ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
ఎర్రబాలెంలో మాట్లాడుతున్న నారా లోకేశ్
ఎర్రబాలెం(మంగళగిరి), న్యూస్టుడే: ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి ఆయన ‘రచ్చబండ’ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి కోసం పోరాడిన మహిళలను బూటు కాళ్లతో తన్నారని, అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. పరదాల మాటున జగన్ సచివాలయానికి వెళుతున్నారని, అమరావతి పనులు కొనసాగించి ఉంటే ఆ దుస్థితి తలెత్తేదా అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని సీఎం రాజధాని రైతులను ఓట్లు అడుగుతారంటూ నిలదీశారు. అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారన్నారు. కేవలం అసంపూర్తిగా నిర్మించిన అయిదు శాతం రాజధాని పనులు పూర్తిచేసి ఉంటే అమరావతిలో లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. అమరావతి ప్రాంతంలో ఇసుక, కంకర, మట్టితోసహా దోచుకెళ్లారన్నారు. పెద్ద దొంగను స్థానికంగా ఉండే చిన్న దొంగలు ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. కౌలు రైతులు, రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను వంద రోజుల్లో పరిష్కరించి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కౌలు వెంటనే చెల్లించే చర్యలు చేపడతానన్నారు. రాజధాని పనులు కొనసాగించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తానన్నారు. పేదలకు పక్కాఇళ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.
హాజరైన జనం
కక్షగట్టి పింఛన్ తీసేశారు..
రాజధానికి భూములిచ్చామని కక్ష కట్టి పెన్షన్లు తీసేశారని ఎర్రబాలెం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. అసైన్డ్ భూముల్లో నివసించే వారికి పట్టాలివ్వాలని కోరారు. ల్యాండ్ పూలింగ్కు సహకరించిన రైతుల పిల్లలకు ఉచిత విద్య, ఉద్యోగాలు కల్పించాలని కోరారు. గ్రామస్తుల సమస్యలపై స్పందించిన లోకేశ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఎలాంటి కోత లేకుండా అందరికీ పింఛన్లు ఇస్తామన్నారు. కొండ పోరంబోకు, ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి ఉన్నచోటనే పట్టాలిప్పిస్తామని భరోసా ఇచ్చారు.
క్రైస్తవులను గుండెల్లో పెట్టుకుంటాం
కూటమి ప్రభుత్వం వస్తే క్రైస్తవులను ఇబ్బంది పెడుతుందని వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని నారా లోకేశ్ సూచించారు. మంగళగిరి మండలం చిన్నకాకాని ‘రచ్చబండ’లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం భాజపాతో పొత్తుపెట్టుకున్నామని, క్రైస్తవ సోదరులను గుండెల్లో పెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. 2014లో భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఎటువంటి సమస్యలు తలెత్తలేదన్నారు. క్రిస్మస్ కానుకలు, పాస్టర్లకు గౌరవ వేతనం, చర్చిల అభివృద్ధికి నిధులు ఇచ్చామన్నారు. తెదేపాపై విషం చిమ్ముతున్న కాపు ముసుగు నేతలు రిజర్వేషన్లపై జగన్ను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక గతంలో తెదేపా ఇచ్చిన నిధుల్లో పది శాతం కూడా ఆ సామాజికవర్గానికి ఇవ్వలేదన్నారు. మరో 40 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటానని, పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం తనకు లేదన్నారు. అధికారంలో లేకపోయినా సొంత డబ్బుతో నియోజకవర్గంలో 29 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
[ 03-05-2024]
కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. -
పేదల ప్రాణాలతో రాజకీయం చేస్తారా?: సీఎస్కు చంద్రబాబు లేఖ
[ 03-05-2024]
పింఛన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. -
బ్యాంకుల వద్ద బారులుదీరిన పింఛనుదారులు
[ 03-05-2024]
వట్టి చెరుకూరు మండలంలోని గ్రామాల్లో బ్యాంకుల వద్ద లబ్ధిదారులు బారులుదీరారు. -
తెదేపా ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన
[ 03-05-2024]
మండలంలోని ఇంజనంపాడు, కోవెలమూడి, కాట్రపాడు, వట్టి చెరుకూరు, లేమల్లెపాడు, అనంతవరప్పాడు గ్రామాల్లో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే... -
కక్షగట్టి రప్పించారు.. కసితీరా వేధించారు..
[ 03-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని ఒకవైపు ప్రచారం చేయిస్తున్న పాలకులు ఆరు పదుల వయసు పైబడిన సామాజిక పింఛనుదారులను మాత్రం మండుటెండలో బజారుకీడ్చి వారిని ఇబ్బందుల పాల్జేశారు. -
మీతోనే ముప్పు.. మీవల్లే ముంపు!
[ 03-05-2024]
వారి బాగోగులను అనుక్షణం పట్టించుకోవాలి.అక్కడి ప్రకృతి, పర్యావరణంతోపాటు నదులు, వాగులు, వంకలు సహా పంట పొలాలను రక్షించు కోవాలి. -
నా వంతుగా.. మామకు మద్దతుగా..
[ 03-05-2024]
సినీ హీరో నిఖిల్ గురువారం చీరాలలో సందడి చేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎం కొండయ్యకు మద్దతుగా ఆయన పట్టణంలో ప్రచారం చేపట్టారు. -
బీసీ నాయకులకు జగన్ కుర్చీ కూడా వేయనివ్వరు
[ 03-05-2024]
బీసీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దగ్గరకు వెళితే కనీసం కుర్చీ కూడా వేయరు, ఎవరికి వేయాలో ఆయన కనుసైగలతో సూచిస్తారని మనమంతా విన్నాం, బీసీల పట్ల ఆయన చూపే గౌరవం తీరు ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తుందని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
పోలీసు.. నేత.. చెట్టపట్టాల్!
[ 03-05-2024]
అధికార వైకాపా నేతల కనుసన్నల్లోనే ఇప్పటికీ పోలీసు యంత్రాంగం జోగుతోంది. విధి నిర్వహణలో వారు చెప్పిందే పోలీసులకు వేదంగా ఉంటోంది. -
ఉద్యోగుల ఓట్లకు..గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు. -
క్షీణించిన శ్రీలక్ష్మి ఆరోగ్యం
[ 03-05-2024]
వైకాపా నాయకుల దౌర్జన్యాలు, కబ్జాలతో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీలక్ష్మి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు గురువారం ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం
[ 03-05-2024]
తెదేపా అధికారంలోకి రావడం ఖాయం. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలను కల్పించి తీరతాం’.. అని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి స్పష్టం చేశారు. -
అధికార పార్టీని చిత్తుగా ఓడించండి
[ 03-05-2024]
రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న ప్రభుత్వం మారాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ‘ఇండియా’ కూటమి అభ్యర్థులు జంగాల అజయ్కుమార్, జొన్నా శివశంకరరావు తరఫున మంగళగిరిలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
లోకేశ్ మంగళగిరి రూపురేఖలు మారుస్తారు
[ 03-05-2024]
గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన మంగళగిరి వైకాపా అభ్యర్థి తల్లి కాండ్రు కమల, మామ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గానికి ఏం చేశారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. -
ఆంధ్రాప్యారిస్ పేరుకు తగ్గట్లు అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
ఆంధ్రాప్యారిస్ను పేరుకు తగిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని, తమకు మద్దతు ఇవ్వాలని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు -
మహిళలే నిర్ణేతలు
[ 03-05-2024]
ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 22 తర్వాత జరిగిన చేర్పులు, మార్పులు అనంతరం 22,029 మంది ఓటర్లు పెరిగారు. -
ఉద్యోగుల ఓట్లకు.. గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోల్కతా విజయం.. ముంబయికి వరుసగా నాలుగో ఓటమి
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు