logo

‘నగరిలో రోజాను ఓడించండి’

నగరిలో రోజాను ఓడించాలని.. ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి రాకేష్‌రెడ్డిని గెలిపించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. పుత్తూరు అంబేడ్కర్‌ భవనంలో బుధవారం సీఐటీయూ సమావేశం జరిగింది.

Published : 25 Apr 2024 03:23 IST

మాట్లాడుతున్న కందారపు మురళి

పుత్తూరు: నగరిలో రోజాను ఓడించాలని.. ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి రాకేష్‌రెడ్డిని గెలిపించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. పుత్తూరు అంబేడ్కర్‌ భవనంలో బుధవారం సీఐటీయూ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఐదేళ్లలో అభివృద్ధి శూన్యమన్నారు. అవినీతి, అరాచకం పెరిగిపోయాయని, సీఐటీయూ జిల్లా నాయకులు వాడ గంగరాజు, జిల్లా కార్యదర్శి వెంకటేష్‌, నాయకులు కేఆర్‌ సుబ్రమణ్యం పిళ్లై, పురుషోత్తం, భాస్కర్‌, యాసిన్‌ భాషా, ధనంజయులు, బాబు, సతీష్‌, సురేష్‌ పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకుందాం

చిత్తూరు జడ్పీ: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ను తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా ఐకాస ఛైర్మన్‌ రాఘవులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫారం 12ని శుక్రవారంలోగా సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని