అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు.
మృత్యుకుహరాలుగా మారిన క్వారీ గుంతలు
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. చిన్నగుంతే కదా అనుకుని దిగారు. అది చాలాలోతు ఉండి నలుగురి విద్యార్థులను బలి తీసుకుంది. ఉన్నత విద్య చదువుతున్న కుమారులు అకాలమృతితో వారి తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం.
దాచేపల్లి మండలం పొందుగల శివారు గ్రామం శ్రీనివాసపురంలో ఇద్దరు బాలురు రెండున్నర ఏళ్ల క్రితం స్థానికంగా ఉన్న క్వారీ గుంతలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయి ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలోనూ వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది.
న్యూస్టుడే, యడ్లపాడు, చిలకలూరిపేట గ్రామీణ
కొండలు.. గుట్టలు.. వాగులు.. వంకలు.. ఏవైనా వైకాపా నాయకుల అక్రమ దోపిడీకి విలవిల్లాడాయి. ఇసుక, మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తవ్వుకుని అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో అక్రమార్కులు ఎంతగా బరితెగించారో తవ్విన ప్రదేశాల్లో ఏర్పడిన గోతులు చూస్తే తెలుస్తోంది. వాటి వద్ద ఎలాంటి రక్షణ చర్యలు లేక ప్రమాదకరంగా మారాయి. గోతుల్లో నీరు నిలవడంతో సరదాగా ఈతకు అని దిగిన అమాయకుల ప్రాణాలు తీశాయి.
వైకాపా పాలనలో గ్రావెల్, ఇసుక మాఫియాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అసైన్డ్, కొండ, వాగు, పోరంబోకు భూముల్లో నిబంధనలకు విరుద్దంగా యంత్రాలతో తవ్వకాలు సాగించారు. దీంతో లోతైన గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. వాటి వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రాణాలు బలితీసుకున్నాయి. బోయపాలెం, యడ్లపాడు, కోటప్పకొండ, యడవల్లి, పిడుగురాళ్ల, వినుకొండ తదితర ప్రాంతాల్లో భారీఎత్తున మెటల్ క్వారీలు ఉన్నాయి. ఆయా క్వారీల్లో నిర్దిష్ట ప్రమాణాలు, నిబంధనలు పాటించకుండా లోతుగా తవ్వకాలు చేపట్టారు. వర్షాకాలంలో కురిసిన వానలకు వాటిల్లో నీరు నిలిచి పైకి సాధారణ గుంతల మాదిరిగా కనిపిస్తున్నాయి. యువకులు, విద్యార్థులు వేసవిలో ఈత కోసం వాటిలో దిగుతున్నారు. ఈ క్రమంలో లోతు అధికంగా ఉండడంతో మృత్యువాత పడుతున్నారు గత ఐదేళ్లలో జిల్లాలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
చిలకలూరిపేట ఓగేరు వాగులో అక్రమార్కులు బావి తవ్వి ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా వదిలేశారు. పట్టణంలోని శారదా పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి రెండేళ్ల కిత్రం ఆడుకోవటానికి స్థానిక ఓగేరు వాగు వద్దకు వెళ్లాడు. వాగులో బావి ఆనవాళ్లు కనిపించ లేదు. ఈత కొట్టడానికి వాగులో దిగడంతో లోతైన బావిలో మునిగి మృతి చెందాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు మృతితో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. కూలీపనులు చేసుకుని జీవిస్తున్న వారు కుమారుడి మరణాన్ని తట్టుకోలేక పోయారు.
యడ్లపాడు: సంగం గోపాలపురంలో అక్రమ మట్టి తవ్వకాలతో ఇలా..
రక్షణ చర్యలు శూన్యం
నిరుపయోగంగా ఉన్న క్వారీ గుంతలు, మట్టి తవ్వకాల వద్ద నిబంధనల ప్రకారం రక్షణ ఏర్పాట్లు తప్పనిసరి. ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రజలు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేయాలి. పశువులు దిగటానికి వీలు లేకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. అయితే నిబంధనలు ఎక్కడా అమలు కావటం లేదు. కనీసం నివాస ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలకు సమీపంలోని క్వారీ గుంతల వద్ద కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకుల వద్ద బారులుదీరిన పింఛనుదారులు
[ 03-05-2024]
వట్టి చెరుకూరు మండలంలోని గ్రామాల్లో బ్యాంకుల వద్ద లబ్ధిదారులు బారులుదీరారు. -
తెదేపా ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన
[ 03-05-2024]
మండలంలోని ఇంజనంపాడు, కమలమూడి, కాట్రపాడు, రొట్టె చెరుకూరు, లేములపాడు, అనంతపురం గ్రామాల్లో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే... -
కక్షగట్టి రప్పించారు.. కసితీరా వేధించారు..
[ 03-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని ఒకవైపు ప్రచారం చేయిస్తున్న పాలకులు ఆరు పదుల వయసు పైబడిన సామాజిక పింఛనుదారులను మాత్రం మండుటెండలో బజారుకీడ్చి వారిని ఇబ్బందుల పాల్జేశారు. -
మీతోనే ముప్పు.. మీవల్లే ముంపు!
[ 03-05-2024]
వారి బాగోగులను అనుక్షణం పట్టించుకోవాలి.అక్కడి ప్రకృతి, పర్యావరణంతోపాటు నదులు, వాగులు, వంకలు సహా పంట పొలాలను రక్షించు కోవాలి. -
నా వంతుగా.. మామకు మద్దతుగా..
[ 03-05-2024]
సినీ హీరో నిఖిల్ గురువారం చీరాలలో సందడి చేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎం కొండయ్యకు మద్దతుగా ఆయన పట్టణంలో ప్రచారం చేపట్టారు. -
బీసీ నాయకులకు జగన్ కుర్చీ కూడా వేయనివ్వరు
[ 03-05-2024]
బీసీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దగ్గరకు వెళితే కనీసం కుర్చీ కూడా వేయరు, ఎవరికి వేయాలో ఆయన కనుసైగలతో సూచిస్తారని మనమంతా విన్నాం, బీసీల పట్ల ఆయన చూపే గౌరవం తీరు ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తుందని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
పోలీసు.. నేత.. చెట్టపట్టాల్!
[ 03-05-2024]
అధికార వైకాపా నేతల కనుసన్నల్లోనే ఇప్పటికీ పోలీసు యంత్రాంగం జోగుతోంది. విధి నిర్వహణలో వారు చెప్పిందే పోలీసులకు వేదంగా ఉంటోంది. -
ఉద్యోగుల ఓట్లకు..గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు. -
క్షీణించిన శ్రీలక్ష్మి ఆరోగ్యం
[ 03-05-2024]
వైకాపా నాయకుల దౌర్జన్యాలు, కబ్జాలతో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీలక్ష్మి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు గురువారం ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం
[ 03-05-2024]
తెదేపా అధికారంలోకి రావడం ఖాయం. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలను కల్పించి తీరతాం’.. అని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి స్పష్టం చేశారు. -
అధికార పార్టీని చిత్తుగా ఓడించండి
[ 03-05-2024]
రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న ప్రభుత్వం మారాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ‘ఇండియా’ కూటమి అభ్యర్థులు జంగాల అజయ్కుమార్, జొన్నా శివశంకరరావు తరఫున మంగళగిరిలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
లోకేశ్ మంగళగిరి రూపురేఖలు మారుస్తారు
[ 03-05-2024]
గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన మంగళగిరి వైకాపా అభ్యర్థి తల్లి కాండ్రు కమల, మామ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గానికి ఏం చేశారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. -
ఆంధ్రాప్యారిస్ పేరుకు తగ్గట్లు అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
ఆంధ్రాప్యారిస్ను పేరుకు తగిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని, తమకు మద్దతు ఇవ్వాలని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు -
మహిళలే నిర్ణేతలు
[ 03-05-2024]
ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 22 తర్వాత జరిగిన చేర్పులు, మార్పులు అనంతరం 22,029 మంది ఓటర్లు పెరిగారు. -
ఉద్యోగుల ఓట్లకు.. గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!