దాడులు, అరాచకమే ఎజెండా
అరాచకమే ఎజెండాగా ఎన్నికల్లో నెగ్గాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుయుక్తులు పన్నుతున్నారు. ఈ క్రమంలో పుంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా అంటే తాజా పరిస్థితులను పరిశీలిస్తే సందేహమనే సమాధానం వస్తోంది.
ఎన్నికల కోడ్ వచ్చినా ఆగని వైకాపా ఆగడాలు
పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి కుయుక్తులు
ఈనాడు, చిత్తూరు: అరాచకమే ఎజెండాగా ఎన్నికల్లో నెగ్గాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుయుక్తులు పన్నుతున్నారు. ఈ క్రమంలో పుంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా అంటే తాజా పరిస్థితులను పరిశీలిస్తే సందేహమనే సమాధానం వస్తోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన పోలీసు యంత్రాంగం అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైకాపా నేతల అరాచకాలపై ఎదురుతిరిగిన వ్యక్తులపై దాడులు చేసి కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన తర్వాతా పోలీసుల తీరులో మార్పు రాకపోవడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.
పోలింగ్ నాటికి ఎవరూ ఉండకూడదనే..
వరుసగా మూడుసార్లు గెలిచిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎలాగైనా అమాత్యుడిని ఓడించాలనే కసితో ఉన్నారు. గ్రామాల్లో స్వచ్ఛందంగా తెదేపాలో చేరుతున్నారు. ప్రధానంగా పెద్దిరెడ్డి సొంత మండలం సదుంలో ఎన్నడూ లేనివిధంగా తెదేపా అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలు మంత్రికి, వైకాపా శ్రేణులకు మింగుడుపడటం లేదు. ప్రజాబలం లేదని అర్థం కావడంతో పోలింగ్ నాటికి విపక్ష కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి జైళ్లకు పంపించాలని యత్నిస్తున్నారు. మొత్తంగా పోలింగ్ నాటికి తెదేపాకు ఏజెంట్లు లేకుండా చేయాలని కుయుక్తులు పన్నుతున్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా
షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలి. సమస్యాత్మక ప్రాంతమైన పుంగనూరులో ఎక్కువ మంది సిబ్బందిని మోహరించాలి. తరచూ గొడవలకు దిగుతున్న వైకాపా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తేనే మిగిలిన వారూ రెచ్చిపోకుండా ఉంటారు. ఇటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం విపక్షాలపైనే కక్ష కట్టి ప్రజాస్వామ్యాన్ని పరిహసించే యత్నాలు జరుగుతున్నాయి.
చౌడేపల్లె మండలం ఆమినిగుంట చెరువులో వైకాపా నేతలు పరిమితికి మించి మట్టి తవ్వడాన్ని గతనెల 21న తెదేపా మండల అధ్యక్షుడు రమేష్రెడ్డి అడ్డుకున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు రమేష్రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఈనెల 17న పుంగనూరులో కూరగాయలు తీసుకెళ్తున్న తెదేపా కార్యకర్త హేమాద్రిని వైకాపా నేత నాగభూషణం అనుచరులు కిడ్నాప్ చేసి ఆయన ఇంట్లోకి తీసుకెళ్లి దాడి చేసేందుకు యత్నించారు. విపక్ష కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో బాధితుడు తప్పించుకున్నారు.
ఏప్రిల్ 26న పుంగనూరు మండలం మాగాండ్లపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రచారం చేస్తుండగా వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రచార వాహనం అద్దాలు పగులగొట్టారు.
శనివారం రాత్రి చౌడేపల్లె మండలం బోయకొండ క్రాస్ వద్ద తెదేపా మండల అధ్యక్షుడు రమేష్రెడ్డి ఆయన అనుచరులను వైకాపా శ్రేణులు రెచ్చ గొట్టాయి. ఎదురు తిరిగినందుకు కర్రలు, రాళ్లతో వాహనాన్ని ధ్వంసం చేయడంతోపాటు కార్యకర్తలను కొట్టారు.
ఉన్నతాధికారులు స్పందిస్తేనే..
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ మణికంఠ, ఎన్నికల పరిశీలకులు చొరవ తీసుకొని.. పుంగనూరు నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తే అధిక సంఖ్యలో కేంద్ర బలగాలు రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఓటర్లు ఎటువంటి భయభ్రాంతులకు గురవ్వకుండా తమ హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటారు.
ఏజెంట్లు లేకుండా చేయాలనే..
ఎన్నికల్లో తెదేపా తరఫున ఏజెంట్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మంత్రి పెద్దిరెడ్డి వైకాపా శ్రేణులతో దాడులు చేయిస్తున్నారు. పోలీసులతో కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారు. గతంలో ఒకేరోజు 140 మంది తెదేపా కార్యకర్తలపై రౌడీషీˆట్లు తెరిచారు. కొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు.. మంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మాపై ఎన్ని కేసులు నమోదు చేస్తే అంతగా బలపడతాం.
- చల్లా రామచంద్రారెడ్డి, పుంగనూరు తెదేపా అభ్యర్థి
ఓటమి భయంతోనే దాడులు
ఓడిపోతానన్న భయంతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబీకులు, వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. చౌడేపల్లె మండలంలో గువ్వల రమేష్రెడ్డిని అడ్డు తొలగించుకుంటే ఎవరూ ఎదురు తిరగరనే ధీమాతో రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ప్రజలు ఓటుతో మంత్రి పెద్దిరెడ్డిని ఓడించి సత్తా చూపాలి.
శ్రీరాం చినబాబు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటెత్తిన చైతన్యం
[ 15-05-2024]
జిల్లా సరిహద్దు ప్రాంతమైన సత్యవేడులో రికార్డు స్థాయిలో 85.63% ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 83.25, సూళ్లూరుపేట నియోజకవర్గంలో 82.92 శాతం నమోదైంది. -
స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు భద్రం
[ 15-05-2024]
చిత్తూరు లోక్సభతో పాటు, ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయిన ఈవీఎంలను చిత్తూరు నగరం ఎస్వీసెట్లోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. -
పల్లె ఓటర్లు పోటెత్తారు!
[ 15-05-2024]
పల్లె ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడ్డారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు పోటెత్తి ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచారు. -
అంతరాలయంపై ఆలస్యమేల..!
[ 15-05-2024]
శ్రీకాళహస్తీశ్వరాలయంలో దళారుల దందాకు అడ్డుకట్ట వేసే దిశగా అంతరాలయ దర్శనం టికెట్ను అమలు చేయాలని అధికారులు, ధర్మకర్తల మండలి నిర్ణయించింది. -
ప్రచారం చేసినందుకు పంటకు నిప్పు
[ 15-05-2024]
మండలంలోని బూరుగుమాకులపల్లిలో రామేగౌడు ఇటీవల తెదేపా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆరునెలల ముందు తెదేపా నుంచి వైకాపాలో చేరారు. -
విదేశాలకు మామిడి ఎగుమతులు
[ 15-05-2024]
అందరినీ నోరూరించే మామిడి సీజన్ ప్రారంభమైంది. జిల్లా నుంచి మామిడి కాయల ఎగుమతులు విదేశాలకు ప్రారంభమయ్యాయి. -
సర్పంచి ఇంటిపై వైకాపా మూకల దాడి
[ 15-05-2024]
మండలంలోని జగన్నాధపురం సర్పంచి రాణెమ్మ(ఇటీవల ఎన్నికలకు ముందు తెదేపాలో చేరారు) ఇంటిపై వైకాపా మూకలు దాడి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. -
భార్యపై కత్తితో దాడి .. పరిస్థితి విషమం
[ 15-05-2024]
భార్యపై భర్త కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. మండల పరిధిలో చెన్నై బెంగళూరు జాతీయ రహదారిలోని లక్ష్మయ్యకండ్రిగ బస్సు స్టాప్లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. -
పాశవికం..!
[ 15-05-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిని హతమార్చేందుకు వైకాపా గూండాలు మంగళవారం బరితెగించారు. శ్రీపద్మావతి వర్సిటీలో ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్రూంల వద్దకు వచ్చిన నానిని అంతమొందించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అనుచరులు యత్నించారు. -
తిరుపతి గంగజాతరకు చాటింపు
[ 15-05-2024]
తిరుపతి ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం చాటింపుతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. -
వేసవిలో తాగనీటి ఎక్కిళ్లు
[ 15-05-2024]
వేసవిలో తాగునీటి ఎద్దడి ఎక్కువైంది. గ్రామీణ ప్రాంతాల్లో గుక్కెడు నీటికి కష్టమవుతోంది. అటు పంచాయతీ తాగునీటి పథకాలతో పాటు ఇతర పథకాలు దెబ్బతిన్నా సర్పంచులు వాటిని బాగు చేసే పరిస్థితులు లేవు. -
మాదే గెలుపు.. పందెమెంతో చెప్పు
[ 15-05-2024]
జిల్లాలో బెట్టింగుల జోరు ఎక్కువే. ఐపీఎల్ సీజన్లో జోరుగా బెట్టింగులు జరుగుతాయి. ఈ బెట్టింగులు ఒక వైపు ఉంటే.. -
నానిపై దాడి అమానుషం
[ 15-05-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి అమానుషమని తెదేపా కూటమి ఎంపీ,
తాజా వార్తలు (Latest News)
-
మెడకు స్కార్ఫ్ చుట్టి.. అంగన్వాడీ టీచర్ హత్య
-
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
-
పవర్ప్లేలో వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బే: కేఎల్ రాహుల్
-
మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్పై హత్యాయత్నం
-
తెలంగాణలో రెండు వారాలు సినిమా ప్రదర్శనల నిలిపివేత!
-
గో డిజిట్ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే..