ప్రశ్నిస్తే పగ.. స్వేచ్ఛకు సెగ
ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడడానికీ వీల్లేదు. వారి అభిప్రాయాలను బహిరంగంగా పంచుకోవడాన్ని సహించరు. అయిదేళ్ల జగన్ పాలన అక్షరాలా ఇలాగే సాగింది.
సామాజిక మాధ్యమాల్లో పోస్టులపైనా కన్నెర్ర
అర్ధరాత్రి అరెస్టులతో సామాన్యులకు వేధింపులు
అయిదేళ్ల జగన్ పాలనలో దారుణాలు ఎన్నో
ఈనాడు, అమరావతి - న్యూస్టుడే, నెహ్రూనగర్, పెదకాకాని, పట్టాభిపురం
ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడడానికీ వీల్లేదు. వారి అభిప్రాయాలను బహిరంగంగా పంచుకోవడాన్ని సహించరు. అయిదేళ్ల జగన్ పాలన అక్షరాలా ఇలాగే సాగింది. వైకాపా పాలన, ప్రభుత్వ నిర్ణయాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఫార్వార్డ్ చేసిన వారిని వెతికి వెంటాడి వేధించింది. సీఐడీని పావుగా వినియోగించుకుంది. అర్ధరాత్రి వేళ వారి ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేసింది. యువకుల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదిలిపెట్టలేదు. ఉమ్మడి గుంటూరులోనే సీఐడీ ప్రాంతీయ కార్యాలయం మొదలుకుని ఆయా స్టేషన్ల పరిధిలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడమే దీనికి నిదర్శనం.
నిరసన తెలిపినా నేరమే..
ప్రభుత్వ పాలన, నిర్ణయాలు, విధానాలపై ఆందోళనలు, ధర్నాలు చేసిన పాపానికి ఉద్యోగులపైనా కేసులు పెట్టారు. ప్రశ్నించడమే పాపం అనేలా పోలీసులు ప్రధానంగా విపక్షాల నాయకులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల నోరు మూయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలకు పిలుపునిస్తే వాటిల్లో పాల్గొనకూడదంటూ విపక్ష నేతల ఇళ్ల ముంగిటకు వేకువజామునే పోలీసుల్ని పంపారు. వారు రోడ్డెక్కకుండా అడ్డుకున్నారు. పోలీసులు గోడలు దూకి నేతల ఇళ్లల్లోకి ప్రవేశించి మరీ భయభ్రాంతులకు గురిచేశారు.
వేతనాల పెంపు కోరితే ఆశా కార్యకర్తలను ఈడ్చేస్తూ.. (పాతచిత్రం)
ప్రజాస్వామ్యంలో నియంతలా..
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజాప్రతినిధులు సేవకులు మాత్రమే. పాలనలోని లోపాలను విమర్శించడం.. ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం ప్రజల ప్రాథమిక హక్కు. కానీ అధికార పీఠమెక్కిన జగన్కు ప్రజాస్వామ్యంపై కానీ, ప్రాథమిక హక్కులపైగానీ విశ్వాసం లేదనేలా అయిదేళ్ల పాటు వ్యవహరించారు. అధినేతను అనుసరించే అమాత్యులు, ప్రజాప్రతినిధులూ అలాగే వ్యవహరించారు. పోలీసులను తమ దారికి తెచ్చుకున్నారు. ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం చూస్తే జగన్ పాలనలో పోలీసులు ఎంత గుడ్డిగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.
2023 అక్టోబర్ 3
పార్టీ మారలేదని 32 కేసులు పెట్టారు: గణేష్ బాబు, విద్యానగర్
అధికార పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అనకాపల్లిలో రాత్రివేళ అరెస్టు చేసి కక్ష సాధించారు. వేకువజాము 3-30గంటలకు గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్కు తీసుకొచ్చారు. ఆయనకు మందులు ఇవ్వడానికి వచ్చిన కుమారుడిని సైతం కలవనీయలేదు.
- మాది అమరావతి మండలం లింగాపురం. వైకాపాలో చేరాలని ఒత్తిడి చేశారు. మేము ఒప్పుకోలేదు. మాపై కక్షగట్టిన పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, సోదరుడు బాబు, కుమారుడు కల్యాణ్ పోలీసులపై ఒత్తిడి చేసి తప్పుడు కేసులు పెట్టారు. అయినా మేము భయపడలేదు. నాతో సహా ఆరుగురిపై రౌడీషీట్లు తెరిచారు. ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలీస్స్టేషన్కు పిలిపించి వేధించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదని అడ్డుకున్నారు. ఓటు హక్కు కూడా వినియోగించుకోకుండా చేశారు. మహిళలను కూడా ఇబ్బందులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తే వెంటనే మళ్లీ కేసు పెట్టేవారు. ఏ తప్పు చేయకపోయినా 22 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. గ్రామంలో నివసించే పరిస్థితి లేకపోవడంతో గుంటూరు వచ్చి పిల్లల్ని చదివించుకుంటున్నాం.
ఆమె వయసుకూ గౌరవం ఇవ్వలేదు..
ఆమె పేరు రంగనాయకమ్మ. శంకర్ విలాస్ హోటల్ అధినేత్రి. వయసులో చాలా పెద్దావిడ. ఆమెకు సైతం సర్కారీ వేధింపులు తప్పలేదు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో బాధితుల ఇబ్బందులపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ పోస్టును చూసి చలించి ఆమె ఫార్వార్డ్ చేశారు. అలా చేయడమే పెద్ద నేరం అన్నట్లు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని గంటల తరబడి సీఐడీ కార్యాలయంలో విచారిÅంచారు.
బీసీ నేత ఫిర్యాదుతో రైతులపై అట్రాసిటీ కేసు..
పెదకాకాని మండలం తక్కెళ్లపాడుకి చెందిన మేరిగ సుబ్బారావు గతంలో బీసీ కుల ధ్రువీకరణ పత్రం పొంది సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారు. 1995 నుంచి 2000 వరకు పదవిలో కొనసాగారు. ప్రస్తుతం వైకాపా నాయకుడిగా ఉన్నారు. ఇదే గ్రామంలోని సహకార పరపతి సంఘం ఛైర్మన్గా పని చేస్తున్నారు. నిధులు దుర్వినియోగం చేసి పొలాలకు వెళ్లే రోడ్డులో తన కార్యాలయ ప్రహరీ నిర్మించారు. దీనిపై గతేడాది మార్చి 25న సహకార పరపతి సంఘం ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులైన రైతులు నిలదీశారు. విచారణ జరిపించాలని గతేడాది ఏప్రిల్ 3న రైతులు లింగయ్య, వేణు, మల్లేశ్వరరావు, లక్ష్మయ్యలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే బీసీ అయిన ఛైర్మన్ ఫిర్యాదు మేరకు పెదకాకాని సీఐ బండారు సురేష్బాబు రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం గమనార్హం. వైకాపా ఎమ్మెల్యే రోశయ్య ఆదేశాలతోనే పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
2023 డిసెంబరు 14
ఆస్పత్రిలో నౌషాద్ను పరామర్శిస్తున్న శాసన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్
ఆయన పేరు నౌషాద్. గుంటూరు నివాసి. ఆటోమొబైల్ విడిభాగాల దుకాణం ఉంది. ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు సన్నీ అతని వద్ద నుంచి రూ.25లక్షలు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా వేధించాడు. దీంతో నౌషాద్ గత్యంతరం లేక పోలీసు స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీని తర్వాత సన్నీ నుంచి వేధింపులు తీవ్రమవడంతో నౌషాద్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
2024 జనవరి 23
ఆమె గుంటూరు తూర్పు వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా ఇంట్లో పనిమనిషి. ఎమ్మెల్యే నివాసం ఉండే మంగళదాస్నగర్లో ఏర్పాటు చేసిన తెదేపా ఫ్లెక్సీలో ఆమె కుమారుడు మన్సూర్ ఫొటో ఉండడాన్ని ముస్తఫా కుమార్తె నూరిఫాతిమా జీర్ణించుకోలేకపోయారు. మన్సూర్ తెదేపా కార్యకర్తలతో కలిసి తిరగడంపైనా రగిలిపోయారు. దీంతో మన్సూర్ తల్లిని ఇంటికి పిలిపించుకుని ఆమెపై చోరీ కేసు పెట్టారు. ఆమెను పోలీసులతో కొట్టించారు. బాధితులు మీడియా ముందుకు వచ్చి న్యాయం చేయాలని వేడుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంతిభద్రతలు పునరుద్ధరణపై ఈసీ, పోలీసులు దృష్టిపెట్టాలి: చంద్రబాబు
[ 14-05-2024]
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైకాపా రౌడీలు దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. -
నరసరావుపేటలో అనుమానాస్పద రీతిలో యువకుడి మృతి!
[ 14-05-2024]
పల్నాడు జిల్లా నరసరావుపేటలో యువకుడు అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. మృతుడిని షేక్ పెద్దఖాసింగా గుర్తించారు. -
పట్టు వీడలే.. ఓటు వదల్లే..
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లు పోటెత్తారు. ఓటింగ్ ప్రక్రియ తీవ్ర జాప్యం కావడంతో వారు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. ఒకవైపు సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు మొరాయించడం, నేతల మధ్య వాగ్వాదాల నియంత్రణకు తగిన భద్రతా సిబ్బంది లేకపోవడం, మరోవైపు వర్షంతో ఓటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. -
పశ్చిమలో యుద్ధ వాతావరణం
[ 14-05-2024]
పోలింగ్ సందర్భంగా గుంటూరు పశ్చిమలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీకి కంచు కోటలుగా ఉన్న డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల వద్దకు మంత్రి విడదల రజిని వైకాపా కార్యకర్తలను వెంటబెట్టుకుని వచ్చి అలజడి రేపారు. -
వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలన
[ 14-05-2024]
జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రత్యేక సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా, జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, శిక్షణ కలెక్టరు పవార్ స్వప్నిల్ జగన్నాథ్తో కలిసి సోమవారం పరిశీలించారు. -
ప్రముఖులు ఓటేశారిలా..
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఎంపీలు, మాజీ ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
వసతులు లేక.. వృద్ధులు విలవిల..
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కనీసం కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
బాధితుడు సుధాకర్కు పరామర్శలు
[ 14-05-2024]
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్ను సోమవారం తెనాలి రెండో పట్టణ పోలీస్స్టేషన్లో మధ్యాహ్నం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరామర్శించారు. -
మంత్రి, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనలు అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేత, మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు కోరారు. -
దొంగ ఓట్లు వేయించిన మాజీ వాలంటీర్లు
[ 14-05-2024]
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లలో రాజీనామా చేసిన మాజీ వాలంటీర్లు వైకాపా సానుభూతిపరులుగా మారి ఆ పార్టీకు అనుకూలంగా దొంగ ఓట్లు వేయించటమే లక్ష్యంగా పని చేశారు. -
మాక్ పోలింగ్ ఓట్లు తొలగించలేదు
[ 14-05-2024]
విధుల్లో నిర్లక్ష్యం కారణంగా మాక్ పోలింగ్ ఓట్లను సాధారణ ఓట్లతో కలిపిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని 64వ పోలింగ్ కేంద్రంలో 1,143 ఓట్లు ఉన్నాయి. -
బందోబస్తు పరిశీలన
[ 14-05-2024]
జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును ఎస్పీ తుషార్ దూడి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సుమారు 4 వేల మంది బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సిరా చుక్కకు.. నెత్తుటి మరక
[ 14-05-2024]
పోలింగ్ రోజు పల్నాడు రక్తమోడింది. తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మాచర్లలో పోలింగ్ సందర్భంగా వైకాపా అరాచకం సృష్టించింది. ఉదయం మొదలు మధ్యాహ్నం 3 గంటల వరకూ పిన్నెల్లిని హౌస్ అరెస్టు చేసే వరకూ నియోజకవర్గంలో ఎక్కడోచోట దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. -
కసిగా ఓటెత్తారు!
[ 14-05-2024]
జిల్లాలో వాతావరణం చల్లగా మారడంతో సోమవారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు అన్ని పోలింగ్ కేంద్రాలకు మునుపెన్నడూ లేని రీతిలో ఓటర్లు వరుస కట్టడం ఆశ్చర్యకరంగా అనిపించిందని పలువురు పోలింగ్ అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం. -
పోలీసులు చేతులెత్తేశారు
[ 14-05-2024]
ఎన్నికలకు సంబంధించి శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు చేతులెత్తేశారని కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఆయన మాట్లాడారు. -
ఎండనక.. వాననక..రేయనక.. ఓటెత్తారు
[ 14-05-2024]
మండుటెండలో భరించలేని ఉక్కపోత.. అంతలోనే పిడుగులతో కూడిన వర్షం.. రాత్రి పది గంటల వరకు వరుసలో నిల్చొని ఓటుహక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద జాతరను తలపించింది.
తాజా వార్తలు (Latest News)
-
అదే ఐపీఎల్ను మార్చేసింది..: రవిశాస్త్రి
-
జాబ్ మార్కెట్ పైకి ఏఐ ‘సునామీ’.. IMF చీఫ్ వ్యాఖ్యలు!
-
చైనాకు చెక్ పెట్టేందుకు ‘గ్రేట్షార్క్’, ‘మాంట రే’ సిద్ధం..!
-
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
-
మూడో రోజూ లాభాల్లో సూచీలు.. 22,200 ఎగువకు నిఫ్టీ
-
టాటా ప్లేతో అమెజాన్ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్ వీడియో