logo

‘జగన్‌ 30 స్థానాలకు పడిపోవడం ఖాయం’

జగన్‌ పరిపాలనపై ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని, శాసనసభ ఎన్నికల్లో వైకాపా 30 స్థానాలకు పడిపోవడం ఖాయమని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చింతామోహన్‌ స్పష్టం చేశారు

Published : 03 May 2024 03:53 IST

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చింతామోహన్‌

తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: జగన్‌ పరిపాలనపై ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని, శాసనసభ ఎన్నికల్లో వైకాపా 30 స్థానాలకు పడిపోవడం ఖాయమని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చింతామోహన్‌ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జీవకోన, రాజీవ్‌గాంధీనగర్‌, ఎమ్మార్‌పల్లి, అన్నమయ్య కూడలి, శ్రీకృష్ణదేవరాయల కూడలి, పాత నగరపాలిక కార్యాలయం, గాంధీరోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచ పాండవులకు, కౌర సైనికులకు యుద్ధం మొదలైందన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. భాజపాకు వంద సీట్లకంటే తక్కువే వస్తాయన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు యార్లపల్లి గోపిగౌడ్‌, వెంకటేష్‌గౌడ్‌, జావెద్‌, మునిశోభా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని