బయట ఉంటే అంతే
అసలే పెరిగిన విద్యుత్తు బిల్లుల భారంతో అన్ని వర్గాలు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఎత్తేస్తే.. వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ వర్గాలకు అండగా
ఎస్సీ, ఎస్టీ విద్యుత్తు వినియోగదారులకు షాక్
ఈనాడు - అమరావతి
అసలే పెరిగిన విద్యుత్తు బిల్లుల భారంతో అన్ని వర్గాలు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఎత్తేస్తే.. వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ వర్గాలకు అండగా ఉంటున్నామని చెబుతున్న ప్రభుత్వం.. వారికి విద్యుత్తు వినియోగంపై సబ్సిడీని మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించుకుంటే డబ్బు కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడో రెండేళ్ల క్రితం జారీ చేసిన ఉత్తర్వుకు అధికారులు పదును పెడుతున్నారు. ఆంక్షల పేరుతో రాయితీని కుదించేందుకు చకచకా పావులు కదుపుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రతినెలా లభించే విద్యుత్తు రాయితీ ప్రభుత్వం భరిస్తుంది. వారు వినియోగించుకున్న మొత్తాన్ని ప్రభుత్వం డిస్కమ్లకు సర్దుబాటు చేస్తుంది. ఆవాసాలు, కాలనీలు, తండాల్లో నివాసం ఉండే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకే రాయితీకి అర్హులంటూ 2020లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఎక్కడా ఇది బయటకు పొక్కలేదు. కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు కేవలం వారి కుల ధ్రువీకరణ పత్రాన్ని విద్యుత్తు శాఖ అధికారులకు అందజేస్తే రాయితీ వర్తించేది. కొత్త నిబంధనల కారణంగా కాలనీలు, తండాల్లో నివిసించే వారే అర్హులు. వేరే చోట నివాసం ఉంటూ 200 యూనిట్లలోపు వినియోగించుకున్నా సబ్సిడీ వర్తించదు. బిల్లును అందరిలా చెల్లించాల్సిందే. దీనిపై ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో సరైన వసతి లేక, ఇతర ప్రాంతంలో చిన్న ఇళ్లు కట్టుకున్నా.. అనర్హులుగా గుర్తిస్తారు. సెంట్రల్ డిస్కమ్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో సుమారు 6.38 లక్షల మంది పైగా రాయితీ కారణంగా ప్రయోజనం పొందుతున్నారు. తాజా నిర్ణయం వల్ల చాలా మందిని అనర్హుల జాబితాలో చేర్చే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారాన్ని దించుకునేందుకే ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
రికవరీపై ఆందోళన
ప్రభుత్వం ఇప్పటికే ఉచిత విద్యుత్తుకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సంబంధించి ఆధార్తో సహా అన్ని వివరాలను సేకరించి సాంఘిక సంక్షేమ శాఖలోని వివరాలతో ఆరు దశల వడపోత కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ఆధార్తో అనుసంధానమైన చాలా ఇళ్లు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినవి కాదని తేలిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనర్హుల నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన రాయితీని తిరిగి రాబట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్యుత్తు సహాయకులతో సర్వే చేయిస్తున్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తండాల్లో నివాసం ఉండేవారికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఉచిత విద్యుత్తును వీరికే వర్తింపజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకుల వద్ద బారులుదీరిన పింఛనుదారులు
[ 03-05-2024]
వట్టి చెరుకూరు మండలంలోని గ్రామాల్లో బ్యాంకుల వద్ద లబ్ధిదారులు బారులుదీరారు. -
తెదేపా ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన
[ 03-05-2024]
మండలంలోని ఇంజనంపాడు, కమలమూడి, కాట్రపాడు, రొట్టె చెరుకూరు, లేములపాడు, అనంతపురం గ్రామాల్లో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే... -
కక్షగట్టి రప్పించారు.. కసితీరా వేధించారు..
[ 03-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని ఒకవైపు ప్రచారం చేయిస్తున్న పాలకులు ఆరు పదుల వయసు పైబడిన సామాజిక పింఛనుదారులను మాత్రం మండుటెండలో బజారుకీడ్చి వారిని ఇబ్బందుల పాల్జేశారు. -
మీతోనే ముప్పు.. మీవల్లే ముంపు!
[ 03-05-2024]
వారి బాగోగులను అనుక్షణం పట్టించుకోవాలి.అక్కడి ప్రకృతి, పర్యావరణంతోపాటు నదులు, వాగులు, వంకలు సహా పంట పొలాలను రక్షించు కోవాలి. -
నా వంతుగా.. మామకు మద్దతుగా..
[ 03-05-2024]
సినీ హీరో నిఖిల్ గురువారం చీరాలలో సందడి చేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎం కొండయ్యకు మద్దతుగా ఆయన పట్టణంలో ప్రచారం చేపట్టారు. -
బీసీ నాయకులకు జగన్ కుర్చీ కూడా వేయనివ్వరు
[ 03-05-2024]
బీసీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దగ్గరకు వెళితే కనీసం కుర్చీ కూడా వేయరు, ఎవరికి వేయాలో ఆయన కనుసైగలతో సూచిస్తారని మనమంతా విన్నాం, బీసీల పట్ల ఆయన చూపే గౌరవం తీరు ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తుందని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
పోలీసు.. నేత.. చెట్టపట్టాల్!
[ 03-05-2024]
అధికార వైకాపా నేతల కనుసన్నల్లోనే ఇప్పటికీ పోలీసు యంత్రాంగం జోగుతోంది. విధి నిర్వహణలో వారు చెప్పిందే పోలీసులకు వేదంగా ఉంటోంది. -
ఉద్యోగుల ఓట్లకు..గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు. -
క్షీణించిన శ్రీలక్ష్మి ఆరోగ్యం
[ 03-05-2024]
వైకాపా నాయకుల దౌర్జన్యాలు, కబ్జాలతో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీలక్ష్మి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు గురువారం ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం
[ 03-05-2024]
తెదేపా అధికారంలోకి రావడం ఖాయం. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలను కల్పించి తీరతాం’.. అని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి స్పష్టం చేశారు. -
అధికార పార్టీని చిత్తుగా ఓడించండి
[ 03-05-2024]
రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న ప్రభుత్వం మారాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ‘ఇండియా’ కూటమి అభ్యర్థులు జంగాల అజయ్కుమార్, జొన్నా శివశంకరరావు తరఫున మంగళగిరిలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
లోకేశ్ మంగళగిరి రూపురేఖలు మారుస్తారు
[ 03-05-2024]
గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన మంగళగిరి వైకాపా అభ్యర్థి తల్లి కాండ్రు కమల, మామ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గానికి ఏం చేశారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. -
ఆంధ్రాప్యారిస్ పేరుకు తగ్గట్లు అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
ఆంధ్రాప్యారిస్ను పేరుకు తగిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని, తమకు మద్దతు ఇవ్వాలని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు -
మహిళలే నిర్ణేతలు
[ 03-05-2024]
ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 22 తర్వాత జరిగిన చేర్పులు, మార్పులు అనంతరం 22,029 మంది ఓటర్లు పెరిగారు. -
ఉద్యోగుల ఓట్లకు.. గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాఫ్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..