మూగబోయిన జీవితాలు
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం శివారు హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు
సీఎం సభ ఏర్పాట్లకు వెళ్తుండగా ఘటన
వినోద్కుమార్, ప్రభాకర్ (పాత చిత్రాలు
చాగల్లు, న్యూస్టుడే: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం శివారు హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బహిరంగ సభకు సౌండ్ సిస్టం ఏర్పాటు చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు పట్టణంలోని సత్రంపాడుకు చెందిన మెండెం వినోద్కుమార్(32) సీఎం సభలు, సమావేశాలకు సౌండ్ సిస్టమ్ నిర్వహిస్తుంటారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో సోమవారం సీఎం సభ జరగనుంది. దానికి సౌండ్ సిస్టం ఆపరేట్ చూసేందుకు వినోద్కుమార్, మరో ఎనిమిది మంది సహాయకులను తీసుకుని చోడవరం బయలుదేరారు. కొవ్వూరు మండలం కాపవరం సమీపంలోకి వచ్చేసరికి వీరు వాహనం ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొంది. దీంతో వినోద్కుమార్తో పాటు, దారబోయిన ప్రభాకర్(21) వ్యానులోనే మృతిచెందారు. డ్రైవర్ తిరుపతిరావుతో పాటు మిగిలిన ఆరుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రి తరలించారు. కొవ్వూరు గ్రామీణ ఎస్సై కె.సుధాకర్ సంఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు. క్షతగాత్రుడు టి.డేవిడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అందరికీ అండగా..
వినోద్కుమార్(32)కు మూడేళ్ల క్రితం స్వరూపారాణితో వివాహమైంది. వీరికి ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు. వృద్ధులైన తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు సోదరుడి కుటుంబానికి సైతం ఆర్థికసాయం చేస్తుంటారు. అతని మృతితో తమకు దిక్కు ఎవరంటూ వినోద్కుమార్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు. అతని దగ్గర ఉపాధి పొందుతున్న కుటుంబాలు కూడా బాధలో మునిగిపోయాయి.
సోదరి పెళ్లి కోసం పనిలోకి..
ప్రభాకర్ చిన్నతనం నుంచి తల్లి ఆలనలోనే పెరిగాడు. కుటుంబానికి తానే అండగా నిలిచాడు. సోదరి పెళ్లి బాధ్యత తాను తీసుకున్నాడు. అందుకోసం పదితోనే చదువు ఆపేసి, వినోద్కుమార్ దగ్గర సౌండ్ సిస్టం నిర్వహణ నేర్చుకున్నాడు. అతని దగ్గరే పనిచేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాకర్ మృతితో తల్లి, సోదరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉన్న ఒక్కగానొక్క ఆధారం పోవడంతో వారికుటుంబం దిక్కులేనిది అయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కు ప్రేమతో ఓటేశారు: నాగబాబు
[ 14-05-2024]
జనసేన అధినేత, కూటమి అభ్యర్థి పవన్ కల్యాణ్కు పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లంతా ప్రేమతో ఓటేశారని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. -
మళ్లీ ఎలా వస్తావో మేమూ చూస్తాం.. వంగా గీతను నిలదీసిన ఓటర్లు
[ 14-05-2024]
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొండెవరం పోలింగ్ కేంద్రానికి వచ్చిన పిఠాపురం వైకాపా అభ్యర్థిని వంగా గీతను ఓటర్లు నిలదీశారు. -
ఓటరు.. చైతన్యం సూపర్
[ 14-05-2024]
సార్వత్రిక సమరం ఓటర్లలో చైతన్యం నింపింది. వజ్రాయుధాన్ని సంధించడానికి ఉత్సాహం చూపారు. సోమవారం ఉదయం 6.30 గంటల నుంచే బారులు తీరారు. -
ఓటేశారు..
[ 14-05-2024]
విదేశాల నుంచి వచ్చారు.. ఇతర రాష్ట్రాల నుంచి రెక్కలు కట్టుకొని వచ్చేశారు. రైళ్లు, బస్సులు, ప్రయివేటు వాహనాల్లో ఉత్సాహంగా తరలివచ్చారు. -
ధీమా ఇవ్వని వైఎస్సార్ బీమా
[ 14-05-2024]
వైఎస్సార్ బీమా పథకంతో బాధిత కుటుంబాలకు ధీమా లేకుండా పోయింది. -
బూత్ మారడంతో ఓటింగ్కు దూరం
[ 14-05-2024]
సీతానగరం మండలం ముగ్గళ్లలో 35వ పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. -
సమయం దాటినా అధికార పార్టీ వ్యక్తికి అనుమతి
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6.00 గంటలలోగా పోలింగ్ కేంద్రంలో ఉన్నవారికే ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. -
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలి: పురందేశ్వరి
[ 14-05-2024]
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
బస్సులు లేవు.. రైళ్లు రద్దీ
[ 14-05-2024]
వారంతా ఓటు వేయాలనే సంకల్పంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి రెక్కలు కట్టుకుని వచ్చారు. -
బందోబస్తు ఉన్నా ఉద్రిక్త ఘటనలు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకున్నా.. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. -
ఐడీ కార్డు లేకుండా ప్రచారమా?
[ 14-05-2024]
పెదపూడి మండలం జి.మామిడాడ శివారు లక్ష్మీనరసాపురం వద్ద ఉన్న 196,197,198 పోలింగ్ కేంద్రాల వద్ద స్థానిక సచివాలయ కార్యదర్శి వై.వి.వి.దుర్గాప్రసాద్ వైకాపాకు అనుకూలంగా ప్రచారం నిర్వహించడంపై ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. -
రంగాపురంలో రాళ్లురువ్వుకున్న ఇరువర్గాలు
[ 14-05-2024]
పోలింగ్ చివరి క్షణంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం రంగాపురంలో ఘర్షణ చోటు చేసుకుంది. -
కృష్ణునిపాలెంలో ఉద్రిక్తత
[ 14-05-2024]
వైకాపా, తెదేపా వర్గీయుల కవ్వింపు చర్యలు గోకవరం మండలం కృష్ణునిపాలెంలో ఉద్రిక్తతకు దారి తీశాయి. -
పోలింగ్ ఏజెంట్గా జడ్పీ ఉపాధ్యక్షురాలు
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఉపాధ్యక్షురాలు పోశిన శ్రీలేఖ ఎన్నికల ఏజెంట్గా వ్యవహరించారు. -
వైకాపా ఎంపీ అభ్యర్థికి ఏజెంట్లు కరవు
[ 14-05-2024]
వైకాపా ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావుకు పోలింగ్ ఏజెంట్లు లేని పరిస్థితి అల్లవరం, గోడితిప్ప, మొగళ్లమూరు, తూర్పులంక, తదితర కేంద్రాల్లో కనిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు
-
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?
-
సీఎం ఇంట్లో ఎంపీపై దాడి: ఎవరీ బిభవ్ కుమార్..?
-
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
-
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
-
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ‘మహా’తలపోటు