ఉడకని జీడిపప్పు
వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు.
వేటపాలెంలో పరిశ్రమకు కొరవడిన ప్రోత్సాహం
ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు హామీ ప్రకటనలకే పరిమితం
వేల మందికి కొరవడిన ఉపాధి
చీరాల అర్బన్, న్యూస్టుడే: వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. రాను రాను స్థానికంగా ముడిసరకు దొరకడం కష్టంగా మారడంతో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వాటిని దిగుమతి చేసుకుని పప్పు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణం కారణంగా ఏప్రిల్ రెండో వారం వచ్చినా ముడిసరకు అందుబాటులో లేక నెల రోజులుగా వ్యాపారం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దాదాపు రూ.3 కోట్ల టర్నోవర్ నిలిచిపోయిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ సీజన్లోనే కాదు.. ఏటేటా పరిశ్రమకు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కొరవడింది. ఆ ప్రభావం దీనిపై ఆధారపడిన వందల మందిపై ప్రభావం చూపుతోంది.
ఉడకబెట్టే యంత్రాలకు రాయితీ రుణాలేవీ?
మారుతున్న కాలానికి అనుగుణంగా పరిశ్రమలోకి యంత్రాలు వచ్చేశాయి. విత్తనాలు కాల్చడం వలన ఏర్పడే కాలుష్యం ప్రభావంతో చుట్టుపక్కల వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం వీటిని మార్పుచేయాలని సూచించడంతో ఒక్క వేటపాలెం ప్రాంతంలో ఉన్న వ్యాపారులు 70 శాతం వరకు గింజలు ఉడకబెట్టి పప్పు తీసి విక్రయిస్తున్నారు. గింజలను ఉడకబెట్టి పప్పు తయారు చేయడానికి సంబంధించిన యంత్రాలు కొనుగోలుకి రాయితీపై రుణాలు అందించాలని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ముడిపప్పు రావడంతో ఎక్కువ మంది వ్యాపారులు దీనిపై ఆధారపడి వ్యాపారం చేస్తున్నారు. ఫలితంగా ఒకప్పుడు దాదాపు 5 వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవించే ఈ పరిశ్రమ మీద ప్రస్తుతం రెండువేల మందికి మాత్రమే ఉపాధి పొందుతున్నారు. అంతే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పప్పు ఎటువంటి ఆంక్షలు లేకుండా రావడంతో అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ దుకాణాలకు పంపుతున్నారు.
అనుబంధ పరిశ్రమలకు అవకాశం
ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఈ పరిశ్రమ నుంచి ఆదాయం వస్తోంది. అయినా పరిశ్రమ అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. అంతే కాకుండా ఎటువంటి రాయితీలు, ప్రోత్సాహాకాలు కూడా ఇవ్వని పరిస్థితి. వ్యాపారుల క్లస్టర్గా ఏర్పడితే ప్రభుత్వపరంగా సాయం అందిస్తామని కొత్తగా జిల్లా ఏర్పడిన తరువాత పరిశ్రమల శాఖాధికారులు స్థానిక వ్యాపారులతో సమావేశాలు నిర్వహించారు. దీని కోసం కనీసం 20 ఎకరాల స్థలాన్ని వ్యాపారులే సమకూర్చుకోవాలని అధికారులు చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో స్థలానికి విపరీతమైన గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో అంత స్థలాన్ని కొనుగోలు చేయడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదన అటకెక్కింది. క్లస్టర్ ఏర్పడితే అనుబంధంగా పప్పు తయారీతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. వేల మందికి ఉపాధి లభిస్తుంది. కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసింది.
తోటల పెంపుపై దృష్టి ఏదీ?
ఉమ్మడి జిల్లాలో బాపట్ల జీడిమామిడి పరిశోధనా సంస్థ, ముత్తాయిపాలెం, ప్యార్లీ, ఈపూరుపాలెం, వేటపాలెం, కడవకుదురు, తెట్టు, నాయునిపల్లి, చినగంజాం, పెదగంజాం, ఈతముక్కల ప్రాంతాల్లో దాదాపు 20 వేల ఎకరాల్లో జీడితోటలు రెండు దశబ్దాల క్రితం వరకు ఉండేవి. స్థిరాస్తి వ్యాపారం రాకతో పలుప్రాంతాల్లో వీటిని తొలగించి ఇళ్ల స్థలాలుగా మార్చారు. స్థానికంగా వేరుసెనగ పంట ఆశాజనకంగా ఉండటంతో తోటలను తీసివేశారు. క్రమేపి వీటి విస్తీర్ణం తగ్గిపోతుందని గ్రహించిన గత ప్రభుత్వం ఉద్యానవనశాఖ ద్వారా వీటిని పెంచడానికి మొక్కలు, వాటిని నాటడానికి తీసిన గుంతలు, ఎరువులు, రెండేళ్ల పాటు సంరక్షించేందుకు రైతులకు రాయితీలు కూడా ఇచ్చింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఈ తోటల పెంపకం పెరిగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిస్థితి లేకపోవడంతో ఎక్కడ కూడా కొత్తగా తోటల పెంపకం అనేది లేకపోవడం గమనార్హం.
వేటపాలెంలో జీడిపప్పు కర్మాగారాలు: 10
దుకాణాలు: 33
నెలవారి పప్పు అమ్మకాలు: 50 వేల కిలోలు
ఆధారపడి జీవించే వారి సంఖ్య: 2 వేలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకుల వద్ద బారులుదీరిన పింఛనుదారులు
[ 03-05-2024]
వట్టి చెరుకూరు మండలంలోని గ్రామాల్లో బ్యాంకుల వద్ద లబ్ధిదారులు బారులుదీరారు. -
తెదేపా ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన
[ 03-05-2024]
మండలంలోని ఇంజనంపాడు, కమలమూడి, కాట్రపాడు, రొట్టె చెరుకూరు, లేములపాడు, అనంతపురం గ్రామాల్లో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే... -
కక్షగట్టి రప్పించారు.. కసితీరా వేధించారు..
[ 03-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని ఒకవైపు ప్రచారం చేయిస్తున్న పాలకులు ఆరు పదుల వయసు పైబడిన సామాజిక పింఛనుదారులను మాత్రం మండుటెండలో బజారుకీడ్చి వారిని ఇబ్బందుల పాల్జేశారు. -
మీతోనే ముప్పు.. మీవల్లే ముంపు!
[ 03-05-2024]
వారి బాగోగులను అనుక్షణం పట్టించుకోవాలి.అక్కడి ప్రకృతి, పర్యావరణంతోపాటు నదులు, వాగులు, వంకలు సహా పంట పొలాలను రక్షించు కోవాలి. -
నా వంతుగా.. మామకు మద్దతుగా..
[ 03-05-2024]
సినీ హీరో నిఖిల్ గురువారం చీరాలలో సందడి చేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎం కొండయ్యకు మద్దతుగా ఆయన పట్టణంలో ప్రచారం చేపట్టారు. -
బీసీ నాయకులకు జగన్ కుర్చీ కూడా వేయనివ్వరు
[ 03-05-2024]
బీసీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దగ్గరకు వెళితే కనీసం కుర్చీ కూడా వేయరు, ఎవరికి వేయాలో ఆయన కనుసైగలతో సూచిస్తారని మనమంతా విన్నాం, బీసీల పట్ల ఆయన చూపే గౌరవం తీరు ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తుందని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
పోలీసు.. నేత.. చెట్టపట్టాల్!
[ 03-05-2024]
అధికార వైకాపా నేతల కనుసన్నల్లోనే ఇప్పటికీ పోలీసు యంత్రాంగం జోగుతోంది. విధి నిర్వహణలో వారు చెప్పిందే పోలీసులకు వేదంగా ఉంటోంది. -
ఉద్యోగుల ఓట్లకు..గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు. -
క్షీణించిన శ్రీలక్ష్మి ఆరోగ్యం
[ 03-05-2024]
వైకాపా నాయకుల దౌర్జన్యాలు, కబ్జాలతో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీలక్ష్మి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు గురువారం ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం
[ 03-05-2024]
తెదేపా అధికారంలోకి రావడం ఖాయం. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలను కల్పించి తీరతాం’.. అని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి స్పష్టం చేశారు. -
అధికార పార్టీని చిత్తుగా ఓడించండి
[ 03-05-2024]
రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న ప్రభుత్వం మారాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ‘ఇండియా’ కూటమి అభ్యర్థులు జంగాల అజయ్కుమార్, జొన్నా శివశంకరరావు తరఫున మంగళగిరిలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
లోకేశ్ మంగళగిరి రూపురేఖలు మారుస్తారు
[ 03-05-2024]
గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన మంగళగిరి వైకాపా అభ్యర్థి తల్లి కాండ్రు కమల, మామ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గానికి ఏం చేశారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. -
ఆంధ్రాప్యారిస్ పేరుకు తగ్గట్లు అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
ఆంధ్రాప్యారిస్ను పేరుకు తగిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని, తమకు మద్దతు ఇవ్వాలని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు -
మహిళలే నిర్ణేతలు
[ 03-05-2024]
ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 22 తర్వాత జరిగిన చేర్పులు, మార్పులు అనంతరం 22,029 మంది ఓటర్లు పెరిగారు. -
ఉద్యోగుల ఓట్లకు.. గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు