జగన్ బీ‘మాయ’
ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది.
వచ్చీరాగానే కోతలు.. ఒకరికే అంటూ పరిమితులు
అరకొర పరిహారం సైతం అందించలేక చతికలు
రెండేళ్లలో వేల కుటుంబాలకు ఎగనామం
ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది. పథకానికి అర్హత సాధించలేక.. పరిహారం అందక వేల కుటుంబాలు కకావికలమయ్యాయి. బకాయిలు ఎంతకూ చెల్లించకపోవడం.. వేలల్లో ఉన్న క్లెయిమ్ల సంఖ్య వందల్లోకి పడిపోవడం జగనన్న ఎత్తుగడల్లో భాగమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా బాధిత కుటుంబాలు మరింత అఘాతంలోకి కూరుకుపోతున్నాయి.
న్యూస్టుడే, చిత్తూరు(జిల్లా పంచాయతీ), పూతలపట్టు
కన్నీటి నివేదన..
తన భర్త నాలుగేళ్ల కిందట ప్రమాదంలో గాయపడి చనిపోయారు.. అయినా వైకాపా ప్రభుత్వం తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని, ఇప్పటివరకు బీమా సొమ్ము రాలేదని గూడూరు ప్రాంతానికి చెందిన షాబీరా.. ఇటీవల చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మహిళలతో నిర్వహించిన సమావేశం సందర్భంగా కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్త చనిపోయి మూడేళ్లవుతున్నా ప్రభుత్వం నుంచి సాయం అందలేదని ఇదే కార్యక్రమంలో మణెమ్మ అనే మరో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
- పూతలపట్టు మండలానికి చెందిన క్రిష్ణయ్య(49) కిడ్నీ వ్యాధితో రెండేళ్ల క్రితం మృతి చెందాడు. వైఎస్సార్ బీమా పథకంలో సభ్యుడు. దరఖాస్తు చేసుకుని ఏడాదిన్నరైనా ఇప్పటివరకు బీమా మంజూరు కాలేదు.
- పలమనేరులోని పార్వతమ్మ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వైఎస్సార్ బీమా మంజూరు కోసం ఆమె కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేసిన ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా లేవని తిరస్కరించారు. ఈ బీమా ఆదుకుంటుందని ధీమాగా ఉన్నవారికి చివరకు నిరాశే మిగిలింది.
బియ్యం కార్డులు తెచ్చి.. కోతలు పెంచి
వైకాపా కొత్తగా తీసుకొచ్చిన బియ్యం కార్డులు జిల్లాలో 5,32,407 కార్డులకుగాను 66,654 కుటుంబాలకు బీమా అర్హత లేకుండా చేశారు. తిరుపతి జిల్లా గూడూరు మండలంలో 10,123 బియ్యం కార్డులుంటే ఇక్కడ 1,157 కార్డుదారులకు అర్హత లేదని తేల్చారు.
- జిల్లాలోని ఓ మహిళ భర్త చనిపోగా ఆమెకు బీమా నిధులు రాలేదు. ముగ్గురు ఆడపిల్లలతో ఆమె జీవనం సాగించాల్సిన పరిస్థితి. ఆదుకోండని ప్రభుత్వ అధికారుల చుట్టూ అనేకమార్లు తిరిగినా నిధులు రాకుంటే తాము చేసేది ఏమీలేదని చేతులెత్తేస్తున్నారు. కుటుంబ పోషణ కోసం కూలీలుగా మారుతున్నారు. పస్తులుండి జీవనం సాగిస్తున్నారు.
తెదేపా సానుభూతిపరుడని..
బంగారుపాళ్యానికి చెందిన కస్తూరి(47) వైఎస్సార్ బీమా పథకంలో ప్రీమియం చెల్లించి మూడేళ్ల క్రితం సభ్యత్వం తీసుకుంది. ఆమె అనారోగ్యంతో ఏడాదిన్నర క్రితం మరణించింది. నామినీగా ఆమె కుమారుడు ప్రశాంత్ నమోదై ఉన్నాడు. సచివాలయ సిబ్బంది ద్వారా బీమా మంజూరుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఎలాంటి అతీగతీ లేదు. రూ.లక్ష ఎప్పుడు మంజూరవుతుందని సచివాలయ సిబ్బందిని బాధిత కుటుంబ సభ్యులు అడిగితే తమకూ తెలియదని, వస్తే మీ ఖాతాకే జమవుతుందని దాటవేత ధోరణితో సమాధానం చెబుతున్నారని ప్రశాంత్ కుటుంబ సభ్యులు వాపోయారు.
- రెండేళ్లు ఆలస్యం చేసి 2021 జులై నుంచి జగనన్న బీమా పథకం అమలు చేయగా కుటుంబంలో ఒకరికే బీమా చేసే అవకాశం కల్పించి కోతలు విధించారు. 2022-23లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2,115 మంది మరణించగా 850 మందికి మాత్రమే పరిహారం అందించింది.
- రహదారుల దుస్థితి వల్లనో మరేతర కారణాలతోనో నిరుపేదలు అనేకమంది ప్రమాదాల్లో గాయపడటంతోపాటు మరణిస్తున్నారు. అటువంటి కుటుంబాలకు బీమా సొమ్మును చెల్లించి వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం పరిహారం సొమ్ము సకాలంలో చెల్లించకుండా వారి ఉసురు పోసుకుంటోంది. చివరకు అన్ని అర్హతలున్నా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు.
- వైఎస్ఆర్ బీమా పథకం కింద సహజ మరణం కింద రూ.లక్ష, ప్రమాదవశాత్తు మరణించినా, పూర్తిగా వైకల్యం చెందినా రూ.5 లక్షలు చెల్లించాలి. బీమా క్లెయిమ్ చేసిన 15 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం సొమ్మును నేరుగా బీపీఎల్ కుటుంబానికి జమ చేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
[ 04-05-2024]
మంత్రి రోజా ప్రచారాన్ని వడమాలపేట మండలం వేమాపురం గ్రామస్థులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. పూడి పంచాయతీలోని వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారం నిర్వహించడానికి ప్రచారం రథంలో వచ్చారు. -
కళ్లు మూసుకున్నారా ఐదేళ్లు..
[ 04-05-2024]
‘రాజకీయ నాయకుడికి విలువలు, విశ్వసనీయత ఉండాలి. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేయాలి.’ -
ఈ పాపం నీదే జగన్..
[ 04-05-2024]
మండు టెండలో రెండో రోజూ వృద్ధులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా తన స్వార్థ ప్రయోజనం కోసం వేదనకు గురిచేశారు. -
నగరిలో సైకిల్ జోరు..
[ 04-05-2024]
నగరిలో మంత్రి రోజాను వ్యతిరేకిస్తూ అసమ్మతి నాయకులు ఇన్నాళ్లు గళం విప్పుతూ వచ్చారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా అధిష్ఠానం ఇచ్చింది. -
జగనే సర్పంచులకు గండం
[ 04-05-2024]
దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు వైకాపా ప్రభుత్వం పంచాయతీ నిధులనూ వదల్లేదు.. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కన్న కలలను సీఎం జగన్ కల్లోలం చేశారు.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మార్చారు. -
మా బతుకులు రోడ్డున వేశావ్.. జగన్!
[ 04-05-2024]
కష్టాన్ని నమ్ముకున్న బడుగు జీవులు వైకాపా పాలనలో ఇసుక కొరతతో నానా అవస్థలు పడ్డారు. చేద్దామంటే పనుల్లేక.. తిందామంటే తిండిలేక.. ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేద్దామంటే పనుల్లేక.. పెరిగిన నిత్యావసరాల ధరలు భవన నిర్మాణ రంగ కార్మికులకు పూట గడవని పరిస్థితులు దాపురించాయి. -
మేనమామ.. క్రీడలపై సవతి ప్రేమ..!
[ 04-05-2024]
బటన్ నొక్కి పిల్లలకు మేనమామలా సంక్షేమం ఇచ్చానని చెప్పిన సీఎం జగన్. క్రీడాకారులపై మాత్రం సవతి ప్రేమ చాటారని క్రీడా లోకం మండిపడిపోతోంది. కమర్షియల్ క్రీడల్లో సాధనకు రుసుమల్ని పెంచి.. పేద ఆటగాళ్లను ఆటలకు దూరం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. -
చిత్తూరును స్మార్ట్సిటీని చేస్తా
[ 04-05-2024]
పేదలకు అండగా నిలవడం నాకు ఇష్టం.. జిల్లా కేంద్రమైనా చిత్తూరులో అభివృద్ధి జాడేలేదు.. యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై సహా విదేశాలకు వెళ్తున్నారు.. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో రాజకీయాల్లోకి రాక ముందే జీజేఎం ట్రస్టు ద్వారా ప్రజాసేవకు శ్రీకారం చుట్టా.. -
‘భవన’దీయుడి కోసం
[ 04-05-2024]
నంది కూడలిలో ఉన్న ఈ అత్యాధునిక భవనం నగరపాలక సంస్థకు చెందినది. తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ నిధులు రూ.2 కోట్లు వెచ్చించి తిరుమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం నిర్మించారు. -
వృద్ధులమని తెలుసు.. ఇంటికివ్వలేని మనసు
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వ చర్యలతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయట ఎండకు, బ్యాంకుల్లో ఉక్కపోతతో అల్లాడిపోయారు. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. -
బారుకు వెళ్తేనే బీరు
[ 04-05-2024]
ఎండాకాలంలో బీర్లకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. మండుటెండలో ప్రభుత్వ మద్యం దుకాణాలు తిరిగినా బీరు దొరక్క బార్ల మెట్లెక్కాల్సి వస్తోంది. రూ.350 - రూ.410 వరకు చెల్లించి బీర్లు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘తాపీ’గా లేం జగన్!
[ 04-05-2024]
వైకాపా సర్కార్ తెచ్చిన ఇసుక విధానం, సామగ్రి ధరల పెరుగుదల కూలీలకు శాపంగా మారింది. అరకొర పనులు, అప్పుల బాధలు, సమస్యలు భరించలేక కార్మికులు బలవన్మరణాలకు దారితీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!