ఏడాదిలోపే.. నాణ్యత లోపాలు
శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈక్రమంలో శ్రీవారి దర్శనంతోపాటు మెరుగైన వసతిని తితిదే నుంచి ఆశిస్తారు.
తిరుమలలో గదుల ఆధునికీకరణ తీరిది
తిరుమల, న్యూస్టుడే: శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈక్రమంలో శ్రీవారి దర్శనంతోపాటు మెరుగైన వసతిని తితిదే నుంచి ఆశిస్తారు. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా వసతి గదుల నిర్వహణలో మెరుగైన ఏర్పాట్లు, వాటి ఆధునికీకరణ ఫలితాలు మాత్రం భక్తులకు అందడం లేదు. గుత్తేదారుల అవినీతి, ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, తితిదే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి కారణంగా వసతి భవనాల్లోని లోటుపాట్లు భక్తులకు శాపంగా మారాయి.
తిరుమల వ్యాప్తంగా ఉన్న పాత వసతి కేంద్రాలను ఆధునికీకరించేందుకు ఇంజినీరింగ్ అధికారులు రూ.110 కోట్లతో టెండర్లను ఆహ్వానించి పనులు దాదాపు పూర్తిచేశారు. 7,400 గదులున్న తిరుమలలో పనులు దశలవారీగా కరోనా సమయం నుంచి నిర్వహిస్తున్నారు. పాత కాటేజీల్లోని మరుగుదొడ్ల మరమ్మతులు, గదుల్లో సదుపాయాల మెరుగుదల చాలావరకు పూర్తిచేశారు. శీతాకాలంలో భక్తులు ఇబ్బందిపడకుండా ప్రతిగదిలో గీజర్ ఏర్పాటు చేశారు. గదుల్లో ఫ్లోరింగ్, విద్యుత్తు తీగల మార్పు, మూత్రశాలలు, మరుగుదొడ్ల ఆధునికీకరణ, ప్లంబింగ్ తదితర పనులు చేపట్టారు. వీటితోపాటు పెయింటింగ్ పూర్తిచేశారు. అయితే గదుల ఆధునికీకరణ చేపట్టి ఏడాదికాకముందే పలు గదుల్లో నాణ్యతాపరమైన లోపాలు బయటపడుతున్నాయి.
లీకేజీలు.. పాచిపట్టిన గదులు
డ్రైనేజీ పైపుల లీకేజీలు, మరోవైపు పాచిపట్టిన గదులు పాత భవంతులను తలపిస్తున్నాయి. త్వరగా పూర్తిచేయాలనే ధోరణితో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టారు. వాటిని పర్యవేక్షించాల్సిన తితిదే ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో పనుల్లో నాణ్యత కరవైనట్లు స్పష్టమవుతోంది. డ్రైనేజీ పైపుల నుంచి లీకేజీలు, పాచిపట్టిన గదులతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏఎన్సీ, ఎస్ఎంసీ, ఎస్ఎన్సీ గదుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.
గది మార్చుకోవాల్సి వచ్చింది
- సురేష్కుమార్, చిత్తూరు
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చాం. ఏఎన్సీలో గదిని తీసుకున్నాం. దాని నిర్వహణ దారుణంగా ఉంది. నీటి లీకేజీ, బూజుపట్టడం తోడు గదిని శుభ్రం చేయలేదు. ఏఎన్సీ విచారణ అధికారుల దృష్టికి తీసుకెళ్లి గదిని మార్చుకున్నాం. తితిదే ఉన్నతాధికారులు ఇటువంటి గదులపై దృష్టిసారించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనమామ.. క్రీడలపై సవతి ప్రేమ..!
[ 04-05-2024]
బటన్ నొక్కి పిల్లలకు మేనమామలా సంక్షేమం ఇచ్చానని చెప్పిన సీఎం జగన్. క్రీడాకారులపై మాత్రం సవతి ప్రేమ చాటారని క్రీడా లోకం మండిపడిపోతోంది. కమర్షియల్ క్రీడల్లో సాధనకు రుసుమల్ని పెంచి.. పేద ఆటగాళ్లను ఆటలకు దూరం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. -
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
[ 04-05-2024]
మంత్రి రోజా ప్రచారాన్ని వడమాలపేట మండలం వేమాపురం గ్రామస్థులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. పూడి పంచాయతీలోని వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారం నిర్వహించడానికి ప్రచారం రథంలో వచ్చారు. -
చిత్తూరును స్మార్ట్సిటీని చేస్తా
[ 04-05-2024]
పేదలకు అండగా నిలవడం నాకు ఇష్టం.. జిల్లా కేంద్రమైనా చిత్తూరులో అభివృద్ధి జాడేలేదు.. యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై సహా విదేశాలకు వెళ్తున్నారు.. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో రాజకీయాల్లోకి రాక ముందే జీజేఎం ట్రస్టు ద్వారా ప్రజాసేవకు శ్రీకారం చుట్టా.. -
భవనదీయుడి కోసం
[ 04-05-2024]
నంది కూడలిలో ఉన్న ఈ అత్యాధునిక భవనం నగరపాలక సంస్థకు చెందినది. తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ నిధులు రూ.2 కోట్లు వెచ్చించి తిరుమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం నిర్మించారు. -
వృద్ధులమని తెలుసు.. ఇంటికివ్వలేని మనసు
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వ చర్యలతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయట ఎండకు, బ్యాంకుల్లో ఉక్కపోతతో అల్లాడిపోయారు. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. -
బారుకు వెళ్తేనే బీరు
[ 04-05-2024]
ఎండాకాలంలో బీర్లకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. మండుటెండలో ప్రభుత్వ మద్యం దుకాణాలు తిరిగినా బీరు దొరక్క బార్ల మెట్లెక్కాల్సి వస్తోంది. రూ.350 - రూ.410 వరకు చెల్లించి బీర్లు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘తాపీ’గా లేం జగన్!
[ 04-05-2024]
వైకాపా సర్కార్ తెచ్చిన ఇసుక విధానం, సామగ్రి ధరల పెరుగుదల కూలీలకు శాపంగా మారింది. అరకొర పనులు, అప్పుల బాధలు, సమస్యలు భరించలేక కార్మికులు బలవన్మరణాలకు దారితీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం