వైకాపా నేతలకు స్లిప్పులు
తిరుపతి 22వ డివిజన్ 266 పోలింగ్ కేంద్రం పరిధిలో బీఎల్వో గోపీకృష్ణ ఓటర్లకు స్లిప్లు పంపిణీ చేస్తూ.. ఓటరు సంతకంతోపాటు ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు.
ఓటర్ల ఫోన్నంబర్ల సేకరణలో బీఎల్వోలు
ప్రలోభాలకు వ్యూహరచన
తిరుపతి (నగరపాలిక), న్యూస్టుడే: -తిరుపతి 22వ డివిజన్ 266 పోలింగ్ కేంద్రం పరిధిలో బీఎల్వో గోపీకృష్ణ ఓటర్లకు స్లిప్లు పంపిణీ చేస్తూ.. ఓటరు సంతకంతోపాటు ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. వీటిని ఎందుకు సేకరిస్తున్నారని డివిజన్ తెదేపా కార్యదర్శి విశ్వేశ్వర్, నాయకులు బాలయ్య, రామచంద్రారెడ్డి ప్రశ్నించడంతో బీఎల్వో అక్కడి నుంచి తప్పుకొన్నారు.
కొర్లగుంట మారుతీనగర్లో రెండురోజులుగా కొందరు యువకులు సచివాలయ ఉద్యోగులమంటూ ఇంటింటికి వెళ్లి ఓటరుకార్డుందా అని అడుగుతున్నారు. ఉంటే ఫోన్ నంబరు చెప్పమంటున్నారు. బ్యాంకు ఖాతాకు ఈ నంబరే ఇచ్చారా.. ఓటీపీ ఈ నంబరుకే వస్తుందా.. ఆధార్ అనుసంధాన మైందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మీరు సచివాలయ ఉద్యోగులు కాదు కదా అని కొందరు గుర్తించి ప్రశ్నిస్తే వైసీపీ అన్న చెప్పారంటూ జారుకుంటున్నారు.
తిరుపతి నియోజకవర్గంలో అధికార పార్టీ, ఓటర్లను వివిధ రూపాల్లో ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్న తీరు కళ్లముందు కనిపిస్తున్నా.. అనైతిక వ్యూహాలు రచిస్తున్నా ఎన్నికల అధికారులకు పట్టడం లేదనే ఆరోపణలున్నాయి. రిటర్నింగ్ అధికారిగా నగరపాలిక కమిషనర్ వ్యవహరించడంతోపాటు నగరపాలిక ఉద్యోగులే ఎక్కువగా ఎన్నికల విధుల్లో ఉండటంతో వైకాపా నేతల అడ్డదారి యత్నాలను అడ్డుకునే వారే కరవయ్యారు. వార్డు సచివాలయాల్లో నగరపాలిక ఉన్నతోద్యోగుల పర్య వేక్షణలో పనిచేస్తున్నవారే బీఎల్వోలు కావడంతో వైకాపా నేతలు వీరిని లొంగదీసుకొని.. ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారు. ఈ క్రమంలో తమ ఉద్యోగాలు ఊడతాయనే ఆందోళనలో వార్డు సచివాలయ ఉద్యోగులున్నారు.
వాస్తవానికి తిరుపతిలో దొంగ ఓట్ల నియంత్రణలో భాగంగా ఇంటిం టికి నేరుగా వెళ్లి అదే చిరునామాలో ఓటర్లు ఉంటే ఓటరు స్లిప్ ఇవ్వాలని, లేదంటే తిరిగి ప్పగించాలని సూచిం చారు. ఇలా దొంగ ఓటర్లను గుర్తించ వచ్చని అధికారులు భావిస్తున్నప్పటికీ బీఎల్వోలను తప్పుదోవ పట్టిస్తూ అధికార పార్టీ నేతలు ఓటరు స్లిప్ల పంపిణీ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములవుతుండటం తో దొంగ ఓటర్లకు అడ్డుపడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పర్యవేక్షకులు, పరిశీలకులు ఏరీ?
తిరుపతిలో ఎన్నికల సంఘా నికి సమాంతరంగా అధికార పార్టీ నేతలు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. రెండు, మూడు రోజు లుగా ఓటర్ల ఫోన్ నంబర్లు కొందరు ఇతర ప్రాంతాల వ్యక్తులు సేకరిస్తున్న విషయం విదితమే. ఈ వ్యవహారం ఎన్నికల అధికారుల దృష్టికెళ్లినా ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్న కు సమాధానం కరవైంది. కొం దరు స్వామిభక్తితో సహకరిస్తు న్నట్లు విమర్శలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు భరోసా.. సేవల్లో నిరాశ
[ 20-05-2024]
చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండదనే విషయం వైకాపా పాలన ప్రారంభంలోనే రైతులకు అర్థమైపోయింది.. ఆర్బీకేల ద్వారా సాగు సలహాలు, సేవలందకపోయినా అన్ని రకాల ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేకపోయినా.. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉత్పత్తుల రక్షణకు ముఖం చాటేసినా పంటి బిగువున భరించారు.. నష్టాలు చూడని రైతులు లేరు.. -
దూరవిద్య.. అనుమతులు అక్కర్లేదా?
[ 20-05-2024]
ఎస్వీయూకు ఉన్న 70 ఏళ్ల చరిత్ర ఆధారంగా దేశవ్యాప్తంగా.. ఎస్వీయూ దూరవిద్యా కేంద్రానికి ఉన్న గుర్తింపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ వర్సిటీకీ లేదు. ఎస్వీయూ పరిధిలో సాధారణ ప్రవేశాలతో పోల్చితే దూరవిద్యా కేంద్రం ప్రవేశాలు ఎక్కువగానే ఉంటాయి. -
ఇవేం పనులు రాజశేఖరా..?
[ 20-05-2024]
-
విచారణ తొక్కిపెట్టేసి..
[ 20-05-2024]
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త ఆదేశాలతో చేపట్టాల్సిన విచారణను ఆ కార్యాలయ పూర్వ అధికారి నిర్వాకంతో నెలలతరబడి నిలిచిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.. -
ఎర్రమట్టి కొల్లగొట్టి..కోట్లకు పడగలెత్తి
[ 20-05-2024]
ముఖ్యనాయకుడు.. ఇద్దరు అనుచరులు.. ఇక అడ్డేముంది.. కొండలు కరిగిపోయాయి. వందలాది టన్నుల ఎర్రమట్టి తరలిపోయింది.. ఆదాయంలో ముఖ్యనేతకు వాటా అందడంతో పూర్తి సహకారం అందించారు. ఇలా ఐదేళ్లలో ఆ ఇద్దరు నాయకులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. -
సీబీఎస్ఈ.. పాఠం బోధపడేనా?
[ 20-05-2024]
అ..ఆలు చదవలేని పరిస్థితి మన ప్రభుత్వ బడుల్లో నెలకొందని ఇటీవల ఆసర్ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం మాత్రం సీబీఎస్ఈ, ఐబీ, బైజూస్ కంటెంట్ అంటూ గందరగోళం చేస్తోంది. ప్రభుత్వ బడుల్లో గతేడాది సీబీఎస్ఈ పాఠాలు అమలుచేయగా ఈ ఏడాది పదిలో అమలు చేయాలని నిర్ణయించింది. -
ఆడపడుచు ఆరాధనకు వేళాయే..
[ 20-05-2024]
పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం.. దైవ స్వరూపాలు.. జలమంటే గంగమ్మ.. స్వచ్ఛత, నిర్మలత్వ స్వరూపం గంగా దేవి.. ప్రతి ఇంటి ఆడపడుచు గంగమ్మ తల్లి.. చైత్ర మాసంలో గంగమ్మను ఊరికి ఆహ్వానించి ఆరాధించే ఉత్సవమే గంగమ్మ జాతర.. -
కపిలతీర్థంపై కరుణ లేదా?
[ 20-05-2024]
తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలోని ప్రధాన క్షేత్రాల్లో కపిలతీర్థం ఆలయం ఒకటి. ఈ శైవ క్షేత్రాన్ని దర్శించేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తూపోతూ ఉంటారు. -
ఏడు గంటలపాటు.. సిట్ విచారణ
[ 20-05-2024]
చంద్రగిరి నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లెలో పోలింగ్ రోజున జరిగిన గొడవలు, ఎన్నికల అనంతరం శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని స్ట్రాంగ్రూమ్ వద్ద జరిగిన దాడుల ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఏర్పాటైన సిట్ బృందం ఆదివారం సుమారు ఏడుగంటలపాటు విచారణ చేపట్టింది. -
ముగిసిన శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
[ 20-05-2024]
శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. -
‘దళితుల మధ్య చిచ్చుపెట్టడం మంత్రి పెద్దిరెడ్డికి తగదు’
[ 20-05-2024]
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు పెట్టడం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తగదని మండల పరిధిలోని భీమునిచెరువు దళితవాడకు చెందిన సర్పంచి మురుగేశం, గ్రామంలోని యువకులు ఆరోపించారు. -
గమ్యం చేరేలోగా మృత్యుఒడికి..
[ 20-05-2024]
ఉద్యోగోన్నతిపై ఉత్తరాఖండ్ వెళ్తూ పెనుమూరు మండలం గుంటిపల్లె పంచాయతీ కనికాపురం గ్రామానికి(చిత్తూరు సమీప మురకంబట్టు) చెందిన సైనికుడు రైలు నుంచి జారిపడి మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!