logo

పింఛన్‌దారులను మండుటెండలో తిప్పడమే వైకాపా పనిగా పెట్టుకుంది

మండుటెండలో పింఛన్‌దారులను అటూ ఇటూ తిప్పడమే వైకాపా పనిగా పెట్టుకుందని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరోపించారు.

Updated : 29 Apr 2024 17:17 IST

తాళ్లపూడి: మండుటెండలో పింఛన్‌దారులను అటూ ఇటూ తిప్పడమే వైకాపా పనిగా పెట్టుకుందని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ అందించాలని ఉమ్మడిపార్టీలు కోరుతున్నాయని పేర్కొన్నారు. తాళ్లపూడి మండలంలోని పోచవరంలో ఉమ్మడిపార్టీల ప్రచార కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు చలపాటి ప్రకాష్, అనపర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం చేశారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్ అందించాలన్నారు. రానున్న ఎన్నికల్లో ముప్పిడి వెంకటేశ్వరరావుకి, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరికి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీరుకొండ సూరిబాబు, కొండేపాటి రమేష్, కొండేపాటి చౌదరి, ఉండవల్లి శ్రీను, కాకర్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని