అయ్యా.. ఐదేళ్లూ చాలలేదా..?
ఒక ప్రాంత అభివృద్ధికి రహదారులు, అద్భుతమైన కట్టడాలే కొలమానం. అలాంటిది చిత్తూరు నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు నానా కష్టాలు పడుతున్నారు.
ఒక్క రోడ్డేస్తే ఒట్టు
ప్రజలకు తప్పని అవస్థలు
నిద్రపోయిన వైకాపా సర్కార్
కోడిగుంట ఇందిరమ్మ కాలనీలో రోడ్డు దుస్థితి
న్యూస్టుడే, చిత్తూరు నగరం : ఒక ప్రాంత అభివృద్ధికి రహదారులు, అద్భుతమైన కట్టడాలే కొలమానం. అలాంటిది చిత్తూరు నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు నానా కష్టాలు పడుతున్నారు. తారు రోడ్ల మధ్య గుంతలు, కంకర లేచిన రహదారుల్లో ప్రయాణం వాహన చోదకులకు చుక్కలు చూపుతున్నాయి. ఉదయం రద్దీ ఎక్కువగా ఉన్నవేళ ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఇక రాత్రివేళ గుంతలు గమనించక ద్విచక్ర వాహనదారులు కిందపడిపోతున్నారు. అసలే ఇరుకుగా ఉండే రహదారులు అందులోనూ గుంతలమయమైన ఈ దారులు నగరవాసులకు పెద్ద సమస్యగా పరిణమించాయి. ఐదేళ్ల వైకాపా పాలనలో కొత్త రోడ్ల నిర్మాణం కాదు కదా. దెబ్బతిన్న పాత రోడ్లకు మరమ్మతులు చేయలేని దుస్థితి. పైప్లైన్ల కోసం గుంతలు తీసి మరమ్మతు చేపట్టకుండా వదిలేయడంతో ఇవి పెద్దదిగా మారి ప్రయాణించలేని దుస్థితి. జనసంచారం ఎక్కువగా ఉండే రోడ్లకు మరమ్మతులు చేపట్టలేని స్థితిలో నగరపాలక అధికారులు ఉన్నారు. టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు.
- మహావీర్ రైల్వే వంతెనపై రోడ్డు అధ్వానంగా ఉంది. పలుమార్లు నగరపాలక, ర.భ.శాఖలు మరమ్మతులు చేపట్టినా నాణ్యత లోపం కారణంగా చిన్నపాటి వర్షాలకే తారు లేచి గుంతలమయమైంది.
- ప్రశాంత్నగర్, వై.ఎస్., ఇందిరమ్మకాలనీల్లో రోడ్డు లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ఈ కాలనీల్లో రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. వర్షాలు పడితే బురదమయమే. రెండు వేలకు పైగా కుటుంబాలు ఉన్న ఈ కాలనీల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గడపగడపకు మన ప్రభుత్వంలో స్థానికులు పలుమార్లు ప్రజాప్రతినిధులకు స్థానికులు విన్నవించినా ఫలితం శూన్యమే.
- పంట్రాంపల్లె, మురుకంబట్టు జీకేనగర్, సంతపేట సమీపంలోని మంగసముద్రం, తిమ్మసముద్రం, సాంబయ్య కండిగ తదితర పేదలు నివసించే ఇందిరమ్మ కాలనీల్లో గుంతలమయమైన, కంకర తేలిన రోడ్లే. కాలువలు, వీధి దీపాలు లేవు.
రోడ్ల నిర్మాణం చేపట్టాలి..
నగరంలోని పలు వీధుల్లో మట్టిరోడ్లు ఉన్నాయి. వీటిపై రాకపోకలకు సాగించడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు వీధులకు సంబంధించిన ఎక్స్టెన్షన్ ప్రాంతాలు ఉన్నా కనీసం రోడ్డు నిర్మించలేదు. ఇప్పటికైనా స్పందించి రహదారి నిర్మించాలి.
-కిరణ్కుమార్, మాజీ కార్పొరేటర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
[ 14-05-2024]
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైకాపా దాడులు కొనసాగుతున్నాయి. -
తిరుచానూరులో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
[ 14-05-2024]
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22 నుంచి 24 వరకు వసంతోత్సవాలు జరగనున్నాయి. -
తెదేపా మద్దతుదారుల వ్యవసాయ పరికరాలకు నిప్పు పెట్టిన దుండగులు
[ 14-05-2024]
రామకుప్పం మండలంలో ఇద్దరు తెదేపా ఏజెంట్ల వ్యవసాయ పరికరాలకు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. -
ప్రజాస్వామ్యాన్ని తోసిరాజని.. అరాచకస్వామ్యాన్ని వీడలేమని
[ 14-05-2024]
అరాచక పాలనతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపా.. మళ్లీ పీఠమెక్కేందుకు అడ్డదారులనే ఎంచుకుంది. పచ్చనోటు.. దొంగ ఓటు.. మద్యం ప్రవాహం.. ఇతరత్రా తాయిలాలతో అధికార పార్టీ ప్రలోభాల వల విసిరినా.. -
ఓటేసిన ప్రముఖులు
[ 14-05-2024]
రాజంపేట పార్లమెంటు, పుంగనూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలసి వారి స్వగ్రామం సదుం మండలం యర్రాతివారిపల్లెలో ఓటేశారు. -
దొంగ ఓటేసేందుకు వచ్చిన ఐదుగురిపై కేసులు
[ 14-05-2024]
అధికార వైకాపా దొంగఓటుకు యత్నించింది. తమిళనాడు, రేణిగుంట, కోడూరు తదితర ప్రాంతాల నుంచి రప్పించి దొంగ ఓట్లకు యత్నించారు. పలు బూత్ల పరిధిలో మరొకరి ఓటరు స్లిప్పులతో ఓటింగ్కు యత్నిస్తూ పలువురు దొరికిపోయారు. -
ఏఎస్డీ జాబితా పట్టించుకున్నదెవరు!
[ 14-05-2024]
‘దొంగ, బోగస్ ఓట్లు వేసేందుకు ఆస్కారం లేదు.. పోలింగ్ కేంద్రంలోని ప్రతి ప్రిసైడింగ్ అధికారుల వద్ద ఏఎస్డీ(ఆబ్సెన్టీ, షిఫ్టెడ్, డెత్) జాబితా ఉంటుంది. దానిద్వారా దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని సులువుగా పట్టేయవచ్చు.. -
ఉదయాన్నే మొరాయించి.. సతాయించి
[ 14-05-2024]
ఓటువేసి ప్రజాస్వామ్యానికి బంగారు బాటలు వేద్దామనుకున్నవారంతా మొరాయించిన ఈవీఎంలను చూసి ఉసూరుమన్నారు. పోలింగ్ సమయానికి అరగంట ముందే కేంద్రాల వద్దకు చేరుకున్న ఓటర్లకు వాటితో నిరాశే మిగిలింది. -
రామిరెడ్డిపల్లిలో చిందిన రక్తం
[ 14-05-2024]
రామిరెడ్డిపల్లి పంచాయతీలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణ పెద్దదైంది. పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో సోమవారం రాత్రి వైకాపా వర్గీయులు గ్రామంలోకి వచ్చి రాళ్లు విసరడంతో ఎనిమిదిమంది గ్రామస్థుల తలలు పగిలాయి. -
రెండు గ్రామాల్లో ఇరువర్గాల ఘర్షణలు
[ 14-05-2024]
పోలింగ్ సందర్భంగా సోమవారం మండలంలోని రెండు గ్రామాల్లో చోటుచేసుకున్న ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన ముగ్గురు గాయపడ్డారు. -
ఇలా బాదేశావేం.. జగన్
[ 14-05-2024]
సీఎం జగన్ గత ఐదేళ్లలో నిత్యావసర ధరల్ని ఇష్టానుసారంగా పెంచేసి.. పేదల అవసరాల్ని, తప్పించుకోలేని ఖర్చుల రూపంలో దండుకున్నారు. బటన్ నొక్కి డైరెక్ట్గా సంక్షేమం డీబీటీ చేశామని మాటలు చెప్పి.. -
పెరుమాళ్లకండ్రిగపై.. పచ్చనపల్లె వైకాపా శ్రేణుల దాడి
[ 14-05-2024]
ఎన్నికల నేపథ్యంలో గ్రామాలపై మధ్య అధికార వైకాపా చిచ్చుపెట్టింది. చిత్తూరు మండలం పెరుమాళ్ల కండ్రిగలో సోమవారం తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానైంది. -
తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడి
[ 14-05-2024]
దొంగఓట్లు వేస్తున్న వైకాపా నాయకులను చిత్రీకరించారన్న నెపంతో వైకాపా నాయకులు తెదేపా కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. సోమవారం సాయంత్రం 14 కండ్రిగ ముస్లిం వాడలోని పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
పలు చోట్ల ఈవీఎంల మొరాయింపులు
[ 14-05-2024]
ఈవీఎం ఇబ్బంది పెట్టడంతో ఓటర్లు నిరీక్షించాల్సి వచ్చింది. పలమనేరులో 8 చోట్ల, పుంగనూరులో 13 చోట్ల, కుప్పంలో 14 చోట్ల నిలిచిపోగా.. సాంకేతిక నిపుణుల సాయంతో వాటిని పునరుద్దరించి గంటలోపే పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. -
ఏనుగు దాడిలో ఒకరి మృతి
[ 14-05-2024]
అడవి ఏనుగు వీరంగం సృష్టించింది. ఆదివారం అరగొండ సమీపంలో ఒకరిని పొట్టనబెట్టుకున్న మదగజం అక్కడి నుంచి పూతలపట్టు మండలం మీదుగా సోమవారం పాకాల మండలంలో ప్రవేశించింది. -
క్రికెట్ ఆట తెచ్చిన తంటా
[ 14-05-2024]
క్రికెట్ ఆట తెచ్చిన తంటా రెండు గ్రామాల యువకుల మధ్య గొడవకు కారణమైంది. స్థానికుల కథనం మేరకు.. పుల్లూరు, పుల్లూరు ఎస్సీ కాలనీ యువకులు రెండు వారాల క్రితం ఆడిన క్రికెట్ సందర్భంగా మనస్పర్థలు వచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అదే ఐపీఎల్ను మార్చేసింది..: రవిశాస్త్రి
-
జాబ్ మార్కెట్ పైకి ఏఐ ‘సునామీ’.. IMF చీఫ్ వ్యాఖ్యలు!
-
చైనాకు చెక్ పెట్టేందుకు ‘గ్రేట్షార్క్’, ‘మాంట రే’ సిద్ధం..!
-
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
-
మూడో రోజూ లాభాల్లో సూచీలు.. 22,200 ఎగువకు నిఫ్టీ
-
టాటా ప్లేతో అమెజాన్ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్ వీడియో