నా ఎస్సీలంటూనే.. నిలువునా మోసం
ఎక్కడ మాట్లాడినా.. నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అంటూ ఎక్కడ లేని ప్రేమను మాటల్లో ఒలకబోసే జగన్.. వాస్తవంలోకి వచ్చేసరికి వారికి రిక్తహస్తాలే చూపారు.
వైకాపా హయాంలో పథకాలు.. స్వయం ఉపాధి రుణాలు నిలిపేసిన వైనం
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే
ఎక్కడ మాట్లాడినా.. నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అంటూ ఎక్కడ లేని ప్రేమను మాటల్లో ఒలకబోసే జగన్.. వాస్తవంలోకి వచ్చేసరికి వారికి రిక్తహస్తాలే చూపారు. వైకాపా పాలనలోని అయిదేళ్లూ ఎస్సీ అభివృద్ధి పథకాలు విస్మరించడం, స్వయం ఉపాధి రుణాలు నిలిపివేయడమే దీనికి నిదర్శనం. దేశంలో సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీలను అభివృద్ధి స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంటాయి. గత అయిదేళ్లలో నిరుపేద ఎస్సీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలను నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకాలను సైతం అమలు చేయకపోవడంతో ఎస్సీ వర్గాల అభివృద్ధికి శరాఘాతంగా మారింది.
గత తెదేపా హయాంలో..
గత తెదేపా ప్రభుత్వ హయాం 2014-19లో ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకాల ద్వారా 775 మందికి రూ.33,41,27,089 రుణాలు పంపిణీ చేశారు. 173 మందికి రూ.10 లక్షల విలువ గల నాలుగు చక్రాల వాహనాలు ఇవ్వడంతో యజమానులుగా మారారు. రుణాలు పొందిన వారిలో ఎక్కువ మంది స్వయం ఉపాధి యూనిట్లతో జీవోనోపాధి కల్పించుకుని కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నారు. రవాణా విభాగంలో రుణాలు పొందిన వారు నాలుగు చక్రాల వాహనాలను నడుపుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక..
2019 సాధారణ ఎన్నికల్లో వైకాపా గెలుపొంది ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గత ప్రభుత్వాలు అమలు చేసిన స్వయం ఉపాధి పథకాల రుణాలు నిలిపివేసింది. దాంతో నిరుపేద ఎస్సీలకు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నయాపైసా కూడా రుణాలు విడుదల చేయని పరిస్థితి. 2019-24 మధ్య కాలంలో ఎస్సీలకు ఎలాంటి రుణాలు మంజూరు చేయలేదు. కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించకపోవడం గమనార్హం.
కార్పొరేషన్ విభజన.. నిధులు శూన్యం
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ని మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం జిల్లా స్థాయిలో విభజన చేయలేదు. నిధులు కూడా కేటాయించకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్ నామమాత్రంగా మిగిలిపోయింది. సిబ్బంది తెదేపా ప్రభుత్వం హయాంలో పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి బకాయిలను లబ్ధిదారుల నుంచి రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సిబ్బందికి కూడా మూడు, నాలుగు నెలలకు జీతాలు విడుదల చేస్తుండటంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం
ఆసరా లేకుండా చేశారు
షెడ్యూల్డ్ కులాల్లో 59 కులాల ప్రజలున్నారు. ప్రధానంగా మాల, మాదిగలతో పాటు ఉప కులాల ప్రజలు సంచార జీవనం సాగిస్తూ అభివృద్ధికి దూరంగా ఉన్నారు. వారి అభివృద్ధికి పాటు పడాల్సిన ప్రభుత్వం పథకాలను నిలిపివేయడంతో జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయి. స్వయం ఉపాధి పథకంలో కనీసం రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు పొందే అవకాశముంది. ఆ రుణాలతో చేతి వృత్తులు, సూక్ష్మ, లఘు పరిశ్రమలను స్థాపించి ఉపాధి పొందడంతో పాటు మరో పది మంది నిరుద్యోగులకు ఉపాధి చూపించేందుకు అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకం ద్వారా రుణాలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గత అయిదేళ్లలో ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో రుణాలందని పరిస్థితి. దీనివల్ల రెల్లి కులానికి చెందిన వారు పారిశుద్ధ్య కార్మికులుగా.. చర్మకారులు పట్టణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన చెప్పులు కుట్టుకుంటూనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొందరు కూలి పనులకు వెళుతున్నారు. మాల సామాజిక వర్గం వారికి పొలం పనులే దిక్కయ్యాయి. వైకాపా ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాల స్థానంలో ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను ఆయా శాఖల ద్వారా నిధులు సమకూర్చి నవరత్నాల కార్యక్రమంలో ఇతర వర్గాల వారికీ ఖర్చు చేస్తుండటంతో ఎస్సీలు నష్టపోయారు.
ఉప ప్రణాళిక నిర్వచనమే మార్చారు
ఎస్సీల అభివృద్ధికి కేటాయించిన ఉప ప్రణాళిక నిధులు అభివృద్ధి పనులకు కేటాయించాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పంపిణీ చేయకపోవడంతో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి లేకుండా పోయింది. ప్రభుత్వం అమ్మఒడి, నవరత్నాల కార్యక్రమాలకు ఖర్చు చేసి వాటినే రూ.కోట్లలో చూపుతోంది. దీనివల్ల ఎస్సీల అభివృద్ధి కుంటుపడింది. ఎస్సీలను ప్రభుత్వం మోసం చేసింది.
కె.కృష్ణమోహన్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిర్యానీ బిల్లు ఎక్కువైందంటూ జవాన్ల వీరంగం
[ 15-05-2024]
ఎన్నికల విధులకు హాజరై తిరుగు ప్రయాణంలో విశ్రాంతి కోసం ఆగిన భద్రతా సిబ్బంది భోజనం కోసం వెళ్లి హోటల్ను ధ్వంసం చేశారు. ఈ ఘటన మంగళవారం బాపట్ల జిల్లాలోని చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లిలో చోటు చేసుకుంది. -
ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు
[ 15-05-2024]
బాపట్ల జిల్లా పడమర పిన్నిబోయినవారిపాలెంలో వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు. సోమవారం పోలింగ్ సందర్భంగా తెదేపా నేత, మాజీ సర్పంచి నర్రా ఏడుకొండలుపై వైకాపా మూకలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో గ్రామంలో నలుగురు పోలీసు సిబ్బందితో నామమాత్రంగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
అదే జోష్.. స్ఫూర్తి భేష్!
[ 15-05-2024]
ప్రజాస్వామ్య పరిరక్షణలో తమ వంతు బాధ్యతను ఓటర్లు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా తమ ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రయోగించారు. -
కాయ్ రాజా కాయ్!.. కూటమిదే అధికారమని జోరుగా పందేలు
[ 15-05-2024]
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలపై ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. నేతలు మొదలుకుని మిర్చి, కాటన్, పొగాకు వ్యాపారులు, గుత్తేదారులు, స్థిరాస్తి వ్యాపారులు, ఉద్యోగవర్గాలు ఇలా ఈసారి పందేలు కాస్తున్న వారిలో ఉండడం గమనార్హం. రాజకీయ చైతన్యానికి మారుపేరు అయిన గుంటూరులో పందేలు బాగా ఊపందుకున్నాయి. -
కూటమిలో ఉత్సాహం
[ 15-05-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి తరఫున పోటీ చేసిన తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్లో జోష్ నెలకొంది. ఓటర్లు పెద్దఎత్తున పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. -
పిన్నెల్లి సోదరుల అరాచకాలు అడ్డుకోవడంలో ఎస్పీ విఫలం
[ 15-05-2024]
మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచకాలను అడ్డుకోవడంలో పల్నాడు ఎస్పీ పూర్తిగా విఫలమయ్యారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగడాలకు అడ్డుకట్ట వేసి దాడులు, ఘర్షణలు జరగకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని కోరినా స్పందించలేదని మండిపడ్డారు. -
ఓటేసిన వారు 82.33%
[ 15-05-2024]
తెదేపా, వైకాపా అభ్యర్థులు సోమవారం జరిగిన పోలింగ్ సరళిపై పోలింగ్ కేంద్రాల వారీగా విశ్లేషణ చేసుకున్నారు. జిల్లాలో బాపట్ల లోక్సభతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంటామని తెదేపా కూటమి నేతలు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
సిఫార్సులతో వచ్చిన సీఐలు, ఎస్సైలు విధులు మర్చిపోయారు
[ 15-05-2024]
సిఫార్సుతో వచ్చిన సీఐలు, ఎస్సైలు విధులను మర్చిపోయారని, ఇప్పుడు ఎన్నికల సంఘ పరిధిలో ఉన్నామని గుర్తెరగకుండా ఉన్నారని కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. -
ఈవీఎంల అప్పగింతకు 12 గంటలా?
[ 15-05-2024]
సార్వత్రిక పోలింగ్ ముగిసిన తర్వాత సామగ్రి అప్పగించేందుకు సిబ్బంది 12 గంటల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి నరసరావుపేటలో నెలకొంది. తాగేందుకు నీరు లేదు. వేచి ఉండేందుకు వసతి లేదు. ఒకవైపు వాహనాల పార్కింగ్ సౌకర్యం లేక సింగిల్ రోడ్డు కావడంతో సమస్య తీవ్రత పెంచింది. -
పీవో తప్పిదం.. అంతా గందరగోళం
[ 15-05-2024]
మంగళగిరి సీకె జూనియర్ కళాశాలలో పోలింగ్ నిర్వహణలో తలెత్తిన సమస్యతో ఈవీఎంల తరలింపులో తీవ్రజాప్యం జరిగింది. పోలింగ్ కేంద్రం 178లో ప్రీసైడింగ్ అధికారి తప్పిదం కారణంగా అదే భవనంలో ఉన్న ఎనిమిది పోలింగ్ కేంద్రాల సిబ్బందికి గంటల తరబడి సమయం వృథా అయ్యింది. -
వల్లాపల్లిలో వైకాపా నేతల దౌర్జన్యం
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేసినందుకు ఓ సామాజిక వర్గానికి చెందిన వారిపై మండలంలోని వల్లాపల్లిలో మంగళవారం సాయంత్రం వైకాపా నాయకులు దౌర్జన్యానికి దిగారు. -
ఏ క్షణాన .. ఏం జరుగునో?
[ 15-05-2024]
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులతో కలిసి పది వాహనాలతో నియోజకవర్గంలో తిరుగుతూ హల్చల్ చేశారు. అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఐదు వాహనాలు, పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాల కాన్వాయ్తో అనుచరులతో వెళ్లి అలజడి సృష్టించారు. -
అందని అత్యవసర వైద్యం
[ 15-05-2024]
గతేడాది ఆగస్టు 3న 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ చిలకలూరిపేటలో రూ.9.45 కోట్లతో ఆసుపత్రి చుట్టూ రిటైనింగ్ వాల్, ప్రహరీ, సిమెంటు రహదారులు ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 15-05-2024]
తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో యువకుడు సోమవారం అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఇరువర్గాల ఘర్షణ
[ 15-05-2024]
గుంటూరు కృష్ణబాబుకాలనీలో రెండు వర్గాల మధ్య గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాలనీకి చెందిన ప్రభు, మున్నాలకు కొంతకాలంగా పరిచయం ఉన్నది. -
రాష్ట్ర పీఆర్ సంఘ నాయకుడి సస్పెన్షన్
[ 15-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓ రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే అభియోగంపై రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి కె.మోహనరావుపై జిల్లా అధికారులు సస్పెండ్ వేటు వేశారు. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు : తెదేపా
[ 15-05-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు ఓటమి భయంతోనే దాడులకు పాల్పడ్డారని తెదేపా నేతలు విమర్శించారు. తెదేపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవిందబాబు, భాష్యం ప్రవీణ్లతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
ఆ ఘటన వెనుక కుట్ర, కుతంత్రం బహిర్గతం చేస్తా
[ 15-05-2024]
తెనాలి ఐతానగర్లోని ఎర్రబడి (మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల) పోలింగ్ బూత్లో ఈనెల 13న జరిగిన ఘటన వెనుక కుట్ర, కుతంత్రం ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. -
పెద్దవాళ్లకూ బీసీజీ టీకా
[ 15-05-2024]
జిల్లా వ్యాప్తంగా క్షయ నివారణ కోసం పెద్దవాళ్లకు బీసీజీ టీకా ఇచ్చే కార్యక్రమం ఈనెల 16న జిల్లా వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
-
ప్రలోభ పెట్టినా ‘చెవి’లో పువ్వే!.. సహకరించని సొంత పార్టీ నేతలు
-
అమ్మకు మందులు తెచ్చేందుకు వెళ్లి అనంతలోకాలకు..
-
కదిలొచ్చిన ఓటు.. కలిసొచ్చేది ఎటు!
-
బిర్యానీ బిల్లు ఎక్కువైందంటూ జవాన్ల వీరంగం
-
కాయ్ రాజా కాయ్!.. కూటమిదే అధికారమని జోరుగా పందేలు