logo

‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’

వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్‌ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్‌ మార్తాళ్‌ భర్త శివకుమార్‌ కన్నీటి పర్యంతమయ్యారు.

Published : 24 Apr 2024 03:29 IST

మెడలో ప్లకార్డుతో వైకాపా నాయకులు శివకుమార్‌

చిత్తూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్‌ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్‌ మార్తాళ్‌ భర్త శివకుమార్‌ కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆస్తుల్ని అమ్ముకుని, పార్టీని గెలిపించేందుకు, బలోపేతానికి పని చేశానని చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తొలినుంచి కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు అధిష్ఠానం తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. పార్టీ ఆదుకోకుంటే మే ఒకటో తేదీ నుంచి నగరంలో భిక్షాటన చేస్తానని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని