logo

బటన్నోక్కే వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపాలి

బటన్ నొక్కే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలంతా సాగనంపాలని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరంతా ఓటు వేయాలని సీనియర్ తెదేపా నాయకుడు పెండ్యాల అచ్చిబాబు తెలిపారు.

Published : 29 Apr 2024 20:27 IST

తాళ్లపూడి: బటన్ నొక్కే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలంతా సాగనంపాలని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరంతా ఓటు వేయాలని సీనియర్ తెదేపా నాయకుడు పెండ్యాల అచ్చిబాబు తెలిపారు. తాళ్లపూడి మండలంలోని పెద్దేవంలో ఉమ్మడిపార్టీల ఆత్మీయసమావేశాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వైకాపా ప్రవేశపెట్టిన మేనిపెస్టో ప్రజలకు ఉపయోగం లేనిదిగా ఉందన్నారు. ఉమ్మడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజలకు మేలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో చాగల్లు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య, ద్విసభ్యకమిటీ సభ్యుడు సుబ్బారాయచౌదరి, జనసేన, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని