగించడానికి ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యా పథకానికి ఆదరణ పెరుగుతోంది. ప్రతిభ ఉండి చదువు‘కొన’లేని పేద విద్యార్థుల కల్పతరువుగా ఉన్న ఈ పథకం కింద ఎంపిక కావాలంటే ఎంతో శ్రమించాల్సిందే. -
పైకి గాంభీర్యం.. లోలోన భయం!
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. ఎన్నికలకు కౌంటింగ్కు 22 రోజుల గడువు ఉంది. తెదేపా, వైకాపా నేతలు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. -
కియా అనుబంధ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
[ 16-05-2024]
సోమందేపల్లి మండలం గుడిపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న కియా అనుబంధ పరిశ్రమ ఎస్ఎల్ఏపీలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. -
జిల్లాలో 144 సెక్షన్ పొడిగింపు
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జిల్లాలో అక్కడక్కడ గొడవలు, దాడులు చోటు చేసుకుంటున్న తరుణంలో 144 సెక్షన్ అమలు గడువును పొడిగించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) వినోద్కుమార్ ప్రత్యేక ఉత్తర్వును జారీ చేశారు. -
ఎస్కేయూ సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక
[ 16-05-2024]
ఎస్కేయూ పురుషుల సాఫ్ట్బాల్ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య శ్రీనివాసన్ తెలిపారు. -
శిక్షణతో రాణింపు.. ఆటలో గుర్తింపు
[ 16-05-2024]
వందమంది విద్యార్థులను ఒకచోట కలిపి మీకు క్రీడల్లో ఏదంటే ఇష్టం అని ప్రశ్నిస్తే 95 శాతం మంది పిల్లలు క్రికెట్ అని సమాధానమిస్తారు. క్రీడామైదానాల్లోనే కాదు చిన్నచిన్న వీధుల్లో కూడా పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. -
డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు వైకాపా నాయకుల దాడి
[ 16-05-2024]
వైకాపా నాయకులు ఆక్రమించుకున్న భూమిని తాము ఖాళీ చేయిస్తామని కొందరు ఆ పార్టీ నాయకులే నమ్మబలికారు. బాధితుల నుంచి రూ. 5 లక్షలు తీసుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
[ 16-05-2024]
గుంతకల్లులోని బళ్లారి రోడ్డు శివారు పొలాల్లో బోయ ప్రసాద్(39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఒకటో పట్టణ సీఐ రామసుబ్బయ్య, బాధిత కుటుంబ సభ్యులు వివరాల మేరకు ప్రసాద్కు నెలగొండ గ్రామానికి చెందిన కవితతో 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. -
ప్రతిభకు పెద్దపీట.. పేద విద్యార్థులకు బాసట
[ 16-05-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కుటుంబాల్లో చదువుల జ్యోతి వెలిగించడానికి ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యా పథకానికి ఆదరణ పెరుగుతోంది. ప్రతిభ ఉండి చదువు‘కొన’లేని పేద విద్యార్థుల కల్పతరువుగా ఉన్న ఈ పథకం కింద ఎంపిక కావాలంటే ఎంతో శ్రమించాల్సిందే.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM