పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు.
న్యూస్టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం
ఇన్నీస్పేట శాఖా గ్రంథాలయంలో బాలలకు శిక్షణ
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. కొందరికి లెక్కలంటే చెప్పలేనంత భయం.. ఇంకొందరు ఆంగ్లంలో మాట్లాడేందుకు తడబడతారు. వీరందరినీ ఓచోట చేర్చి ఉపాధ్యాయులు శిక్షణ అందిస్తున్నారు. ఈనెల 15 నుంచి నగరంలోని పలు గ్రంథాలయాల్లో వేసవి ఉచిత శిక్షణ తరగతులు మొదలయ్యాయి. సెలవులు వృథా కాకుండా సమీపంలోని గ్రంథాలయాల్లో జరుగుతున్న శిబిరాలకు పిల్లలు హాజరు కావొచ్చని గ్రంథాలయాధికారులు చెబుతున్నారు.
పిల్లల్లో పఠనాశక్తిని పెంచేందుకు గ్రంథాలయంలో వారికి నచ్చిన పుస్తకం తీసుకుని చదువుకునేలా ప్రోత్సహిస్తారు. ఉపాధ్యాయులు నీతి కథలు చెప్పడంతోపాటు పిల్లలకు తెలిసిన కథలు చెప్పిస్తారు. తద్వారా పదిమందితో ఎటువంటి బెరుకూ లేకుండా పిల్లలు మాట్లాడతారు. తెలుగు పద్యాలు చదవడం, వాటి భావార్థం తెలియజేయడం, శ్లోకాల పఠనం నేర్పిస్తారు. వేద గణితం తరగతిలో సులభంగా లెక్కలు చేయడంలో శిక్షణ ఇస్తారు. సంగీతం, నృత్యంపై ఆసక్తి కలిగిన పిల్లలకు సంప్రదాయ నృత్యం, లలిత సంగీతంలోనూ తర్ఫీదునిస్తారు. పిల్లలకు ఆసక్తి కలిగించేలా చిన్నపాటి వస్తువులు, రంగుల కాగితాలతో అందమైన బొమ్మలు తయారు చేయడం నేర్పిస్తారు.
గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంలో శిక్షణకు హాజరైన విద్యార్థులు
సమయాలు ఇవి...
నగరంలోని గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంతోపాటు ఇన్నీస్పేట, సీతంపేట, దానవాయిపేట తదితర శాఖా గ్రంథాలయాల్లో వేసవి ఉచిత శిబిరాలు జరుగుతున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు ఉంటాయి.
సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నా
ఇన్నీస్పేట శాఖా గ్రంథాలయంలో అందిస్తున్న శిక్షణకు హాజరై నాకు నచ్చిన కథలు చదువుకుంటున్నా. క్రాఫ్ట్ తరగతిలో కొత్త ఆలోచనలతో అందమైన బొమ్మలు చేస్తున్నా. నాకిష్టమైన సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నా. వివిధ పాఠశాలల్లో చదువుకునే తోటి విద్యార్థులతో మంచి స్నేహం కుదిరింది. సంతోషంగా విజ్ఞానదాయకమైన అంశాలు నేర్చుకునే అవకాశం దొరికింది.
ఎం.నిహారిక, ఏడోతరగతి
వేద గణితం, బొమ్మల తయారీ బాగున్నాయ్..
మాకు తరగతి పాఠాల్లో నీతికథలు, చిత్రలేఖనం, సంగీతం వంటివి ఉండవు. కొని చదువుకునేందుకు సమయం దొరకదు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో మాకు దగ్గరలోని సీతంపేట శాఖా గ్రంథాలయంలో జరుగుతున్న శిక్షణకు హాజరవుతున్నా. వేద గణితం, సంగీతం, బొమ్మల తయారీ వంటివి ఆసక్తిగా ఉన్నాయి. ప్రత్యేకించి నాకు నచ్చిన కథలు ఇక్కడ చదువుకోవడం మరీ నచ్చింది.
కౌషిక్, ఏడోతరగతి
శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి..
గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంలో ఈనెల 15నుంచి మొదలైన వేసవి శిక్షణ శిబిరం జూన్ 7వ తేదీ వరకు జరుగుతుంది. పిల్లలు విజ్ఞాన అంశాలను నేర్చుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని గ్రంథాలయాలకు పంపించేందుకు ప్రోత్సహించాలి. కథలు చదివించడం, సమీక్షలు నిర్వహించడం, వేదగణితం, పేపర్ క్రాఫ్ట్, స్పోకెన్ ఇంగ్లీష్ తదితర విభాగాల్లో నిపుణులైన ఉపాధ్యాయులు శిక్షణ అందిస్తున్నారు. ప్రముఖ నాయకుల జీవిత చరిత్రలు చదవడం ద్వారా పిల్లల్లో చక్కటి వ్యక్తిత్వం అలవడేందుకు దోహదం చేస్తుంది.
ఘంటా శ్రీదేవి, గ్రంథాలయాధికారిణి, గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏజెంట్ 004
[ 02-06-2024]
సజ్జల వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కేసూ నమోదయ్యింది. ఎన్నికల రోజున అల్లర్లు సృష్టించిన వైకాపా నాయకులు.. ఓట్ల లెక్కింపు రోజూ ఇదే పంథా ఎంచుకుంటారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తంచేస్తున్నాయి. -
నలుచెరుగులా బలగాలు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 48 గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూం, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో సుమారు 1,100 మంది కేంద్ర, రాష్ట్ర బలగాలతో బందోబస్తు ఉంటుంది. -
కూటమి ఖుషీ
[ 02-06-2024]
తెదేపా- జనసేన- భాజపా కూటమిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో ఫలితాలు అనుకూలంగా రావడంతో తమ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమనే ధీమా కనిపిస్తోంది. -
ఓట్ల లెక్కింపునకు 17 కేంద్రాలు
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి నన్నయ విశ్వవిద్యాలయంలో మొత్తం 17 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్ చెప్పారు. కలెక్టరేట్లో శనివారం విలేకరుల సమావేశంలో కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. -
ఎన్డీఏ కూటమిదే విజయం: సీఎం రమేష్
[ 02-06-2024]
కేంద్రంలోను, రాష్ట్రంలోను ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి, భాజపాకు చెందిన సి.ఎం.రమేష్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి శనివారం రాత్రి విమానంలో వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బ్యాంకుల్లో 47.82 శాతమే పింఛను సొమ్ము ఉపసంహరణ
[ 02-06-2024]
సామాజిక భద్రత పింఛను డబ్బులు బ్యాంకుల ద్వారా తీసుకునేందుకు ఈ నెల కూడా జిల్లాలోని లబ్ధిదారులు ఇబ్బందులు పడక తప్పలేదు. కొన్నిచోట్ల బ్యాంకుల్లో పింఛను నగదు కోసం గంటల తరబడి వరసలో నిరీక్షించాల్సి వచ్చింది. -
ఆగండి.. ఎలా వెళ్లాలో గమనించండి
[ 02-06-2024]
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ (కౌంటింగ్) జర¢గనుండటంతో ఆ రోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి అటుగా వెళ్లే భారీ వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకుంటున్నారు. -
4జీ సేవలు మరింత విస్తృతం
[ 02-06-2024]
4జీ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజరు ఎం.శేషాచలం చెప్పారు. ఈ మేరకు శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
ఈదురు గాలుల బీభత్సం
[ 02-06-2024]
కాకినాడ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో జనం బెంబేలెత్తారు. శనివారం వేకువజామున 4 గంటల నుంచి జిల్లాలోని 14 మండలాలను ఒక్కసారిగా ఈదురుగాలులు చుట్టుముట్టాయి. -
పూడికతీత.. పనుల్లో రోత..!
[ 02-06-2024]
‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా మారింది గోదావరి కాలువలో పూడికతీత పనుల పరిస్థితి. అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నా, పనులకు పక్కాగా అనుమతులు లభించినా పారదర్శకంగా నిర్ణీత గడువులోపు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం నెలకొంది. -
సమస్యాత్మక ప్రాంతాల్లో కోనసీమదే మొదటి స్థానం
[ 02-06-2024]
ఏలూరు రేంజ్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో కోనసీమ ప్రథమ స్థానంలో ఉందని ఎస్ఈబీ ఐజీ, జిల్లా లెక్కింపు ప్రత్యేకాధికారి ఎం.రవిప్రకాష్ తెలిపారు. శనివారం ఆయన అమలాపురంలో మాట్లాడారు. -
సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక గ్రూపులు..
[ 02-06-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఆవశ్యకత, ఓటు విలువను గుర్తించిన యువత పెద్దఎత్తున ఓట్ల పండగలో పాల్గొని.. తమకు నచ్చినవారికి ఓటు వేశారు. జిల్లాలో పోలింగ్ శాతం కూడా భారీగానే నమోదైంది.