ఈ ఆస్పత్రుల్లో ఎలా జగన్..
ప్రభుత్వాసుపత్రుల్లో అసౌకర్యాలు తాండవిస్తున్నాయి. రోగులకు సరిపడా గదులు లేవు.. వరండాల్లోనే వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి.
సౌకర్యాలు కరవు
రోగులకు తప్పని తిప్పలు
న్యూస్టుడే, చిత్తూరు(వైద్యం), పెనుమూరు, వెదురుకుప్పం
ప్రభుత్వాసుపత్రుల్లో అసౌకర్యాలు తాండవిస్తున్నాయి. రోగులకు సరిపడా గదులు లేవు.. వరండాల్లోనే వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి.. తాగునీటికి తిప్పలు తప్పడం లేదు.. మరుగుదొడ్లు లేక మలమూత్ర విసర్జనకు దూరంగా వెళ్లాల్సిన దయనీయ స్థితి.. అధికారంలోకి రాగానే రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు వసతులు కల్పిస్తామని గొప్పలు చెప్పినా ఆచరణలో మాత్రం ఆమడదూరంలో ఉంది.. రోగుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్లు ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెరగడం లేదు.. మరోవైపు మందుల కొరతా వేధిస్తోంది.. చెట్ల కింద వరండాల్లో ఉండాల్సి వస్తోంది.. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు, వైద్యసిబ్బంది ఎదుర్కొంటున్న అవస్థలు.. సౌకర్యాలు కల్పనపై నిర్ణయం తీసుకోవాల్సిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ.. మొక్కుబడి సమావేశాలతో మమ అనిపించేస్తోంది.
- చిత్తూరు నగర శివారు ప్రశాంత నగర్లో చేపట్టిన పీహెచ్సీ పనులు నేటికీ పూర్తికాలేదు. ప్రజలకు వైద్య సేవలు అందించాలని నిర్మాణం చేపట్టినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణం పూర్తికాకనే అర్ధాంతరంగా నిలిపేశారు. అసలు ఈ పనులు పూర్తయ్యేదెన్నడు.. ఈ ఆస్పత్రి వినియోగంలోకి వచ్చేదెన్నడోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు.
- వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం ఆసుపత్రిలో రోజుకు 150 మందికి పైగా రోగులు వైద్యసేవల నిమిత్తం వస్తుంటారు. ఇక్కడ కనీసం రోగుల సేవకులకు అవసరమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవు. తాగునీటికీ ఇబ్బందులు తప్పడంలేదు.
- పెనుమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజు దాదాపు రెండు వందల మంది రోగులు వస్తున్నారు. వీరిలో అతిసార రోగులు సైతం ఎక్కువగా ఉంటారు. వారికి వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక గదులు లేవు. దీంతో ఆసుపత్రి వరండాల్లోనే వైద్య సేవలు అందిస్తున్నారు. మంజూరైన యాబై పడకల ఆసుపత్రి నిర్మాణం పునాదులైనా దాటలేదు.
ఆసుపత్రి విస్తరించాలి..
-చంగల్రాయరెడ్డి, ఎర్రగుంట్లపల్లె, వెదురుకుప్పం మండలం
పచ్చికాపల్లం ప్రభుత్వాసుపత్రికి రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందుకు తగ్గట్లు సౌకర్యాలు మాత్రం పెరగడం లేదు. దీంతో నిత్యం పలు సేవల నిమిత్తం ఇక్కడకు వచ్చే రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. తాగునీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. గుక్కెడు నీటికోసం బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.
అతిసార రోగులకు ప్రత్యేక గదులు ఉండాలి
-శివశంకర్, పెనుమూరు
వేసవికాలం కావడంతో ఆసుపత్రికి అతిసార రోగులు ఎక్కువగా వస్తుంటారు. వారికి ప్రత్యేక గదులు లేవు. ఆసుపత్రి వరండాల్లోనే వైద్య సేవలు అందించాల్సి వస్తోంది. ఫలితంగా రోగుల అవస్థలు చెప్పనలవికావు. మరోవైపున ఆసుపత్రి నిర్మాణం నత్తనకడన సాగుతోంది. ఇది ఎప్పటికి పూర్తవుతుందో వేచిచూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
[ 04-05-2024]
మంత్రి రోజా ప్రచారాన్ని వడమాలపేట మండలం వేమాపురం గ్రామస్థులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. పూడి పంచాయతీలోని వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారం నిర్వహించడానికి ప్రచారం రథంలో వచ్చారు. -
కళ్లు మూసుకున్నారా ఐదేళ్లు..
[ 04-05-2024]
‘రాజకీయ నాయకుడికి విలువలు, విశ్వసనీయత ఉండాలి. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేయాలి.’ -
ఈ పాపం నీదే జగన్..
[ 04-05-2024]
మండు టెండలో రెండో రోజూ వృద్ధులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా తన స్వార్థ ప్రయోజనం కోసం వేదనకు గురిచేశారు. -
నగరిలో సైకిల్ జోరు..
[ 04-05-2024]
నగరిలో మంత్రి రోజాను వ్యతిరేకిస్తూ అసమ్మతి నాయకులు ఇన్నాళ్లు గళం విప్పుతూ వచ్చారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా అధిష్ఠానం ఇచ్చింది. -
జగనే సర్పంచులకు గండం
[ 04-05-2024]
దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు వైకాపా ప్రభుత్వం పంచాయతీ నిధులనూ వదల్లేదు.. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కన్న కలలను సీఎం జగన్ కల్లోలం చేశారు.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మార్చారు. -
మా బతుకులు రోడ్డున వేశావ్.. జగన్!
[ 04-05-2024]
కష్టాన్ని నమ్ముకున్న బడుగు జీవులు వైకాపా పాలనలో ఇసుక కొరతతో నానా అవస్థలు పడ్డారు. చేద్దామంటే పనుల్లేక.. తిందామంటే తిండిలేక.. ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేద్దామంటే పనుల్లేక.. పెరిగిన నిత్యావసరాల ధరలు భవన నిర్మాణ రంగ కార్మికులకు పూట గడవని పరిస్థితులు దాపురించాయి. -
మేనమామ.. క్రీడలపై సవతి ప్రేమ..!
[ 04-05-2024]
బటన్ నొక్కి పిల్లలకు మేనమామలా సంక్షేమం ఇచ్చానని చెప్పిన సీఎం జగన్. క్రీడాకారులపై మాత్రం సవతి ప్రేమ చాటారని క్రీడా లోకం మండిపడిపోతోంది. కమర్షియల్ క్రీడల్లో సాధనకు రుసుమల్ని పెంచి.. పేద ఆటగాళ్లను ఆటలకు దూరం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. -
చిత్తూరును స్మార్ట్సిటీని చేస్తా
[ 04-05-2024]
పేదలకు అండగా నిలవడం నాకు ఇష్టం.. జిల్లా కేంద్రమైనా చిత్తూరులో అభివృద్ధి జాడేలేదు.. యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై సహా విదేశాలకు వెళ్తున్నారు.. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో రాజకీయాల్లోకి రాక ముందే జీజేఎం ట్రస్టు ద్వారా ప్రజాసేవకు శ్రీకారం చుట్టా.. -
‘భవన’దీయుడి కోసం
[ 04-05-2024]
నంది కూడలిలో ఉన్న ఈ అత్యాధునిక భవనం నగరపాలక సంస్థకు చెందినది. తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ నిధులు రూ.2 కోట్లు వెచ్చించి తిరుమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం నిర్మించారు. -
వృద్ధులమని తెలుసు.. ఇంటికివ్వలేని మనసు
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వ చర్యలతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయట ఎండకు, బ్యాంకుల్లో ఉక్కపోతతో అల్లాడిపోయారు. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. -
బారుకు వెళ్తేనే బీరు
[ 04-05-2024]
ఎండాకాలంలో బీర్లకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. మండుటెండలో ప్రభుత్వ మద్యం దుకాణాలు తిరిగినా బీరు దొరక్క బార్ల మెట్లెక్కాల్సి వస్తోంది. రూ.350 - రూ.410 వరకు చెల్లించి బీర్లు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘తాపీ’గా లేం జగన్!
[ 04-05-2024]
వైకాపా సర్కార్ తెచ్చిన ఇసుక విధానం, సామగ్రి ధరల పెరుగుదల కూలీలకు శాపంగా మారింది. అరకొర పనులు, అప్పుల బాధలు, సమస్యలు భరించలేక కార్మికులు బలవన్మరణాలకు దారితీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు