వైఎస్ఆర్ బీమా.. జగన్ డ్రామా
సీఎం జగన్ వైఎస్ఆర్ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు.
రెండేళ్లుగా అందని సాయం
ఎదురుచూపుల్లో దరఖాస్తుదారులు
న్యూస్టుడే, పుత్తూరు, పెనుమూరు, పూతలపట్టు: సీఎం జగన్ వైఎస్ఆర్ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. అయితే గత రెండేళ్లుగా బీమా సాయం ఇవ్వడం లేదు. ఈ సాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. ఈలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇక సాయంపై బాధితులు ఆశలు వదులుకుంటున్నారు. అసలు తమకు ఈ సాయం ఎప్పటికి అందేనో అని ఆందోళన వ్యక్తం చస్తున్నారు.
- పుత్తూరు మున్సిపాలిటీలోని మేదరవీధికి చెందిన చెంచయ్య రోడ్డు ప్రమాదంలో ఏడాదిన్నర క్రితం మృతి చెందాడు. అయితే ఇప్పటివరకు అతడికి వైఎస్ఆర్ బీమా కింద సాయం అందలేదు. అదే తెదేపా హయాంలో మృతి చెందిన వెంటనే దహన క్రియల కోసం రూ.10వేలు సాయం అందించేవారు. అనంతరం పూర్తి స్థాయిలో క్లెయిమ్ అందించేవారు. ప్రస్తుతం వేచి చూడాల్సిన పరిస్థితి.
- వెదురుకుప్పం మండలం కురివికుప్పం గ్రామానికి మంగయ్య తిరుపతికి వస్తూ ప్రమాదవశాత్తూ ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు. అతడు కూలికెళ్తే తప్ప జీవనం సాగదు. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఇప్పటివరకు వైఎస్ఆర్ బీమా అందించకపోవడం గమనార్హం.
ఏడాదిగా నిరీక్షిస్తున్నాం..
నా భర్త మురుగేష్ గతేడాది అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన వయస్సు 48 సంవత్సరాలు. వై.ఎస్.ఆర్ బీమా కోసం సచివాలయ సిబ్బంది ద్వారా దరఖాస్తు చేసుకున్నాం. రూ.లక్ష వస్తుందని చెప్పారు. అదిగోఇదిగో అంటున్నారే తప్ప తమకు బీమా మొత్తం అందలేదు. నిరీక్షణ తప్ప ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో కచ్చితంగా చెప్పేవారు లేరు.
కృష్ణమ్మ, జీడీనెల్లూరు
దరఖాస్తు తిరస్కరించారు..
మా అమ్మ రాజేశ్వరి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె వై.యస్.ఆర్ బీమా పథకంలో సభ్యత్వం ఉంది. ఆమె మరణానంతరం బీమాకు దరఖాస్తు చేసుకున్నాం. కొద్దిరోజుల తరవాత సచివాలయంలో ఆరా తీస్తే దరఖాస్తు తిరస్కరించారని, డెత్ సర్టిఫికెట్, ఇతర ధ్రువపత్రాలు సరిగ్గా లేవని చెప్పారు. మళ్లీ కొత్తగా ధ్రువపత్రాలు తీసుకుని దరఖాస్తు చేసుకున్నాం. అయినా తిరస్కరణకు గురైనట్లు తెలియడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం.
ఆశ, పలమనేరు
బాధితులకు సాయం ఏదీ..
మిట్టపల్లూరు గ్రామం నుంచి పుత్తూరుకు వెళ్లే సమయంలో ప్రమాదం జరిగింది. తల, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్ఆర్ బీమా ప్రీమియం చెల్లించాం. అయినా తనకు ఇప్పటివరకు బీమా సాయం అందించలేదు. తెదేపా హయాంలో రోజుల వ్యవధిలోనే చంద్రన్న బీమా అందించేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ బీమా ఇవ్వడం లేదు.
కార్తిక్, మిట్టపల్లూరు, పుత్తూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాల పెద్దిరెడ్డి, తాయిలాల చెవిరెడ్డి పని పట్టండి
[ 03-05-2024]
రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సైకోలా పట్టిపీడిస్తుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలను పాపాల పెద్దిరెడ్డి హింసిస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. -
ఎండల్లో ఏడి‘పింఛెను’
[ 03-05-2024]
చిత్తూరు నగరంలోని 8వ డివిజన్ వెంగళరావుకాలనీకి చెందిన వృద్ధుడు రాజారెడ్డి రెండ్రోజులుగా పింఛను కోసం స్థానిక సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. -
ఎంత పని చేశావు జగన్..!
[ 03-05-2024]
ప్రస్తుతం.. సీఎం జగన్.. నియోజకవర్గానికి ఒక స్కిల్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఆపై జిల్లాకు ఒక స్కిల్ కళాశాల మంజూరు చేసి మమ అనిపించారు. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి నగరాల్లో గతంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లనే స్కిల్ కళాశాలలుగా మార్పు చేసి నిర్వహిస్తున్నారు. -
అరాచకాలను కనిపెట్టేందుకు నిఘా
[ 03-05-2024]
పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా గురువారం పేర్కొన్నారు. -
తెదేపాపై కసి.. శీతల గిడ్డంగిని ఆపేసి
[ 03-05-2024]
పశ్చిమ ప్రాంతంలోని పలమనేరు మార్కెట్ కమిటీ రైతులకు వరం. ఉద్యాన పంటలతో పాటు కూరగాయలు, పూలు, వరి వేరుసెనగ, బంగాళాదుంప తదితర పంటలు పండిస్తారు. -
ఇదేనా జగన్ చి(చె)త్త శుద్ధి..!
[ 03-05-2024]
జగన్ సర్కారు నిర్లక్ష్యం పుణ్యమా.. అని జిల్లాలో స్వచ్ఛ సంకల్పం ఆచరణలో నీరుగారిపోయింది. స్వచ్ఛభారత్ నినాదంతో గ్రామాల్లో పారిశుద్ధ్యమే లక్ష్యంగా ప్రభుత్వం వెచ్చించిన రూ. కోట్ల నిధులకు ప్రయోజనం లేకుండా పోయింది. -
నయవంచక నాయకా...!
[ 03-05-2024]
నగరి మండలం తడుకుపేటలో 200 ఇళ్లను ఆప్షన్-3 కింద నిర్మిస్తున్నారు. కొన్ని ఇళ్ల పనులు పైకప్పు వరకు వచ్చాయి. ఆపై అవి అక్కడితో నిలిచిపోయాయి. -
లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా నేతలు
[ 03-05-2024]
చంద్రగిరి పర్యటనకు వచ్చిన తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సి.ఆర్.రాజన్, మాజీ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, రాష్ట్ర కార్యానిర్వాహక కార్యదర్శి గురజాల సందీప్ ఆధ్వర్యంలో పలువురు వైకాపా నాయకులు గురువారం తెదేపా కండువా కప్పుకొన్నారు. -
వాలంటీరు ప్రచారాన్ని అడ్డుకున్న తెదేపా
[ 03-05-2024]
ఓ మహిళా వాలంటీరు వైకాపా తరఫున చేస్తున్న ప్రచారాన్ని స్థానిక తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నాయకులు తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. -
వైకాపా నేతలకు స్లిప్పులు
[ 03-05-2024]
తిరుపతి 22వ డివిజన్ 266 పోలింగ్ కేంద్రం పరిధిలో బీఎల్వో గోపీకృష్ణ ఓటర్లకు స్లిప్లు పంపిణీ చేస్తూ.. ఓటరు సంతకంతోపాటు ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. -
ఇళ్లు కాదు.. అబద్ధాలు కళ్లకు కట్టారు
[ 03-05-2024]
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద గృహాలు మంజూరు చేసి.. ఒక్కో గృహానికి రూ.1.80 లక్షలు కేటాయించారు. ఆప్షన్-3 ఎంపిక చేసుకున్న వారికి ఇళ్లు కట్టించి ఇస్తామని గొప్పగా ప్రకటించారు సీఎం జగన్. -
‘జగన్ 30 స్థానాలకు పడిపోవడం ఖాయం’
[ 03-05-2024]
జగన్ పరిపాలనపై ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని, శాసనసభ ఎన్నికల్లో వైకాపా 30 స్థానాలకు పడిపోవడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ స్పష్టం చేశారు
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు