logo

క్రీడల్లో సత్తా చాటాలి

క్రీడల్లో సత్తా చాటాలని గవర్నర్‌ తమిళిసై యువతకు సూచించారు. ఇటలీ రోమ్‌లో జరిగిన  ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన కాచిగూడకు చెందిన

Published : 10 Aug 2022 02:45 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: క్రీడల్లో సత్తా చాటాలని గవర్నర్‌ తమిళిసై యువతకు సూచించారు. ఇటలీ రోమ్‌లో జరిగిన  ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన కాచిగూడకు చెందిన నిఖిల్‌యాదవ్‌ను మంగళవారం రాజ్‌భవన్‌లో ఆమె సన్మానించి అభినందనలు తెలిపిన సందర్భంగా మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరుతూ అతను గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు నందకిశోర్‌యాదవ్, మనీశ్‌యాదవ్, సురేశ్‌యాదవ్, జైహింద్‌యాదవ్, అభిమన్యుయాదవ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని