logo

వైకాపా పాలనలో కేసుల పరంపర

అమరనాథరరెడ్డి మీద వైకాపా ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదు చేసింది. ఈ విషయం ఎన్నికల అధికారులకు అయన సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపరిచారు.

Published : 23 Apr 2024 05:32 IST

పలమనేరు, న్యూస్‌టుడే: అమరనాథరరెడ్డి మీద వైకాపా ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదు చేసింది. ఈ విషయం ఎన్నికల అధికారులకు అయన సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపరిచారు. గత ఎన్నికల్లో ఒక్క కేసు లేని అమరనాథరెడ్డిపై గత ఐదేళ్లలో ఏకంగా 24 కేసులు నమోదై ఉన్నట్లు పేర్కొన్నారు. తెదేపా నాయకులపై కక్ష సాధింపులో భాగమేనని అర్థమవుతుంది. పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో నిరసన, యువగళం పాదయాత్ర సందర్భంగా కొన్ని, అంగళ్లు వద్ద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొని కేసులు పెట్టారు. ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసులు కూడా పెట్టారు. ముదివేడు, మొలకలచెరువు పర్యటనలో కూడా వివిధ కేసులు నమోదైనాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని