బస్టాండా.. అదెక్కడ..?
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు.
నియోజకవర్గ కేంద్రంలో ప్రజల ఇక్కట్లు
తారురోడ్డుపైనే బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు
గంగాధరనెల్లూరు: నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. మండలంతో పాటు చిత్తూరు గ్రామీణ, పాలసముద్రం, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, పెనుమూరు మండలపరిధి గ్రామాల ప్రజలు వందలాదిమంది ఇక్కడ బస్సుల కోసం వేచివుంటారు. వీరికి బస్టాండు, బస్షెల్టరు లాంటివి లేకపోవడం వల్ల ఎండలో, వానలో అవస్థలు పడుతూ గంటల తరబడి వేచి ఉంటున్నారు. చాలాదూరం వరకు రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఉండటం వల్ల తారు మార్గంపైనే బస్సుల కోసం వేచి వుండాల్సిన దుస్థితి. ఎండకు, వానకు రక్షణ కోసం దుకాణాల ముందు వేచిఉంటే వ్యాపారాలకు అడ్డుగా ఉంటారని దుకాణదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విధి లేక తారురోడ్డు పైనే వేచిఉండి అక్కడే బస్సులు ఆపి ఎక్కడం సాధారణమైంది. తద్వారా తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక చంటిపిల్లలు, వృద్ధులతో ప్రయాణాలు చేసేవారు పడే బాధలు వర్ణనాతీతం. నీడ సౌకర్యం లేకపోవడం సహా తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలాదూరం వరకు తారు రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో మలమూత్రాల విసర్జనకు మహిళలు, వృద్ధులు పడే బాధలు చెప్పలేం. అయిదేళ్లుగా బస్టాండు, బస్షెల్టరు నిర్మించాలని పాలకులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.
మరుగుదొడ్లు నిర్మించాలి..
చంటి పిల్లలు, వృద్ధులతో ప్రయాణించే సమయంలో గంటల తరబడి ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ అవస్థలు పడుతున్నాం. ముఖ్యంగా మరుగుదొడ్లు లేకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో మాలమూత్ర విసర్జనకు తీవ్ర అవస్థలు పడుతున్నాం. దూరప్రాంతాలకు వెళ్లి వచ్చే లోగా ఎక్కాల్సిన బస్సులు వచ్చి వెళ్లిపోవడం వల్ల ప్రయాణం చేయలేకపోతున్నాం. అన్ని వసతులతో కూడిన బస్టాండు నిర్మించాలి.
కుమారి, బంగారెడ్డిపల్లె
రోడ్డుప్రమాదాలు నివారించాలి..
బస్టాండు, బస్షెల్టరు లేకపోవడంతో విధి లేక తారురోడ్డు పైనే బస్సుల కోసం వేచిఉండి ఎక్కుతున్నాం. దీంతో తరచూ ట్రాఫిక్ సమస్యతో పాటు రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ వందలాదిమంది వేచిఉండటం చూసైనా అన్ని వసతులతో కూడిన బస్టాండు లేక బస్షెల్టరు నిర్మించాలి.
షణ్ముగం, కడపగుంట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
[ 04-05-2024]
మంత్రి రోజా ప్రచారాన్ని వడమాలపేట మండలం వేమాపురం గ్రామస్థులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. పూడి పంచాయతీలోని వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారం నిర్వహించడానికి ప్రచారం రథంలో వచ్చారు. -
కళ్లు మూసుకున్నారా ఐదేళ్లు..
[ 04-05-2024]
‘రాజకీయ నాయకుడికి విలువలు, విశ్వసనీయత ఉండాలి. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేయాలి.’ -
ఈ పాపం నీదే జగన్..
[ 04-05-2024]
మండు టెండలో రెండో రోజూ వృద్ధులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా తన స్వార్థ ప్రయోజనం కోసం వేదనకు గురిచేశారు. -
నగరిలో సైకిల్ జోరు..
[ 04-05-2024]
నగరిలో మంత్రి రోజాను వ్యతిరేకిస్తూ అసమ్మతి నాయకులు ఇన్నాళ్లు గళం విప్పుతూ వచ్చారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా అధిష్ఠానం ఇచ్చింది. -
జగనే సర్పంచులకు గండం
[ 04-05-2024]
దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు వైకాపా ప్రభుత్వం పంచాయతీ నిధులనూ వదల్లేదు.. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కన్న కలలను సీఎం జగన్ కల్లోలం చేశారు.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మార్చారు. -
మా బతుకులు రోడ్డున వేశావ్.. జగన్!
[ 04-05-2024]
కష్టాన్ని నమ్ముకున్న బడుగు జీవులు వైకాపా పాలనలో ఇసుక కొరతతో నానా అవస్థలు పడ్డారు. చేద్దామంటే పనుల్లేక.. తిందామంటే తిండిలేక.. ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేద్దామంటే పనుల్లేక.. పెరిగిన నిత్యావసరాల ధరలు భవన నిర్మాణ రంగ కార్మికులకు పూట గడవని పరిస్థితులు దాపురించాయి. -
మేనమామ.. క్రీడలపై సవతి ప్రేమ..!
[ 04-05-2024]
బటన్ నొక్కి పిల్లలకు మేనమామలా సంక్షేమం ఇచ్చానని చెప్పిన సీఎం జగన్. క్రీడాకారులపై మాత్రం సవతి ప్రేమ చాటారని క్రీడా లోకం మండిపడిపోతోంది. కమర్షియల్ క్రీడల్లో సాధనకు రుసుమల్ని పెంచి.. పేద ఆటగాళ్లను ఆటలకు దూరం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. -
చిత్తూరును స్మార్ట్సిటీని చేస్తా
[ 04-05-2024]
పేదలకు అండగా నిలవడం నాకు ఇష్టం.. జిల్లా కేంద్రమైనా చిత్తూరులో అభివృద్ధి జాడేలేదు.. యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై సహా విదేశాలకు వెళ్తున్నారు.. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో రాజకీయాల్లోకి రాక ముందే జీజేఎం ట్రస్టు ద్వారా ప్రజాసేవకు శ్రీకారం చుట్టా.. -
‘భవన’దీయుడి కోసం
[ 04-05-2024]
నంది కూడలిలో ఉన్న ఈ అత్యాధునిక భవనం నగరపాలక సంస్థకు చెందినది. తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ నిధులు రూ.2 కోట్లు వెచ్చించి తిరుమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం నిర్మించారు. -
వృద్ధులమని తెలుసు.. ఇంటికివ్వలేని మనసు
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వ చర్యలతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయట ఎండకు, బ్యాంకుల్లో ఉక్కపోతతో అల్లాడిపోయారు. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. -
బారుకు వెళ్తేనే బీరు
[ 04-05-2024]
ఎండాకాలంలో బీర్లకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. మండుటెండలో ప్రభుత్వ మద్యం దుకాణాలు తిరిగినా బీరు దొరక్క బార్ల మెట్లెక్కాల్సి వస్తోంది. రూ.350 - రూ.410 వరకు చెల్లించి బీర్లు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘తాపీ’గా లేం జగన్!
[ 04-05-2024]
వైకాపా సర్కార్ తెచ్చిన ఇసుక విధానం, సామగ్రి ధరల పెరుగుదల కూలీలకు శాపంగా మారింది. అరకొర పనులు, అప్పుల బాధలు, సమస్యలు భరించలేక కార్మికులు బలవన్మరణాలకు దారితీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.