‘జగన్ 30 స్థానాలకు పడిపోవడం ఖాయం’
జగన్ పరిపాలనపై ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని, శాసనసభ ఎన్నికల్లో వైకాపా 30 స్థానాలకు పడిపోవడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ స్పష్టం చేశారు
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్
తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్టుడే: జగన్ పరిపాలనపై ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని, శాసనసభ ఎన్నికల్లో వైకాపా 30 స్థానాలకు పడిపోవడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జీవకోన, రాజీవ్గాంధీనగర్, ఎమ్మార్పల్లి, అన్నమయ్య కూడలి, శ్రీకృష్ణదేవరాయల కూడలి, పాత నగరపాలిక కార్యాలయం, గాంధీరోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచ పాండవులకు, కౌర సైనికులకు యుద్ధం మొదలైందన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. భాజపాకు వంద సీట్లకంటే తక్కువే వస్తాయన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు యార్లపల్లి గోపిగౌడ్, వెంకటేష్గౌడ్, జావెద్, మునిశోభా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోషులను తప్పించి... అమాయకులను ఇరికించి..!
[ 21-05-2024]
వైకాపాకు అంటకాగిన పోలీసు ఉన్నత అధికారుల నుంచి కింది స్థాయి వరకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే డీఐజీ స్థాయి నుంచి ఎస్సై స్థాయి అధికారులపై వేటు వేసింది. ఇలా ఓ వైపు ఎన్నికల సంఘం కొరఢా ఝళిపిస్తున్నా.. జిల్లాలోని పలుచోట్ల క్షేత్ర స్థాయిలో మార్పు కనిపించడం లేదు. -
వైకాపాకుకొమ్ము కాశారు..!
[ 21-05-2024]
పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని.. వైకాపా నేతలకు కొమ్ము కాస్తున్న ఆరోపణలకు అధికారుల తీరు బలాన్ని చేకూర్చినట్లు ఉందని సిట్ అధికారులు రూపొందించిన నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. -
అధికారం అండ.. గ్రా‘నైట్’ దందా
[ 21-05-2024]
రాజకీయంగా పలుకుబడి.. అధికారం అండ ఉంటే చాలు.. ఎంతటి అక్రమాన్ని అయినా.. సక్రమమేనని ప్రజలను నమ్మించవచ్చన్న అక్రమార్కులు గ్రానైట్ దందాను దర్జాగా సాగిస్తున్నారు. -
ఇసుక అక్రమాలు ఆపమంతే!
[ 21-05-2024]
ఐదేళ్లుగా అధికార పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితంగా ఉన్న సంస్థలు ఇసుకను యథేచ్ఛగా బొక్కేశాయి. -
గంగమ్మ చెంతనేతల వేషాలు ముగిసినట్లేనా?
[ 21-05-2024]
తిరుపతి తాతయ్యగుంట జాతర గురించి రాయలసీమ వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
అభ్యర్థుల నోటా.. ఆందోళన మాట
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 జిల్లాలో హోరాహోరీగా జరిగాయి. పోలింగ్ శాతమూ బాగా పెరిగింది. -
విలీన పాపం.. విద్యార్థులకు శాపం
[ 21-05-2024]
పాఠశాలల్లో బడి మానేస్తున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. బడులు విలీన నేపథ్యంలో మరింత ఎక్కువ మంది బడులకు దూరంగానే ఉన్నారు. -
‘అధికార’ ఒప్పందం.. అడ్డగోలు నియామకం
[ 21-05-2024]
రాహు, కేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఒప్పంద ఉద్యోగుల అతిచేష్టలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. -
జననీ.. పావనీ.. పాహిమాం
[ 21-05-2024]
జగజ్జననీ.. లోకనాయకి.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన గంగమ్మ జాతర వేడుకలకు చిత్తూరు నగరం సర్వసన్నద్ధమైంది. -
వైభవంగా అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం
[ 21-05-2024]
కుప్పం గ్రామదేవత శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో భాగంగా సోమవారం రాత్రి శ్రీప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. -
ఇసుక అక్రమంగా తరలిస్తుంటే ఏం చేస్తున్నారు?
[ 21-05-2024]
మండల పరిధి ఓ.జి.కుప్పం వద్ద కుశస్థలి నదిలో ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా హెచ్చరిక బోర్డులు పెట్టాలని, దండోరా వేయించాలని జేసీ పి.శ్రీనివాసులు ఆదేశించారు. -
చక్కెర, గోధుమపిండి అరకొరగా..
[ 21-05-2024]
ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఇంటి వద్దకే బియ్యం పంపిణీ ఆర్భాటాలే తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులున్నాయి. -
తల తీసేస్తా..!
[ 21-05-2024]
శ్రీకాళహస్తీశ్వరాలయంలో విధి నిర్వహణలో ఉన్న హోంగార్డును తల తీసేస్తానంటూ ఒప్పంద ఉద్యోగి బెదిరించడం చర్చనీయాంశంగా మారింది.