కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీని సాధిద్దాం
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి కోరారు.
భువనగిరి: కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి కోరారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేష్ అధ్యక్షతన భువనగిరి పట్టణ బూత్ అధ్యక్ష కార్యదర్శుల సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యధిక మెజారిటీ సాధించేందుకు పార్టీ శ్రేణులు కలసిగట్టుగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత ప్రమోద్ కుమార్, పీసీసీ సభ్యుడు తంగాలపల్లి రవికుమార్, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు బర్రె జహంగీర్, పి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలం..
[ 16-05-2024]
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రోజుకో ప్రత్యేకతతో చర్చల్లోకి వస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో దిగిన క్షణం నుంచే ఈ ప్రాంతం అందరి దృష్టినీ ఆకర్షించింది. -
మురిపించే గోదారి.. పర్యటకానికి దారేది?
[ 16-05-2024]
గలగల పారే గోదారి పరవళ్లు.. కోనసీమలో సహజసిద్ధ అందాలు.. సువిశాల తీర ప్రాంతం పర్యాటకులను కట్టిపడేస్తాయి. -
పోస్టల్ బ్యాలట్ ఓట్లు 15,201
[ 16-05-2024]
జిల్లా వ్యాప్తంగా 15,201 మంది పోస్టల్ బ్యాలట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కలెక్టర్ హిమాన్షుశుక్లా బుధవారం తెలిపారు. -
కౌంటింగ్ పూర్తయ్యే వరకు 144 సెక్షన్
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఐజీ జీవిజీ అశోక్కుమార్ తెలిపారు. -
సమయం తక్కువ.. సమస్యలు ఎక్కువ?
[ 16-05-2024]
గత మూడేళ్లుగా వేసవిలో పంటకాలువలు మూసేసిన అనంతరం నిర్వహించే క్లోజర్ పనులకు వైకాపా ప్రభుత్వం మంగళం పాడింది. -
19న చదరంగం పోటీలు
[ 16-05-2024]
జిల్లా చదరంగం సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19న ది ఫ్యూచర్ కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి జీవీ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జూన్ 4 వేడుకలకు సిద్ధం కండి
[ 16-05-2024]
పవన్కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటన వెలువడినప్పటి నుంచి.. ఈవీఎంలో ఆఖరి ఓటు పడే వరకూ, ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు చేరేవరకూ అలుపెరగకుండా కృషిచేసిన ఘనత జనసైనికులు, వీరమహిళలకు దక్కుతుందని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. -
ప్రేమ వివాహాన్ని కాదన్నారని యువకుడి ఆత్మహత్యాయత్నం
[ 16-05-2024]
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నా ఆమెతో కాపురానికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించి.. ఆమెను బలవంతంగా తీసుకువెళ్లడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు