బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు.
నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు
కుప్పంలో పట్టించుకోని ఎన్నికల యంత్రాంగం
చంద్రబాబు వేసిన శిలాఫలకం ఇలా..
అనిమిగానిపల్లి వద్ద సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేసిన శిలాఫలకం ఇలా...
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. విపక్షాలైతే.. అందులో తెదేపా నాయకులైతే.. ఎక్కడ అధికార నాయకుల ఆగ్రహానికి బలి అవుతామేమోననే భయంతో నిబంధనలు పక్కాగా అమలు చేయడమే కాగా.. ఓ అడుగు ముందుకేసి లేని నిబంధనలు సైతం అమలు చేస్తారు. ఇదీ కుప్పంలో ప్రస్తుతం కనిపిస్తున్న తీరు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని ఇలాంటి వాటిని సరిదిద్దాల్సిన జిల్లా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
న్యూస్టుడే, కుప్పం గ్రామీణ, కుప్పం పట్టణం
ట్యాంకులు.. బ్యానర్లు.. శిలాఫలకాలు..: పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం అధికారపార్టీ నాయకుల జపం చేస్తోంది. మంచినీటి ట్యాంకులు, సచివాలయాలు, నీటి సరఫరా ట్రాక్టర్లు, శిలాఫలకాలు, పార్టీ జెండా స్తూపాలకు ఇలా అన్నింటికి పార్టీ రంగులు, చిత్రాలు కనిపించకుండా చేయాల్సి ఉన్నా.. యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. నియమావళి అమల్లోకి వచ్చి నెల రోజులు దాటినా కుప్పంలో ఈ ఉల్లంఘనలు కనిపిస్తూనే ఉన్నాయి. అదే తెదేపాకు చెందినవి అయితే పట్టుబట్టి.. వెంటబడి మరి నిబంధనలే అమలు చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో విమర్శలు వస్తున్నా.. ఉన్నతాధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
కథనం వచ్చిన తర్వాత హడావుడి.. ఎన్నికల్లో గెలుపు కోసం యత్నించే అని పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. ఇదీ ఎన్నికల సంఘం ప్రాథమిక విధి. అయితే స్థానిక అధికారులు, పోలీసు యంత్రాంగాలు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తూ కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతికల్లో కథనాలు వచ్చిన తర్వాత నింపాదిగా స్పందిస్తున్నారు. కుప్పం మండలం నాయనూరు పంచాయతీ పెద్దవంక గ్రామంలోని వైకాపాకు చెందిన ఫ్యానుతో కూడిన స్తంభం, పక్కనే శుద్ధజలం ట్యాంకుపై సీఎం చిత్రాలు కనిపిస్తున్నాయి. దీనిపై కథనం ప్రచురితమైంది.
పట్టణంలోని అన్న క్యాంటీన్లో ఈనెల 20 భువనేశ్వరి పర్యటన సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. అక్కడ దాతలు రాజకీయ నాయకుల చిత్రాలు, పేర్లు లేకుండా బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనిపై ఏఈఆర్వో నాగేశ్వరరావు తొలగించాలని హుకుం జారీ చేశారు. అక్కడికి కూతవేటు దూరంలో వైకాపా ప్రధాన నాయకుల చిత్రాలతో బ్యానర్ ఉన్నా వారికి చెప్పే ధైర్యం చేయలేకపోయారు. కథనం ప్రచురితం కావడంతో.. వైకాపా నాయకులను చరవాణిలో బతిమిలాడి, నచ్చజెప్పి తొలగించేలా చేశారనే విమర్శలు వచ్చాయి. ః రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో జగనన్న భూరక్ష పేరుతో రాళ్లు నాటారు. ఇవన్నీ ఆ పేర్లతో ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ రాళ్లకు జగనన్న పేర్లు కనిపించకుండా పెయింటింగ్ చేయించాలని జిల్లా అధికారులు ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు ఒకటి.. రెండు రాళ్లకు రంగు లేసి చేతులెత్తేశారు.
నామినేషన్ల దాఖలులోనూ.. ఈనెల 19న చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామపత్రాలు దాఖలు చేశారు. ఆ సందర్భంగా ఆర్వో కార్యాలయానికి ర్యాలీగా వచ్చిన ఆమె వంద మీటర్లకు ముందే కార్లు నిలిపేశారు. నడచి వెళ్లాల్సిందేనని పోలీసులు చెప్పడంతో ఆమె నడిచే వెళ్లి నామపత్రాలు అందజేసి వచ్చారు. అయితే సోమవారం వైకాపా అభ్యర్థి భరత్ తరఫున ఆయన సతీమణి దుర్గ నామపత్రాల దాఖలుకు వచ్చారు. ఆమెకు పోలీసులు సలాం చేస్తూ కార్లను నేరుగా కార్యాలయం లోపలికి అనుమతిచ్చారు. అంతే కాకుండా నిబంధనలకు విరుద్దంగా అధికం లోపల కూర్చోబెట్టి నామపత్రాలు ఓ విశ్రాంత అధికారి సాయం పరిశీలన చేసి ఆ తర్వాత దాఖలు చేశారనే ఆరోపణలు వచ్చాయి
ఇదిగో ఉదాహరణ..
కుప్పం మండలం మల్లానూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం కోసం చంద్రబాబునాయుడు సీఎం హోదాలో వేసిన శిలాఫలకానికి అధికారులు ముసుగు ధరించారు. కుప్పం నుంచి మల్లానూరుకు వెళ్లే మార్గం పక్కనే అనిమిగానిపల్లి వద్ద ఓ వైకాపా నేతకు చెందిన రూఫింగ్ సొల్యూషన్స్ కంపెనీ పేరుతో సీఎం జగన్మోహన్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేసిన శిలాఫలకం అధికారులకు కనిపించలేదో... లేక వైకాపా జపం చేస్తున్నారో తెలియదు కాని ఆ శిలాఫలకానికి ముసుగు వేయకుండా అలాగే వదిలేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాల పెద్దిరెడ్డి, తాయిలాల చెవిరెడ్డి పని పట్టండి
[ 03-05-2024]
రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సైకోలా పట్టిపీడిస్తుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలను పాపాల పెద్దిరెడ్డి హింసిస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. -
ఎండల్లో ఏడి‘పింఛెను’
[ 03-05-2024]
చిత్తూరు నగరంలోని 8వ డివిజన్ వెంగళరావుకాలనీకి చెందిన వృద్ధుడు రాజారెడ్డి రెండ్రోజులుగా పింఛను కోసం స్థానిక సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. -
ఎంత పని చేశావు జగన్..!
[ 03-05-2024]
ప్రస్తుతం.. సీఎం జగన్.. నియోజకవర్గానికి ఒక స్కిల్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఆపై జిల్లాకు ఒక స్కిల్ కళాశాల మంజూరు చేసి మమ అనిపించారు. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి నగరాల్లో గతంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లనే స్కిల్ కళాశాలలుగా మార్పు చేసి నిర్వహిస్తున్నారు. -
అరాచకాలను కనిపెట్టేందుకు నిఘా
[ 03-05-2024]
పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా గురువారం పేర్కొన్నారు. -
తెదేపాపై కసి.. శీతల గిడ్డంగిని ఆపేసి
[ 03-05-2024]
పశ్చిమ ప్రాంతంలోని పలమనేరు మార్కెట్ కమిటీ రైతులకు వరం. ఉద్యాన పంటలతో పాటు కూరగాయలు, పూలు, వరి వేరుసెనగ, బంగాళాదుంప తదితర పంటలు పండిస్తారు. -
ఇదేనా జగన్ చి(చె)త్త శుద్ధి..!
[ 03-05-2024]
జగన్ సర్కారు నిర్లక్ష్యం పుణ్యమా.. అని జిల్లాలో స్వచ్ఛ సంకల్పం ఆచరణలో నీరుగారిపోయింది. స్వచ్ఛభారత్ నినాదంతో గ్రామాల్లో పారిశుద్ధ్యమే లక్ష్యంగా ప్రభుత్వం వెచ్చించిన రూ. కోట్ల నిధులకు ప్రయోజనం లేకుండా పోయింది. -
నయవంచక నాయకా...!
[ 03-05-2024]
నగరి మండలం తడుకుపేటలో 200 ఇళ్లను ఆప్షన్-3 కింద నిర్మిస్తున్నారు. కొన్ని ఇళ్ల పనులు పైకప్పు వరకు వచ్చాయి. ఆపై అవి అక్కడితో నిలిచిపోయాయి. -
లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా నేతలు
[ 03-05-2024]
చంద్రగిరి పర్యటనకు వచ్చిన తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సి.ఆర్.రాజన్, మాజీ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, రాష్ట్ర కార్యానిర్వాహక కార్యదర్శి గురజాల సందీప్ ఆధ్వర్యంలో పలువురు వైకాపా నాయకులు గురువారం తెదేపా కండువా కప్పుకొన్నారు. -
వాలంటీరు ప్రచారాన్ని అడ్డుకున్న తెదేపా
[ 03-05-2024]
ఓ మహిళా వాలంటీరు వైకాపా తరఫున చేస్తున్న ప్రచారాన్ని స్థానిక తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నాయకులు తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. -
వైకాపా నేతలకు స్లిప్పులు
[ 03-05-2024]
తిరుపతి 22వ డివిజన్ 266 పోలింగ్ కేంద్రం పరిధిలో బీఎల్వో గోపీకృష్ణ ఓటర్లకు స్లిప్లు పంపిణీ చేస్తూ.. ఓటరు సంతకంతోపాటు ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. -
ఇళ్లు కాదు.. అబద్ధాలు కళ్లకు కట్టారు
[ 03-05-2024]
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద గృహాలు మంజూరు చేసి.. ఒక్కో గృహానికి రూ.1.80 లక్షలు కేటాయించారు. ఆప్షన్-3 ఎంపిక చేసుకున్న వారికి ఇళ్లు కట్టించి ఇస్తామని గొప్పగా ప్రకటించారు సీఎం జగన్. -
‘జగన్ 30 స్థానాలకు పడిపోవడం ఖాయం’
[ 03-05-2024]
జగన్ పరిపాలనపై ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని, శాసనసభ ఎన్నికల్లో వైకాపా 30 స్థానాలకు పడిపోవడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ స్పష్టం చేశారు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం