logo

కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీని సాధిద్దాం

కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి కోరారు.

Published : 29 Apr 2024 20:28 IST

భువనగిరి: కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి కోరారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేష్ అధ్యక్షతన భువనగిరి పట్టణ బూత్ అధ్యక్ష కార్యదర్శుల సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అత్యధిక మెజారిటీ సాధించేందుకు పార్టీ శ్రేణులు కలసిగట్టుగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత ప్రమోద్ కుమార్, పీసీసీ సభ్యుడు తంగాలపల్లి రవికుమార్, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు బర్రె జహంగీర్, పి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని