నమ్ముకుంటే.. మోసపోయాం
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు.
గాల్లో దీపంలా భవిష్యత్తు
జగన్ మోసంపై గోపాలమిత్రల మండిపాటు
పశువులకు వైద్యం చేస్తున్న గోపాలమిత్రలు (పాత చిత్రం)
న్యూస్టుడే, పెనుమూరు, పుత్తూరు : రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు.. దీంతో గోపాలమిత్రలు ఎంతో సంబరపడ్డారు.. తమ జీవితాలకు వెలుగు వస్తుందని ఆశపడ్డారు.. చివరకు వారి ఆశలు అడియాశలుగానే మిగిలాయి.. పాదయాత్ర చేసి ఏడేళ్లు, పదవిలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయినా ఇప్పటివరకు వారికి ఇచ్చిన హామీలు పట్టించుకున్న పాపాన పోలేదు.. ఉద్యోగ భద్రత అటుంచితే తమను ఉంచుతారో లేదో అన్న అనుమానం వారిలో కలుగుతోంది.
చంద్రబాబు పథకమనే నిర్లక్ష్యం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు సకాలంలో వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గోపాలమిత్ర పథకాన్ని తెచ్చారు. గత ఎన్నికలకు ముందు రూ.3 వేలు ఇస్తున్న వేతనాన్ని.. చంద్రబాబు రూ.6,500కు పెంచారు. ఆ సమయంలో గోపాలమిత్రల సంఘం నాయకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే వీరికి నేడు సీఎం జగన్ అన్యాయం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్యోగ భద్రత ఏదీ..?
గత ఇరవై ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పాడి సంతతి పెపొందించేందుకు ఎంతో కోసం కష్టపడి పనిచేస్తున్నాం. ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆ హామీ ఇంతవరకు నేరవేరలేదు. కనీసం వేతనాలు పెంచుతారని ఆశిస్తే అందులోనూ నిరాశే ఎదురైంది.
చంద్రబాబు పుత్తూరు
ఉపాధికి గండికోట్టారు
తమకు కనీసం వేతనం కింద రూ.15 వేలు ఇవ్వాలి. తాము అధికారంలోకి వస్తే గోపాలమిత్రలను క్రమబద్ధీకరి స్తామని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి ఐదేళ్లు పూర్తయి మళ్లీ ఎన్నికలు వస్తున్నా ఇప్పటివరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తమకు 20 ఏళ్లు అనుభవం ఉన్నా.. తమను కాదని సచివాలయాల్లో డిప్లొమో చేసిన వారిని వీహెచ్ఏలుగా నియమించడంతో తమ ఉపాధికి గండి పడింది. దీంతో మా కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడింది.
జయరామిరెడ్డి, తిమ్మాపురం
పట్టించుకోకపోవడం దారుణం..
పాదయాత్రలో ఓట్లకోసం మాట ఇచ్చి తరవాత తమ సమస్యలు పట్టించుకోలేదు. కనీసం మా విజ్ఞప్తిని పరిశీలించలేదు. మా నాయకులను కలిసేందుకు వెళ్లినా వారు సైతం సమయం ఇవ్వకుండా దాటవేశారు. వేతనం పెంచడం మాట అటుంచితే ఉద్యోగ భద్రతపై ఆశలు ఉండటం లేదు.
గోపాలమిత్రలు, పెనుమూరు మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కళ్లు మూసుకున్నారా ఐదేళ్లు..
[ 04-05-2024]
‘రాజకీయ నాయకుడికి విలువలు, విశ్వసనీయత ఉండాలి. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేయాలి.’ -
ఈ పాపం నీదే జగన్..
[ 04-05-2024]
మండు టెండలో రెండో రోజూ వృద్ధులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా తన స్వార్థ ప్రయోజనం కోసం వేదనకు గురిచేశారు. -
నగరిలో సైకిల్ జోరు..
[ 04-05-2024]
నగరిలో మంత్రి రోజాను వ్యతిరేకిస్తూ అసమ్మతి నాయకులు ఇన్నాళ్లు గళం విప్పుతూ వచ్చారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా అధిష్ఠానం ఇచ్చింది. -
జగనే సర్పంచులకు గండం
[ 04-05-2024]
దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు వైకాపా ప్రభుత్వం పంచాయతీ నిధులనూ వదల్లేదు.. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కన్న కలలను సీఎం జగన్ కల్లోలం చేశారు.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మార్చారు. -
మా బతుకులు రోడ్డున వేశావ్.. జగన్!
[ 04-05-2024]
కష్టాన్ని నమ్ముకున్న బడుగు జీవులు వైకాపా పాలనలో ఇసుక కొరతతో నానా అవస్థలు పడ్డారు. చేద్దామంటే పనుల్లేక.. తిందామంటే తిండిలేక.. ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేద్దామంటే పనుల్లేక.. పెరిగిన నిత్యావసరాల ధరలు భవన నిర్మాణ రంగ కార్మికులకు పూట గడవని పరిస్థితులు దాపురించాయి. -
మేనమామ.. క్రీడలపై సవతి ప్రేమ..!
[ 04-05-2024]
బటన్ నొక్కి పిల్లలకు మేనమామలా సంక్షేమం ఇచ్చానని చెప్పిన సీఎం జగన్. క్రీడాకారులపై మాత్రం సవతి ప్రేమ చాటారని క్రీడా లోకం మండిపడిపోతోంది. కమర్షియల్ క్రీడల్లో సాధనకు రుసుమల్ని పెంచి.. పేద ఆటగాళ్లను ఆటలకు దూరం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. -
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
[ 04-05-2024]
మంత్రి రోజా ప్రచారాన్ని వడమాలపేట మండలం వేమాపురం గ్రామస్థులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. పూడి పంచాయతీలోని వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారం నిర్వహించడానికి ప్రచారం రథంలో వచ్చారు. -
చిత్తూరును స్మార్ట్సిటీని చేస్తా
[ 04-05-2024]
పేదలకు అండగా నిలవడం నాకు ఇష్టం.. జిల్లా కేంద్రమైనా చిత్తూరులో అభివృద్ధి జాడేలేదు.. యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై సహా విదేశాలకు వెళ్తున్నారు.. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో రాజకీయాల్లోకి రాక ముందే జీజేఎం ట్రస్టు ద్వారా ప్రజాసేవకు శ్రీకారం చుట్టా.. -
భవనదీయుడి కోసం
[ 04-05-2024]
నంది కూడలిలో ఉన్న ఈ అత్యాధునిక భవనం నగరపాలక సంస్థకు చెందినది. తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ నిధులు రూ.2 కోట్లు వెచ్చించి తిరుమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం నిర్మించారు. -
వృద్ధులమని తెలుసు.. ఇంటికివ్వలేని మనసు
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వ చర్యలతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయట ఎండకు, బ్యాంకుల్లో ఉక్కపోతతో అల్లాడిపోయారు. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. -
బారుకు వెళ్తేనే బీరు
[ 04-05-2024]
ఎండాకాలంలో బీర్లకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. మండుటెండలో ప్రభుత్వ మద్యం దుకాణాలు తిరిగినా బీరు దొరక్క బార్ల మెట్లెక్కాల్సి వస్తోంది. రూ.350 - రూ.410 వరకు చెల్లించి బీర్లు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘తాపీ’గా లేం జగన్!
[ 04-05-2024]
వైకాపా సర్కార్ తెచ్చిన ఇసుక విధానం, సామగ్రి ధరల పెరుగుదల కూలీలకు శాపంగా మారింది. అరకొర పనులు, అప్పుల బాధలు, సమస్యలు భరించలేక కార్మికులు బలవన్మరణాలకు దారితీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!